అన్వేషించండి

Southern Zonal Council Meet: విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా

తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం నిధులు, విభజన హామీలపై మాట్లాడారు.

ఏపీలోని తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభం అయ్యింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశం రాత్రి 7 వరకు జరగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ఏపీ సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. సమావేశం అజెండాను అంతర్రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి ప్రవేశపెట్టారు. ఈ సమావేశానికి అమిత్ షా ముగింపు ఉపన్యాసం చేస్తారు. ఈ సమావేశం అజెండాలో మొత్తం 26 అంశాలు ఉన్నాయి. గత సమావేశ నిర్ణయాలకు సంబంధించిన 2 నివేదికలపై కూడా చర్చ జరగనుంది. తర్వాతి సమావేశం వేదిక ఖరారు, మరో 24 కొత్త అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.


Southern Zonal Council Meet: విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా

ఎవరెవరు హాజరు

ఈ సమావేశంలో తమిళనాడు నుంచి ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్నుమూడి, కేరళ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి రాజన్, తెలంగాణ నుంచి హోం మంత్రి మహమూద్ అలీ, పుదుచ్చేరి సీఎం రంగసామి, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, ఏపీ సీఎం జగన్, పుదుచ్చేరి ఇంఛార్జి గవర్నర్ తమిళిసై, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవ్ంద్ర కుమార్ జోషి, లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు.

Also Read: గుడికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడికి వచ్చినా అంతే పుణ్యం: వెంకయ్య నాయుడుSouthern Zonal Council Meet: విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా

విభజన హామీలపై సీఎం జగన్ కీలక ఉపన్యాసం

సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని సీఎం జగన్ అన్నారు. విభజన జరిగి ఏడేళ్లైనా హామీలు ఇప్పటి వరకూ అమలుకాలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. తెలంగాణ నుంచి విద్యుత్ బాకీలు రాలేదన్న సీఎం.. రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు పూర్తికాలేదన్నారు. విద్యుత్ రుణాల్లో కోత విధిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారించాలని సీఎం జగన్ కోరారు. దీని కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో మాట్లాడిన సీఎం జగన్.. విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదన్నారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. Southern Zonal Council Meet: విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా

Also Read: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్... నడకదారిలో వచ్చే భక్తులకు దర్శనాలు..!

" 'పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. రీసోర్స్‌ గ్యాప్‌నూ భర్తీచేయలేదు, ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు. తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలను ఇప్పించాలి. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు కేంద్రం ఊరట నివ్వాలి. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా ఇంకా జరగలేదు.  గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్రాల్లో రేషన్‌ లబ్ధిదారుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదు. దీంట్లో వెంటనే సరవణలు చేయాలి'-- "
-సీఎం జగన్ మోహన్ రెడ్డి

Also Read: 'ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు.. నా కోరిక నేటికి నెరవేరింది'

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్
శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్
Budget 2025: బీమా ప్రీమియంలపై GST రద్దు, ప్రత్యేక పన్ను మినహాయింపులు - SBI రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
బీమా ప్రీమియంలపై GST రద్దు, ప్రత్యేక పన్ను మినహాయింపులు - SBI రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
Revanth Reddy: పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
Nikhil Malayakkal: సింగిల్ అని మరోసారి కన్ఫామ్ చేసిన బిగ్ బాస్ విన్నర్ నిఖిల్... కావ్యతో అంతా ముగిసినట్టేనా?
సింగిల్ అని మరోసారి కన్ఫామ్ చేసిన బిగ్ బాస్ విన్నర్ నిఖిల్... కావ్యతో అంతా ముగిసినట్టేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna Padma Bhushan | నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ | ABP DesamRing Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP DesamKCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP DesamSS Rajamouli Post on Mahesh Babu | ఒక్క పోస్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్
శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్
Budget 2025: బీమా ప్రీమియంలపై GST రద్దు, ప్రత్యేక పన్ను మినహాయింపులు - SBI రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
బీమా ప్రీమియంలపై GST రద్దు, ప్రత్యేక పన్ను మినహాయింపులు - SBI రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
Revanth Reddy: పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
Nikhil Malayakkal: సింగిల్ అని మరోసారి కన్ఫామ్ చేసిన బిగ్ బాస్ విన్నర్ నిఖిల్... కావ్యతో అంతా ముగిసినట్టేనా?
సింగిల్ అని మరోసారి కన్ఫామ్ చేసిన బిగ్ బాస్ విన్నర్ నిఖిల్... కావ్యతో అంతా ముగిసినట్టేనా?
Batool Begum : రాముని కీర్తనలు పాడే బతూల్ బేగంను వరించిన పద్మశ్రీ - ఇంతకీ ఆమె ఎవరంటే..
రాముని కీర్తనలు పాడే బతూల్ బేగంను వరించిన పద్మశ్రీ - ఇంతకీ ఆమె ఎవరంటే..
Republic Day Google Doodle: రిపబ్లిక్ డే గూగుల్ డూడుల్ చూశారా? దాన్ని ఎవరు రూపొందించారు? అర్థం ఏంటంటే
రిపబ్లిక్ డే గూగుల్ డూడుల్ చూశారా? దాన్ని ఎవరు రూపొందించారు? అర్థం ఏంటంటే
Padma Award 2025: 2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
Padma Awards: ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
Embed widget