అన్వేషించండి

Vangalapudi Anitha: 'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

Andhra News: సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Home Minister Vangalapudi Anitha Strong Warning: రాష్ట్ర ప్రభుత్వంపై అసభ్యకరంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారికి రాష్ట్ర హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సచివాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత వైసీపీ నేతలపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వైసీపీ (Ysrcp) కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటామని అన్నారు. 'రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే.. చేయండి. మేం ఎదుర్కొంటాం. బాధ్యతగా సమాధానం ఇస్తాం. అంతే కానీ అసభ్యంగా పోస్టులు పెట్టే వారిని, క్రిమినల్స్‌ను వెనకేసుకు రావడమేంటి.?. మేమేదో వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నామంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేసే వారికి బెయిల్ ఇప్పించేందుకు జగన్ వార్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటే ఏంటో జగన్‌కు తెలుసా.?' అంటూ ప్రశ్నించారు.

'ఐదేళ్ల విధ్వంస పాలన'

గత ఐదేళ్ల విధ్వంస పాలనలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు అనేక దారుణాలు చేశారు. రాష్ట్రం పరువు తీసే విధంగా పాలన సాగించారు. ఈ 5 నెలల కాలంలో ఏవేవో జరిగిపోయాయంటూ జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది. ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు జగన్ ఏం చేశారు.?. వైసీపీ హయాంలో ఎన్ని నేరాలు జరిగాయో లెక్కలు తీయండి. రాష్ట్రంలో ఎన్ని నేరాలు జరిగినా ఐదేళ్లపాటు జగన్ మాట్లాడలేదు. మహిళలు అత్యాచారాలు, హత్యలు జరిగినా ఆయన పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే అనేక మందిపై కేసులు పెట్టారు. అమరావతి మహిళా రైతుల గురించి నీచంగా మాట్లాడారు. డీజీపీ ఆఫీస్ పక్కనున్న టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. జగన్ హయాంలో పరదాలు కట్టుకొని సమావేశాలు పెట్టుకున్నారు. పెన్నులు, నల్లబట్టలు వేసుకున్నా సభలకు రానీయలేదు.' అంటూ మండిపడ్డారు.

సోషల్ మీడియా పోస్టులపై..

క్రిమినల్‌కు కులం, మతం, ప్రాంతం, పార్టీ ముసుగు ఎందుకని మంత్రి అనిత నిలదీశారు. ఏం జరిగినా మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అత్యాచారాలు జరుగుతున్నాయని లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. చీకటి రోజులు అంటే జగన్ తెలుసుకోవాలి. వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డి.. విజయమ్మ, షర్మిల, నాపై దారుణమైన పోస్టులు పెట్టాడు. సొంత తల్లి, చెల్లిని వైసీపీ కార్యకర్తలే తిడుతుంటే జగన్‌కు పౌరుషం రాలేదా.? ఆ మాటలతో మీ రక్తం మరగలేదేమో.. మా రక్తం మరుగుతోంది. వైసీపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. గౌతు శిరీష, చింతకాయల వినయ్, రంగనాయకమ్మను ఇబ్బందులకు గురి చేశారు. కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. అలాంటి పోస్టులు పెట్టిన వారిని వదిలేయాలంటారా.?. అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం.' అంటూ హెచ్చరించారు.

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
YS Jagan Political Strategy: బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!
బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
AP Governance Progress Report: విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!
విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Embed widget