అన్వేషించండి

Kiran In Delhi : బీజేపీ పెద్దలతో కిరణ్ వరుస భేటీలు -ఫస్ట్ టార్గెట్ కర్ణాటకనా ?

బీజేపీ అగ్రనేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. అమిత్ షాతో అరగంట పాటు చర్చలు జరిపారు.


Kiran In Delhi :  భారతీయ జనతా పార్టీలో చేరిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి వరుసగా ఆ పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్నారు.  కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో పార్టీలో చేరిన ఆయన శుక్రవారం సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. శనివారం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. దాదాపుగా  40 నిమిషాల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాజకీయాలపైనాచర్చించారు.  మరో సీనియర్ నేత బీఎల్ సంతోష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.               

కిరణ్ కుమార్ రెడ్డి అనుభవాన్ని ముందుగా కర్ణాటక ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో తెలుగు ఓటర్ల ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుంది. కనీసం ఇరవై నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు గెలుపోటముల్ని ప్రభావితం చేయగలరు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డికి  ముందుగా కర్ణాటక ఎన్నికల్లో ఓ ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన చేస్తున్నట్లగా చెబుతున్నారు. కర్ణాటకలో ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ క్రమంలో ఆయన నేరుగా ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉండదు కానీ.. ఆయన ఆలోచనలను ఎన్నికల్లో వాడుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.                     

మరో వైపు ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాల్లోకి కిరణ్ కుమార్ రెడ్డిని పంపకపోచ్చని.. ఆయనను పార్టీలో చేర్చుకున్న వ్యూహం జాతీయ రాజకీయాలని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వం ఆయనకో పదవి ఇస్తుందని..  జాతీయంగా పార్టీ కోసం పని చేస్తారని.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా జోక్యం  చేసుకోకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పని చేసినందున తెలంగాణలో రాజకీయాలపైనా ఆయనకు అవగాహన ఉంటుంది. సమైక్యాంధ్ర పార్టీ పెట్టినందన ఆయన జోక్యం నేరుగా తెలంగాణలో ఉండకపోవచ్చు కానీ.. ఢిల్లీలో ఉంటూ తెలంగాణ పై రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో కిరణ్ రెడ్డి వ్యూహాత్మకంగా పని చేయవచ్చునని అంచనా వేస్తున్నారు.                               

కిరణ్ కుమార్ రెడ్డి చేరిక కోసం ఢిల్లీ వెళ్లిన వారిలో ఎక్కువ మంది ఏపీ బీజేపీ నేతలు లేరు. సోము వీర్రాజు సహా కీలక నేతలంతా ఏపీలోనే ఉన్నారు. అయితే వారెవరూ కిరణ్ రెడ్డి చేరికపై వ్యతిరేకత వ్యక్తం  చేయడంలేదు. అందరూ స్వాగతించారు. కలిసి పని చేస్తామన్నారు. అలాంటప్పుడు.. బీజేపీ నేతలంతా కిరణ్ రెడ్డి చేరిక కార్యక్రమలో పాల్గొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ బీజేపీ నేతలు మాత్రం.. కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ రాజకీయాల కోణంలోనే హైకమాండ్ చేర్చుకుందని అందుకే చేరిక విషయంలో రాష్ట్ర నేతలతో పెద్దగా సంప్రదింపులు జరపలేదని.. సమాచారం కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj Arrest Demand: ప్రకాష్ రాజ్ కూడా కుట్ర దారుడే - తక్షణం అరెస్టు చేయాలి - పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణువర్ధన్
ప్రకాష్ రాజ్ కూడా కుట్ర దారుడే - తక్షణం అరెస్టు చేయాలి - పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణువర్ధన్
Breaking News: రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల
రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Embed widget