అన్వేషించండి

Andhra farmers: మామిడి, ఉల్లి ఇప్పుడు అరటి - ఏపీలో రైతుల పంటలకు దక్కని గిట్టుబాటు ధర - ప్రభుత్వం ఏం చేస్తోంది?

Andhra Pradesh: ఏపీలో రైతుల పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. కానీ ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్‌లో మామిడి, ఉల్లి, అరటి పంటలకు మద్దతు ధర లభించడం లేదు.
  • అధిక ఉత్పత్తి, ఎగుమతులు తగ్గడంతో రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు.
  • ప్రభుత్వం ప్రకటించిన సహాయం, పథకాలు రైతులకు పూర్తిగా అందడం లేదు.
  • హార్టికల్చర్ పంటలకు కేటాయించిన బడ్జెట్‌ కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.

Farmers in AP are not getting remunerative prices for their crop: ఆంధ్రప్రదేశ్‌లో రైతులు పంట చేతికి వచ్చిన ప్రతీ సారి ఇబ్బంది పడుతున్నారు. మొదట తోతాపురి మామిడి కాయలకు డిమాండ్ లేక ఆందోళన చెందారు. తర్వాత ఉల్లి పంట పరిస్థితి అదే. ఇప్పుడు అరటి పంటలకూ డిమాండ్ ఉండటం లేదు.  గత ఆర్థిక సంవత్సరంలో తోతాపురి మామిడి రైతులు  ధరలు పడిపోవడంతో రూ.1,000 కోట్ల నష్టం చవిచూశారు.   సెప్టెంబర్‌లో ఉల్లి ధరలు పడిపోయి, కర్నూల్, కడప జిల్లాల్లో రైతులు పంటను పారబోశారు. ఇప్పుడు అరటి పంటలకూ అదే పరిస్థితి వచ్చింది. 

చేతికొస్తున్నపంటలకు దక్కని మద్దతు ధరలు                                    

ఆంధ్రప్రదేశ్‌లో 18 ముఖ్య ఆహార పంటల్లో మామిడి, ఉల్లి, అరటి ప్రధానమైనవి. 2024-25లో మామిడి పంటలు అధిక ఉత్పత్తి ధర తగ్గుబాటు కారణంగా  రైతులు భారీ నష్టం చవిచూశారు. ప్రభుత్వం కొంత సాయం చేసింది. సెప్టెంబర్‌లో ఉల్లి  రైతులకు అదే సమస్య వచ్చింది.ఇప్పుడు అరటి రైతులు గగ్గోలు పెడుతున్నారు.  డిమాండ్ , ఎగుమతులు తగ్గడం, లోకల్ మార్కెట్ స్థిరత్వం లేకపోవడం వల్ల ధర పడిపోయాయి.   2025లో ఆంధ్రలో హార్టికల్చర్ పంటలు 30 శాతం పెరిగింది. కానీ మద్దతు ధర  విధానం సరిగ్గా లేకపోవడం వల్ల  రైతులు లాభాలు పొందలేకపోతున్నారు.  ఫలితంగా, రైతుల ఆదాయం 40 శాతం తగ్గిందని చెబుతున్నారు. 

ఉల్లి, తోతాపురి రైతులకు ఏపీ ప్రభుత్వ సాయం                

సెప్టెంబర్ 2025లో ధరల పతనంతో  రూ.50,000/ హెక్టారుకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  - 24,000 మంది రైతులు ప్రయోజనం పొందారు.  నవంబర్ 2025లో మార్కెట్ ధరలు మెరుగుపడ్డాయి.  జూలై 2025లో కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (MIS) ఆమోదించి తోతాపురి రైతులకు  రూ.1,490 క్వింటాల్ మద్దతు ధర  నిర్ణయించింది. రాష్ట్రం రూ.4 కేజీ సబ్సిడీ  మొత్తం రూ.260 కోట్లు ఇచ్చింది.  అక్టోబర్ 2025లో రూ.172.84 కోట్లు 37,881 మంది రైతుల అకౌంట్లలో జమ చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రైతులు ప్రధానంగా ప్రయోజనం పొందారు. 

పంటలు ఎక్కువగా పండటం వల్ల సమస్యలు 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతు పథకాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు  ప్రారంబించడం వంటి చర్యలు ప్రకటించింది. అరటి పంటలకు MSP ఇవ్వడానికి  చర్యలు తీసుకుంటున్నామనిప్రకటించారు.   కానీ, ఇదంతా  పేపర్ల మీదనే ఉన్నాయని రైతుల వరకూ వెళ్లడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ప్రభుత్వం డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని  చెబుతుంది.  ఇన్‌పుట్ సబ్సిడీలు,  కోల్డ్ స్టోరేజ్ సమస్యలు ఉండటంతో రైతులు మధ్యవర్తుల చేతిలో మోసపోతున్నారు.  2025లో హార్టికల్చర్ పంటలకు 1500 కోట్లు బడ్జెట్ కేటాయించినప్పటికీ, గ్రౌండ్ లెవల్‌లో అమలు జరగడం లేదు. పంటలు అనూహ్యంగా ఎక్కువగా పండటం వల్ల  ఇతర చోట్ల డిమాండ్ తగ్గిపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం ఎంత సాయం చేసినా రైతులు మాత్రం నష్టపోతూనే ఉన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Ampolu Jail Visit: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Why YSRCP Fire Brands Silent: వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget