By: ABP Desam | Updated at : 15 Sep 2022 05:17 PM (IST)
చింతకాయల విజయ్కు ఊరట - సీఐడీ కేసులో స్టే ఇచ్చిన హైకోర్టు !
AP Highcourt : తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఎంపీ గోరంట్ల మాధవ్ ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ నమోదు చేసిన కేసుపై హైకోర్టు స్టే విధించింది.కేసులో తనను నిందితుడుగా పేర్కొనడాన్ని టీడీపీ నేత చింతకాయల విజయ్ సవాల్ చేశారు. కేసును కొట్టి వేయాలని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కేసు విచారణపై స్టే విధించింది. సంచలనం సృష్టించిన ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో దాదాపుగా నెల రోజుల తర్వాత గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేయడంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ అశ్లీల వీడియోను సృష్టించి, టీడీపీకి చెందిన ఐ టీడీపీ గ్రూప్లో వ్యాప్తి చేసి తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారంటూ గోరంట్ల మాధవ్ ఆరోపించారు.
వాట్సాప్ గ్రూప్లో చింతకాయల విజయ్ అడ్మిన్ కాదని లాయర్ల వాదన
యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ఫోన్ నంబర్ సాయంతో ఆ వీడియోను ఐ టీడీపీ గ్రూప్లో అప్లోడ్ చేశారని.. ఆ వీడియోకు చింతకాయల విజయ్కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు లాయర్ వాదించారు. ఈ కేసులో విజయ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్ధించారు. వాట్సాప్లో ఎవరైనా గ్రూప్ని సృష్టించవచ్చని.. అందులో ఎంతమందైనా సభ్యులుగా చేరవచ్చన్నారు. బ్రిటన్ నంబరుతో వీడియోను ఐ-టీడీపీ గ్రూప్లో అప్లోడ్ చేశారని ఎంపీ ఆరోపిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.గ్రూప్లో వీడియోను అప్లోడ్ చేసిన వ్యక్తినే ప్రాసిక్యూట్ చేయాలని కోరారు. పిటిషనర్ సంబంధిత గ్రూప్కు అడ్మిన్గా కానీ సభ్యుడుగా కానీ లేరని.. దీనికి విజయ్ని బాధ్యుడిని చేయడం సరికాదని వాదించారు.
రాజకీయంగా కలకలం రేపిన మాధవ్ వీడయో వివాదం
ఎంపీ మాధవ్ మహిళతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ వీడియో ఫేక్ అంటూ ఎంపీ మాధవ్ ఖండించారు. పక్కాగా మార్ఫింగ్ చేశారని.. ఇదంతా కుట్రగా చెప్పుకొచ్చారు. అనంతరం అనంతపురం ఎస్పీ ఈ వీడియో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో మార్ఫింగ్ కావొచ్చని.. ఐ టీడీపీ ఈ వీడియోను వైరల్ చేసిందని చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల క్రితం టీడీపీ అమెరికాలోని ఓ ల్యాబ్కు ఈ వీడియోను పంపామని.. ఇది ఒరిజనల్ అని తేలిందని ఓ రిపోర్ట్ను మీడియా ముందుకు తెచ్చింది. కానీ ఈ రిపోర్ట్ ఫేక్ అంటూ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఎంపీ ఫిర్యాదుతో ఐటీడీపీపై కేసు నమోదు అయ్యింది.
బాధిత మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసుల ప్రకటన
ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రాజకీయంగానూ కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ మధ్య తీవ్రమైన రాజకీయ వాదోపవాదాలు చోటు చేసుకున్నారు. ఆరోపణలు వచ్చాయి. వ్యక్దిగత దూషణలు చోటు చేసుకున్నాయి. మాధవ్ వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఆరోపణలు ఉన్న మహిళలెవరూ ఫిర్యాదు చేయలేదు.దీంతో అది నైతికపరమైన అంశంగానే ఉండిపోయింది. అయితే మార్ఫింగ్ అని ఎంపీ ఫిర్యాదు చేయడంతో సీఐడీ కేసు పెట్టింది.
Anantapur News: డిసెంబర్ 1 ఎయిడ్స్ డే: హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు ఏపీ సర్కార్ పింఛను ఎంతో తెలుసా
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
RK Roja: ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ - 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్లు, కీలక వివరాలు చెప్పిన మంత్రి రోజా
Nara Lokesh: అమ్మ, చెల్లిని చూసినా జగన్కి భయమే, నాగార్జున సాగర్ ఇష్యూ కోడికత్తి లాంటిదే - లోకేశ్
Nagarjuna Sagar Issue: కృష్ణాబోర్డు చేతికి నాగార్జున సాగర్ డ్యాం - కేంద్ర బలగాల పర్యవేక్షణ! సమస్యకు పరిష్కారం
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి
/body>