అన్వేషించండి

Gummanuru Jayaram: గుంతకల్లులో చంద్రబాబు వ్యూహం ఏంటి? టికెట్ ఆయనకే ఎందుకిచ్చారు?

AP Elections News: చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు పార్టీలో చాలామందికి మింగుడు పడటం లేదు. గెలుపే లక్ష్యంగా చంద్రబాబు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

AP Elections 2024: ఆ నియోజకవర్గంలో ఆ నేతకు టికెట్ ఇస్తే సహకరించే పరిస్థితి లేదన్నారు. పక్క జిల్లా నుంచి వచ్చి పార్టీలో చేరితే టికెట్ ఎలా ఇస్తారు అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పైనే ప్రత్యక్షంగా విమర్శలు కూడా గుప్పించారు. అవన్నీ లెక్కచేయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆ నేత పార్టీలోకి చేరగాని గుంతకల్లు అసెంబ్లీ టికెట్లు కేటాయించారు. ఇంతకు ఆ నేత ఎవరు ఆ నేతపైన చంద్రబాబు నాయుడుకి అంత నమ్మకం ఏంటి ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు పార్టీలో చాలామందికి మింగుడు పడటం లేదు. పార్టీ నేతలు సీనియర్లు ఎంత చెప్పినా వినకుండా గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు చెవులు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే గుంతకల్లు నియోజకవర్గం అసెంబ్లీపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టిని సారించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మనూరు జయరాం.. ముఖ్యమంత్రి జగన్ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే వైసీపీ పార్టీలో ఇమడలేక కొన్ని అనివార్య కారణాలతో ఆ పార్టీని విడాల్సి వచ్చింది. దీంతో గుమ్మనూరు జయరాం ఏ పార్టీలోకి వెళ్తారు అని పెద్ద చర్చని కొనసాగింది. అనుకోకుండా గుమ్మనూరు జయరాం టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.  పార్టీలోకి చేరిన వెంటనే అధినేత చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కు ఏకంగా గుంతకల్లు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. 

 వాల్మీకి (బీసీ) నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గుమ్మనూరు జయరాం

వాల్మీకి (బీసీ) సామాజిక వర్గంలో అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నేతగా గుమ్మనూరు జయరాంకు పేరుంది.  ఆలూరు నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో పిఆర్పి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకి సామాజిక వర్గంలో గుర్తింపు తెచ్చుకున్నారు. 

 వ్యతిరేకులను, అసంతృప్తులను ఏకతాటిపైకి తెచ్చుకున్న జయరాం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గుంతకల్లు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో గుంతకల్లు నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అవేమీ లెక్క చేయని గుమ్మనూరు జయరాం ఎన్నికలు నాటికి అందర్నీ ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో నియోజకవర్గంలోని వ్యతిరేకులను,అసంతృప్తులను ఏకం చేసేందుకు జయరాం సోదరుడు నారాయణస్వామి, కుమారుడు ఈశ్వర్ రంగంలోకి దిగారు. మండలాల వారీగా నాయకులతో కలుస్తూ వ్యతిరేకులను అసంతృప్తులను కలిసి పార్టీకి పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో తెలియజేస్తూ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను ఏకతాటిపైకి తెచ్చి గుంతకల్లు నియోజకవర్గంలో గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. 

 పట్టు వీడిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్

ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉండడంతో గుంతకల్లు నియోజకవర్గంలోని అసంతృప్తులను ఏకం చేసేందుకు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి రంగంలోకి దింపి జితేంద్ర గౌడ్ ను పార్టీ కోసం పనిచేయాలని ఆదేశించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధినేత చంద్రబాబు నాయుడు జితేంద్ర గౌడ్ కి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. స్వయంగా అధినేత హామీ ఇవ్వడంతో శాంతిచ్చిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్  గుమ్మనూరు జయరాంకు సహకరించలని నియోజకవర్గ తెలుగుదేశం క్యాడర్ కు పిలుపునిచ్చారు. పార్టీలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మన అధినేత చంద్రబాబునాయుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా పలు సందర్భాల్లో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ప్రసంగించారు. 

 విజయ అవకాశాలు ఎక్కువే 

గుంతకల్లు నియోజకవర్గం వ్యాప్తంగా వాల్మీకి (బీసీ) ఓటర్లు అధికంగా ఉండడంతో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాంకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చినట్లు జోరుగా చర్చ సాగుతుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా గుంతకల్లు,రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గం లో కూడా బీసీ ఓటర్లు అధికంగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి అధినేత చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి వైసీపీ తరఫున బరిలో నిలుస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget