అన్వేషించండి

AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం

Handloom weavers: నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందనుంది.

Free electricity for handloom weavers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది నేతన్నలకు  చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని  నెరవేరుస్తూ,  ఏప్రిల్ 1, 2026  నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయం ద్వారా మగ్గాలకు  నెలకు 200 యూనిట్లు , మరమగ్గాలకు  నెలకు  500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందనుంది. ఈ మేరకు రాష్ట్ర చేనేత , జౌళి శాఖ మంత్రి సవిత అధికారిక ప్రకటన విడుదల చేశారు.                      

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,04,488 కుటుంబాలు  నేరుగా లబ్ధి పొందనున్నాయి. ఇందులో 93,000 చేనేత మగ్గాలున్న కుటుంబాలు, 11,488 పవర్ లూమ్ యూనిట్లు ఉన్నాయి. ఈ రాయితీ వల్ల ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి ఏడాదికి రూ.8,640 , అలాగే పవర్ లూమ్ యూనిట్లకు రూ.21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ప్రభుత్వం ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.150 కోట్లు  వెచ్చించనుంది. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ భారంతో సతమతమైన నేతన్నలకు ఈ నిర్ణయం ఒక గొప్ప ఊరటగా మారింది.
 
కేవలం విద్యుత్ రాయితీకే పరిమితం కాకుండా, చేనేత రంగాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే 50 ఏళ్లు నిండిన నేతన్నలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.3,000 నుండి  రూ. 4,000లకు  పెంచింది. కొత్త యంత్రాల కొనుగోలుపై  90 శాతం రాయితీ అందిస్తోంది.  నూలు, రసాయనాలపై 15 శాతం  రాయితీ ఇస్తూ, నాణ్యమైన ముడిసరుకును సరఫరా చేస్తోంది. చేనేత కార్మికులను యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పరిధిలోకి తెచ్చి వారి ఆరోగ్యానికి భరోసా కల్పించింది.                                              
 
నేతన్నలు తయారు చేసిన వస్త్రాలకు సరైన ధర కల్పించేందుకు ప్రభుత్వం సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా తనేరా, బిర్లా ఆదిత్య వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా నేరుగా వినియోగదారులకే అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకుంది. విశాఖపట్నంలో 172 కోట్లతో యూనిటీ మాల్  ఏర్పాటుతో పాటు మంగళగిరి, ఎమ్మిగనూరు, ధర్మవరం వంటి ప్రాంతాల్లో టెక్స్‌టైల్ పార్కులు,  మెగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తూ చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొస్తోంది.                                  
 
ఎన్నికల హామీని ఇంత త్వరగా అమలు చేస్తూ, విద్యుత్ కష్టాల నుంచి విముక్తి కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి సవితకు చేనేత సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. ఈ పథకం కేవలం రాయితీ మాత్రమే కాదని, చేనేత కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక గొప్ప సామాజిక భద్రతా కవచమని రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.          

టాప్ హెడ్ లైన్స్

Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Seediri Appalaraju Arrest: మెడకు చుట్టుకున్న కుమారుడి హిట్ అండ్ రన్ కేసు - మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
మెడకు చుట్టుకున్న కుమారుడి హిట్ అండ్ రన్ కేసు - మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- నిందితుడు ఒంగోలు రైల్వేస్టేషన్‌లో అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- నిందితుడు ఒంగోలు రైల్వేస్టేషన్‌లో అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
Embed widget