అన్వేషించండి

AP Employees : సమస్యలు పరిష్కరించకపోతే పోరు బాట.. ఏపీ ప్రభుత్వానికి రెండు ఉద్యోగ సంఘాల హెచ్చరిక !

ఏపీలో రెండు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. ఏపీ ఎన్జీవో, అమరావతి ఏపీ జేఏసీ నేతలు సమస్యల్ని పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.


ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్యోగ సంఘం నేతలు కోరారు. సమస్యలు పరిష్కరించకపోత ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. విజయవాడలో ఉద్యోగ సంఘం నేతలు మీడియా సమావేశం పెట్టారు. సమస్యలు చెప్పుకోవడానికి సీఎం జగన్ అవకాశం ఇవ్వడం లేదన్నారు.  అమరావతి ఏపీ జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సంఘాలు సమస్యల సాధనకై ఏకతాటిపైకి వచ్చాయని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు  ప్రకటించారు.

Also Read : పాదయాత్రలో చూసి కష్టాలు తీరుస్తున్నా .. ! రెండో విడత ఆసరా నిధులు విడుదల చేసిన సీఎం జగన్ !

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలు సరైన సమయంలో ఇవ్వడంలేదని, పెన్షన్లు అందని పరిస్థితి నెలకుందని ఉద్యోగ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. డీఏ ఏరియర్స్, పీఆర్సీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు.  సమస్యల పరిష్కారానికి చీఫ్ సెక్రటరీతో మరోసారి చర్చిస్తామని  సానుకూల నిర్ణయం రాకపోతే ఉమ్మడి సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు కరోనాతో మరణిస్తే, మట్టి ఖర్చులకు కూడా నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఒకలాగా, ఖర్చులు మరోలా చేస్తున్నారని విమర్శించారు. 11వ పీఆర్సీ 39 నెలలుగా పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు.  

Also Read : బద్వేలులో త్రిముఖ పోటీ.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ !

ఏపీలో సీపీఎస్ ఉద్యోగులు ఇప్పటికే పోరుబాట పట్టారు.  అధికారలోకి వస్తే వారంలో సీపీఎస్ రద్దు అని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కానీ రద్దు చేయలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని.. ఉద్యోగుల్లో అసంతృప్తి పేరుకుపోతోంది.   సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు మాత్రం.. పాత పెన్షన్ విధానంపై గంపెడాశలు పెట్టుకున్నారు. వారంతా ఓ సంఘంగా ఏర్పడ్డాయి.ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేష‌న్  గా ఏర్పడ్డారు.   నిరసనలు ప్రారంభించాలరు. క్విట్ సీపీఎస్ పేరుతో ఉద్యమాలు చేస్తూ పింఛ‌ను విద్రోహ దినం-న‌య‌వంచ‌న స‌భ‌లు కూడా నిర్వహిస్తున్నారు. 

Also Read : "అమరావతి పాఠం" తొలగింపుపై విమర్శలు .. స్పందించని ప్రభుత్వం !

ఇటీవలి కాలంలో ఉద్యోగులకు నెల జీతాలే సక్రమంగా రావడం లేదు. దీంతో పెండింగ్‌లో డీఏలు.. పీఆర్సీ గురించిన సమస్యలను కూడా ప్రస్తావిస్తూ ఇతర ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళనలు ప్రారంభిస్తున్నాయి. ఇప్పటి వరకూ సీపీఎస్ రద్దు, పీఆర్సీ, డీఏల విషయంలో ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇవ్వలేదు. అదే సమయంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకపోతూడంటంతో  ఉద్యోగ సంఘాల నేతలపై ఒత్తిడి పెరుగుతోంది.  సమస్యలు చెప్పుకునేందుకు వారికి అవకాశం లభించకపోవడంతో మీడియా ముందుకు వస్తున్నారు. 

Also Read: దసరాకి ఏపీలో 4 వేల స్పెషల్ బస్సులు, ఈ బస్సులెక్కితే 50 శాతం అధిక ఛార్జీ.. ఎందుకంటే..: ఆర్టీసీ ఎండీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mancherial Latest News: మంచిర్యాల జిల్లాలో ఎరువుల కష్టాలు-  యూరియా కోసం రైతుల బారులు- ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఫైర్
మంచిర్యాల జిల్లాలో ఎరువుల కష్టాలు- యూరియా కోసం రైతుల బారులు- ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఫైర్
Param Sundari: జాన్వీ కపూర్ 'పరమ్ సుందరి' మూవీపై కాంట్రవర్సీ - ఆ ప్లేస్‌లో రొమాంటిక్ సీన్స్ ఏంటి?
జాన్వీ కపూర్ 'పరమ్ సుందరి' మూవీపై కాంట్రవర్సీ - ఆ ప్లేస్‌లో రొమాంటిక్ సీన్స్ ఏంటి?
Breaking News: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం- జగన్ అడ్డాలో వైసీపీ డిపాజిట్ గల్లంతు
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం- జగన్ అడ్డాలో వైసీపీ డిపాజిట్ గల్లంతు
Cloud burst in Kashmir: కశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ - రిస్క్‌లో 300 మంది ప్రాణాలు - సాహసోపేత యాత్ర మార్గంలో ఘటన !
కశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ - రిస్క్‌లో 300 మంది ప్రాణాలు - సాహసోపేత యాత్ర మార్గంలో ఘటన ! వీడియో
Advertisement

వీడియోలు

Arjun Tendulkar Engagement with Sania Chandok | అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్మెంట్
Cricketer Nitish Reddy at Athadu Re - Release |  అతడు సినిమా చూసిన స్టార్ క్రికెటర్
Minister Narayana Surprise Visit in Vijayawada | మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన
RR Exchange for Trading Sanju Samson | CSK తో RR డీల్ ?
Srikakulam లో స్వాతంత్ర సమరయోధులకు గుడి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Latest News: మంచిర్యాల జిల్లాలో ఎరువుల కష్టాలు-  యూరియా కోసం రైతుల బారులు- ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఫైర్
మంచిర్యాల జిల్లాలో ఎరువుల కష్టాలు- యూరియా కోసం రైతుల బారులు- ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఫైర్
Param Sundari: జాన్వీ కపూర్ 'పరమ్ సుందరి' మూవీపై కాంట్రవర్సీ - ఆ ప్లేస్‌లో రొమాంటిక్ సీన్స్ ఏంటి?
జాన్వీ కపూర్ 'పరమ్ సుందరి' మూవీపై కాంట్రవర్సీ - ఆ ప్లేస్‌లో రొమాంటిక్ సీన్స్ ఏంటి?
Breaking News: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం- జగన్ అడ్డాలో వైసీపీ డిపాజిట్ గల్లంతు
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం- జగన్ అడ్డాలో వైసీపీ డిపాజిట్ గల్లంతు
Cloud burst in Kashmir: కశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ - రిస్క్‌లో 300 మంది ప్రాణాలు - సాహసోపేత యాత్ర మార్గంలో ఘటన !
కశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ - రిస్క్‌లో 300 మంది ప్రాణాలు - సాహసోపేత యాత్ర మార్గంలో ఘటన ! వీడియో
Telangana Vehicle Tax: తెలంగాణలో వాహనదారులకు షాక్‌- లైఫ్‌ ట్యాక్స్‌, ఫ్యాన్సీ నంబర్‌ ఫీజులు భారీగా పెంపు – కొత్త రేట్లు ఇవే
తెలంగాణలో కొత్త బండి కొనేవాళ్లకు బిగ్‌షాక్- లైఫ్‌ ట్యాక్స్‌, ఫ్యాన్సీ నంబర్లకు కొత్త రేట్లు
Puivendula Latest News : పులివెందుల జడ్పీటీసీలో టీడీపీ విజయం జగన్‌కు ఎదురుదెబ్బేనా? వైసీపీ పని అయిపోయిందా?
పులివెందుల జడ్పీటీసీ ఫలితం జగన్‌కు ఎదురుదెబ్బేనా? ఈ విజయం టీడీపీ బలుపా? వాపా?
Kumram Bheem Asifabad Latest News: శామీర్‌పేట్ వద్ద దిందా పోడు రైతుల అరెస్ట్, ఆసిఫాబాద్‌కు తరలింపు- పోరాటం ఆగబోదన్న గిరిజనం
శామీర్‌పేట్ వద్ద దిందా పోడు రైతుల అరెస్ట్, ఆసిఫాబాద్‌కు తరలింపు- పోరాటం ఆగబోదన్న గిరిజనం
Coolie OTT Platform: తలైవా పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ 'కూలీ' - ఏ ఓటీటీలోకిి వస్తుందో తెలుసా?
తలైవా పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ 'కూలీ' - ఏ ఓటీటీలోకిి వస్తుందో తెలుసా?
Embed widget