అన్వేషించండి

Andhra farmers: మామిడి, ఉల్లి ఇప్పుడు అరటి - ఏపీలో రైతుల పంటలకు దక్కని గిట్టుబాటు ధర - ప్రభుత్వం ఏం చేస్తోంది?

Andhra Pradesh: ఏపీలో రైతుల పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. కానీ ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్‌లో మామిడి, ఉల్లి, అరటి పంటలకు మద్దతు ధర లభించడం లేదు.
  • అధిక ఉత్పత్తి, ఎగుమతులు తగ్గడంతో రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు.
  • ప్రభుత్వం ప్రకటించిన సహాయం, పథకాలు రైతులకు పూర్తిగా అందడం లేదు.
  • హార్టికల్చర్ పంటలకు కేటాయించిన బడ్జెట్‌ కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.

Farmers in AP are not getting remunerative prices for their crop: ఆంధ్రప్రదేశ్‌లో రైతులు పంట చేతికి వచ్చిన ప్రతీ సారి ఇబ్బంది పడుతున్నారు. మొదట తోతాపురి మామిడి కాయలకు డిమాండ్ లేక ఆందోళన చెందారు. తర్వాత ఉల్లి పంట పరిస్థితి అదే. ఇప్పుడు అరటి పంటలకూ డిమాండ్ ఉండటం లేదు.  గత ఆర్థిక సంవత్సరంలో తోతాపురి మామిడి రైతులు  ధరలు పడిపోవడంతో రూ.1,000 కోట్ల నష్టం చవిచూశారు.   సెప్టెంబర్‌లో ఉల్లి ధరలు పడిపోయి, కర్నూల్, కడప జిల్లాల్లో రైతులు పంటను పారబోశారు. ఇప్పుడు అరటి పంటలకూ అదే పరిస్థితి వచ్చింది. 

చేతికొస్తున్నపంటలకు దక్కని మద్దతు ధరలు                                    

ఆంధ్రప్రదేశ్‌లో 18 ముఖ్య ఆహార పంటల్లో మామిడి, ఉల్లి, అరటి ప్రధానమైనవి. 2024-25లో మామిడి పంటలు అధిక ఉత్పత్తి ధర తగ్గుబాటు కారణంగా  రైతులు భారీ నష్టం చవిచూశారు. ప్రభుత్వం కొంత సాయం చేసింది. సెప్టెంబర్‌లో ఉల్లి  రైతులకు అదే సమస్య వచ్చింది.ఇప్పుడు అరటి రైతులు గగ్గోలు పెడుతున్నారు.  డిమాండ్ , ఎగుమతులు తగ్గడం, లోకల్ మార్కెట్ స్థిరత్వం లేకపోవడం వల్ల ధర పడిపోయాయి.   2025లో ఆంధ్రలో హార్టికల్చర్ పంటలు 30 శాతం పెరిగింది. కానీ మద్దతు ధర  విధానం సరిగ్గా లేకపోవడం వల్ల  రైతులు లాభాలు పొందలేకపోతున్నారు.  ఫలితంగా, రైతుల ఆదాయం 40 శాతం తగ్గిందని చెబుతున్నారు. 

ఉల్లి, తోతాపురి రైతులకు ఏపీ ప్రభుత్వ సాయం                

సెప్టెంబర్ 2025లో ధరల పతనంతో  రూ.50,000/ హెక్టారుకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  - 24,000 మంది రైతులు ప్రయోజనం పొందారు.  నవంబర్ 2025లో మార్కెట్ ధరలు మెరుగుపడ్డాయి.  జూలై 2025లో కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (MIS) ఆమోదించి తోతాపురి రైతులకు  రూ.1,490 క్వింటాల్ మద్దతు ధర  నిర్ణయించింది. రాష్ట్రం రూ.4 కేజీ సబ్సిడీ  మొత్తం రూ.260 కోట్లు ఇచ్చింది.  అక్టోబర్ 2025లో రూ.172.84 కోట్లు 37,881 మంది రైతుల అకౌంట్లలో జమ చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రైతులు ప్రధానంగా ప్రయోజనం పొందారు. 

పంటలు ఎక్కువగా పండటం వల్ల సమస్యలు 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతు పథకాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు  ప్రారంబించడం వంటి చర్యలు ప్రకటించింది. అరటి పంటలకు MSP ఇవ్వడానికి  చర్యలు తీసుకుంటున్నామనిప్రకటించారు.   కానీ, ఇదంతా  పేపర్ల మీదనే ఉన్నాయని రైతుల వరకూ వెళ్లడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ప్రభుత్వం డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని  చెబుతుంది.  ఇన్‌పుట్ సబ్సిడీలు,  కోల్డ్ స్టోరేజ్ సమస్యలు ఉండటంతో రైతులు మధ్యవర్తుల చేతిలో మోసపోతున్నారు.  2025లో హార్టికల్చర్ పంటలకు 1500 కోట్లు బడ్జెట్ కేటాయించినప్పటికీ, గ్రౌండ్ లెవల్‌లో అమలు జరగడం లేదు. పంటలు అనూహ్యంగా ఎక్కువగా పండటం వల్ల  ఇతర చోట్ల డిమాండ్ తగ్గిపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం ఎంత సాయం చేసినా రైతులు మాత్రం నష్టపోతూనే ఉన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget