అన్వేషించండి

MP Mithun Reddy : ఎంపీ మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ భద్రత - దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదుతో కేంద్ర హోంశాఖ నిర్ణయం

Andhra Pradesh : ఎంపీ మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని హోంశాఖ నిర్ణయించింది. నియోజకవర్గానికి వెళ్తే తనపై దాడులు జరుగుతున్నాయని ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.

CRPF security to MP Mithun Reddy :  వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్ రక్షణ కల్పించింది. తనపై దాడులు జరుగుతున్నాయని ఇటీవల పుంగనూరులో పర్యటించిన సమయంలో జరిగిన ఘటల్ని ఆయన కేంద్ర హోంశాఖకు వివరించారు. ఆ రోజు జరిగిన గొడవల్లో మిథున్ రెడ్డి గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఓ వాహనాన్ని కూడా దుండగులు తగులబెట్టారు. ఈ పరిణామాల తర్వాత తనకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న  భద్రత సరిపోదని సీఆర్పీఎఫ్ భద్రత కావాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

రాజంపేట నుంచి మూడోసారి గెలిచిన  మిథున్ రెడ్డి               

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట నియోజకవర్గం నుంచి మూడో సారి విజయం సాధించారు. ఆయన తండ్రి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ వస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గాన్ని వ్యక్తిగత సామ్రాజ్యం అన్నట్లుగా మార్చుకుని ఇతర పార్టీల నేతలపై దాడుల చేయడంతో.. ప్రభుత్వం మారిన తర్వాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటన్నారు. గెలిచినప్పటికీ పుంగనూరు వెళ్లేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ప్రయత్నం చేయడం లేదు. ఆయన వస్తే అడ్డుకుంటామని టీడీపీ నేతలు ఇప్పటికే ఆందోళనలు చేశారు. ఇప్పటికే ఓ సారి ఆయన తన పర్యటన ప్రకటించి వాయిదా వేసుకున్నారు. మరోసారి పుంగనూరు వెళ్లే ప్రయత్నం చేయలేదు. 

పుంగనూరుకు వెళ్తే ఘర్షణలు         

మరో వైపు ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం పుంగనూరు వెళ్లేందుకు రెండు, మూడు సార్లు ప్రయత్నం చేశారు. తిరుపతిలోనే పోలీసులు ఆయనను రెండు సార్లు ఆపారు. అయితే ఓ సారి ఎవరికీ చెప్పకుండా ఆయన పుంగనూరులో ప్రత్యక్షం కావడంతో గొడవలు జరిగాయి. ఈ సందర్భంగా  రోజంతా  పుంగనూరులో ఉద్రిక్తత ఏర్పడింది . తర్వాత రోజు కూడా ఆయన పుంగనూరు నియోజకవర్గంలోని సదుంలో పర్యటించారు. అప్పుడు గొడవలేమీ జరగలేదు. తమకు రక్షణ కావాలని అడిగిన ఎంపీలకు ప్రత్యేకంగా కొన్ని  షరతులతో కేంద్ర హోంశాఖ రక్షణ కల్పిస్తుంది. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజుకు కూడా సీఆర్పీఎఫ్ భద్రత కల్పించారు. అయినప్పటికీ ఆయనను హైదరాబాద్‌లో  ఏపీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.         

జగన్ కూడా కేంద్ర సెక్యూరిటీ కోరే అవకాశం 

మాజీ  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర బద్రత కోసం లేఖ రాసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి తనకు కల్పిస్తున్న భద్రతపై సంతృప్తిగా లేరు.  తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని  కోర్టులో పిటిషన్ వేశారు.  నిబంధనల ప్రకారం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అయితే రాష్ట్ర సెక్యూరిటీ కన్నా కేంద్ర సెక్యూరిటీ కాావాలని ఆయన విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.                                    

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget