అన్వేషించండి

Kuppam Tension : కుప్పంలో దొంగ ఓటర్ల కలకలం ... పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత !

మినీ మున్సిపల్ సమరంలో అందరి దృష్టి చంద్రబాబు నియోజకవర్గం అయిన కుప్పంపైనే ఉంది. అక్కడ ఉదయం నుంచి దొంగ ఓటర్లు భారీగా వచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మినీ స్థానిక సమరంలో అందరి చూపు కుప్పం మున్సిపల్ ఎన్నికలపైనే ఉంది. చంద్రబాబు నియోజకవర్గంలో మున్సిపాలిటీని గెలిచి సత్తా చాటాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతూండగా..  పట్టు చూపించేందుకు టీడీపీ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. రెండు రోజుల నుంచి అధికార వైఎస్ఆర్‌సీపీ నేతలు దొంగ ఓటర్లను పట్టణంలోకి తీసుకొచ్చి ఉంచారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పలు చోట్ల గుంపులుగా ఉన్న వారిని పట్టించే ప్రయత్నం చేశారు. పోలింగ్ రోజు కూడా అదే దొంగ ఓటర్ల హడావుడి కుప్పంలో కనిపిస్తోంది. 

 

Also Read : అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటింగ్‌కు దూరంగా ఉండే వారిని.. వలస ఓటర్లను గుర్తించి వారి ఓట్లను ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన వారితో వేయిస్తున్నారని వాలంటీర్లు సహకరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ నేతలు చెకింగ్ చేస్తున్నారు. ఈ సందర్బం ఆ ప్రాంతానికి సంబంధం లేని వారు ఓటింగ్‌కు వస్తే పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. ఇలా దొంగ ఓటర్లను పట్టుకున్నామని టీడీపీ నేతలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నారా లోకేష్ కూడా ఈ వీడియోలను ట్వీట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. 

 

Also Read : విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా

కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉండగా 24 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓ వార్డు ఏకగ్రీవం అయినట్లుగా అధికారులు ప్రకటిచారు. మున్సిపల్‌ పరిధిలో మొత్తం 48 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 9 సమస్యాత్మక, మరో 9 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా డిక్లేర్ చేసి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు కాకుండా వారికి రక్షణ కల్పించేందుకు పని చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్నారు. పలు చోట్ల టీడీపీ నేతలే దొంగ ఓటర్లను పట్టుకుని .. వీడియోలు తీస్తున్నారు. 

Also Read : అప్పుడు అమ్మఒడి ఇప్పుడు అమ్మకానికో బడి... విద్యాసంవత్సరం మధ్యలో విలీనమా... ఏపీ సర్కార్ పై పవన్ ఫైర్

కమతమూరులో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపారు. 16వ వార్డులో టీడీపీ అభ్యర్థిని, ఏజెంట్‌ను పోలింగ్ కేంద్రం నుంచి పంపేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేయిస్తున్నారని అడ్డుకోవాలని ఎస్ఈసీ నీలం సాహ్నీకి ఫిర్యాదు చేశారు.

Also Read: దావోస్‌కు సీఎం జగన్ ! వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆహ్వానాన్ని మన్నిస్తారా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget