అన్వేషించండి

Vangalapudi Anitha: 'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

Andhra News: సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Home Minister Vangalapudi Anitha Strong Warning: రాష్ట్ర ప్రభుత్వంపై అసభ్యకరంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారికి రాష్ట్ర హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సచివాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత వైసీపీ నేతలపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వైసీపీ (Ysrcp) కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటామని అన్నారు. 'రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే.. చేయండి. మేం ఎదుర్కొంటాం. బాధ్యతగా సమాధానం ఇస్తాం. అంతే కానీ అసభ్యంగా పోస్టులు పెట్టే వారిని, క్రిమినల్స్‌ను వెనకేసుకు రావడమేంటి.?. మేమేదో వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నామంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేసే వారికి బెయిల్ ఇప్పించేందుకు జగన్ వార్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటే ఏంటో జగన్‌కు తెలుసా.?' అంటూ ప్రశ్నించారు.

'ఐదేళ్ల విధ్వంస పాలన'

గత ఐదేళ్ల విధ్వంస పాలనలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు అనేక దారుణాలు చేశారు. రాష్ట్రం పరువు తీసే విధంగా పాలన సాగించారు. ఈ 5 నెలల కాలంలో ఏవేవో జరిగిపోయాయంటూ జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది. ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు జగన్ ఏం చేశారు.?. వైసీపీ హయాంలో ఎన్ని నేరాలు జరిగాయో లెక్కలు తీయండి. రాష్ట్రంలో ఎన్ని నేరాలు జరిగినా ఐదేళ్లపాటు జగన్ మాట్లాడలేదు. మహిళలు అత్యాచారాలు, హత్యలు జరిగినా ఆయన పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే అనేక మందిపై కేసులు పెట్టారు. అమరావతి మహిళా రైతుల గురించి నీచంగా మాట్లాడారు. డీజీపీ ఆఫీస్ పక్కనున్న టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. జగన్ హయాంలో పరదాలు కట్టుకొని సమావేశాలు పెట్టుకున్నారు. పెన్నులు, నల్లబట్టలు వేసుకున్నా సభలకు రానీయలేదు.' అంటూ మండిపడ్డారు.

సోషల్ మీడియా పోస్టులపై..

క్రిమినల్‌కు కులం, మతం, ప్రాంతం, పార్టీ ముసుగు ఎందుకని మంత్రి అనిత నిలదీశారు. ఏం జరిగినా మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అత్యాచారాలు జరుగుతున్నాయని లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. చీకటి రోజులు అంటే జగన్ తెలుసుకోవాలి. వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డి.. విజయమ్మ, షర్మిల, నాపై దారుణమైన పోస్టులు పెట్టాడు. సొంత తల్లి, చెల్లిని వైసీపీ కార్యకర్తలే తిడుతుంటే జగన్‌కు పౌరుషం రాలేదా.? ఆ మాటలతో మీ రక్తం మరగలేదేమో.. మా రక్తం మరుగుతోంది. వైసీపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. గౌతు శిరీష, చింతకాయల వినయ్, రంగనాయకమ్మను ఇబ్బందులకు గురి చేశారు. కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. అలాంటి పోస్టులు పెట్టిన వారిని వదిలేయాలంటారా.?. అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం.' అంటూ హెచ్చరించారు.

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Embed widget