అన్వేషించండి

MP Raghurama Krishn Raju : ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్ పై విచారణ, ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ హాజరు!

MP Raghurama Krishn Raju : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ పై లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ నిర్వహించింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ లోక్ సభ స్పీకర్ కు రఘురామపై ఫిర్యాదు చేసింది.


MP Raghurama Krishn Raju :  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ పై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సోమవారం విచారణ చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నాడని వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ గతంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. భరత్ పిటిషన్‌పై విచారణ జరిపిన స్పీకర్ ఓం బిర్లా, ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సునీల్ కుమార్ సింగ్ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టారు. మౌఖిక సాక్ష్యం ఇచ్చేందుకు ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ ఇవాళ హాజరయ్యారు. 

లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‌ను వైసీపీ ఎంపీలు కోరారు. ఈ విషయంలో స్పీకర్ పక్షపాతం పాటిస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి గతంలో ఆరోపించారు. ఏడాది నుంచి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడంలేదని, చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్‌లో నిరసన చేస్తామని విజయ సాయి రెడ్డి తీవ్రంగానే స్పందించారు. 

ప్రివిలేజ్ కమిటీ విచారణ 

ఈ విమర్శలపై అప్పట్లో స్పందించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా  పిటిషన్‌పై నిర్ణయం తీసుకోడానికి ఒక ప్రక్రియ ఉంటుందన్నారు. నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చించాల్సి ఉందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాతే సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిశీలన అనంతరం సభాహక్కుల కమిటీకి పంపుతామని అప్పట్లో చెప్పారు. అయితే పార్లమెంట్ లో ఎవరికైనా నిరసన తెలిపే హక్కుందని వ్యాఖ్యానించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై రన్నింగ్ కామెంటరీ చేయలేమని స్పీకర్ ఘాటుగా బదులిచ్చారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ పై నివేదిక ఇవ్వాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా గతంలో ఆదేశించారు. పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ లోక్ సభ విప్ మార్గాని భరత్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్పీకర్ చర్యలకు ఆదేశించారు. ఆ పిటిషన్ ను ప్రివిలేజ్ కమిటీకి పంపించారు స్పీకర్. ప్రాథమిక విచారణ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా స్పీకర్ ఆదేశించారని లోక్ సభ సచివాలయం గతంలో పేర్కొంది. 

Also Read : Lokesh On Ysrcp Govt : తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు, సజ్జలతో భేటీ - నారా లోకేశ్ సంచలన కామెంట్స్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?

వీడియోలు

Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
Embed widget