అన్వేషించండి

YSRCP: మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం

YSRCPLP meeting: అసెంబ్లీకి వెళ్లకూడదని.. మండలికి మాత్రం వెళ్లాలని జగన్ నిర్ణయించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు.

YSRCPLP meeting:  అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం, ప్రతిపక్ష గొంతు నొక్కేలా అధికార కూటమి వ్యవహరిస్తోందన్న కారణంగా అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ నిర్ణయించారు.  ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వరని, కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఉండదని జగన్  అభిప్రాయపడ్డారు. ప్రజా క్షేత్రంలోనే ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, అందుకే అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ తన ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు.    

శాసనమండలికి హాజరు కానున్న వైసీపీ ఎమ్మెల్సీలు                 
 
అసెంబ్లీకి జగన్ సహా ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి  విషయంలో మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అనుసరించారు. మండలిలో వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ తమ గళాన్ని వినిపించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలందరూ తప్పనిసరిగా మండలి సమావేశాలకు హాజరై, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, బిల్లులపై లోతుగా చర్చించాలని జగన్ ఆదేశించారు.               

నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యేలు                                        
 
అసెంబ్లీకి వెళ్లని సమయంలో ఎమ్మెల్యేలు ఖాళీగా ఉండకుండా, నియోజకవర్గాల్లో పర్యటించాలని జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న  సూపర్ సిక్స్ పథకాల వైఫల్యాలు, పెరిగిన ధరలు, శాంతి భద్రతల సమస్యలపై ప్రజల్లోకి వెళ్లి చైతన్యపరచాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న అప్రజాస్వామిక పరిణామాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రాకపోవడం వల్ల ప్రజా సమస్యలు ఎలా చర్చకు వస్తాయని అధికార పక్షం విమర్శిస్తోంది. అయితే, గౌరవం లేని చోట ఉండి ప్రయోజనం లేదని జగన్ వర్గం వాదిస్తోంది.             

స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదన్న అప్పిరెడ్డి                      

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం అనంతరం ఎమ్మెల్సీ  లేళ్ల అప్పిరెడ్డి సమావేశ వివరాలను వెల్లడించారు.  అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, గొంతు నొక్కేలా వ్యవహరిస్తున్న అధికార కూటమి ధోరణికి నిరసనగా తాము శాసనసభను బహిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే కనీస అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
 శాసనసభను బహిష్కరించినప్పటికీ, శాసనమండలి  సమావేశాలకు తాము తప్పకుండా హాజరవుతామని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. మండలిలో వైఎస్సార్‌సీపీకి బలం ఉన్నందున, అక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, ప్రజా సమస్యలపై నిలదీస్తామని చెప్పారు. అసెంబ్లీకి వెళ్లని సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తారని, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తారని ఆయన పేర్కొన్నారు.  సూపర్ సిక్స్  పథకాల అమలులో వైఫల్యం, శాంతిభద్రతల క్షీణతపై ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
 స్పీకర్ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని అప్పిరెడ్డి విమర్శించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget