By: ABP Desam | Updated at : 16 Oct 2021 08:24 PM (IST)
ఏపీలో కరోనా కేసులు (File Photo)
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 30 వేల శాంపిల్స్కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 332 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,57,145కు చేరుకుంది. తాజాగా కోవిడ్19తో పోరాడుతూ 7 మంది మరణించారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,302కు చేరుకుంది.
#COVIDUpdates: 16/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 16, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,57,145 పాజిటివ్ కేసు లకు గాను
*20,36,650 మంది డిశ్చార్జ్ కాగా
*14,302 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,193#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/neVrj5ao3g
ఏపీలో ఇప్పటివరకూ మొత్తం 20 లక్షల 57 వేల 145 మంది కరోనా బారిన పడగా, అందులో 20,36,650 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకూ మెరుగవుతోంది. నిన్న ఒక్కరోజులో పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులు దాదాపు రెట్టింపు ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. 585 మంది కొవిడ్19 నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,193 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,89,54,134 (2 కోట్ల 89 లక్షల 54 వేల 134) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు జరగగా... నిన్న ఒక్కరోజులో 29,243 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్లో తెలిపింది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగానే సాగుతోంది.
Also Read: విద్యుత్ కోతలు లేవు.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ! ఏపీ ప్రభుత్వం క్లారిటీ !
చిత్తూరులో కరోనా అధిక ప్రభావం..
చిత్తూరులో 55 మంది కరోనా బారిన పడగా.. కడప జిల్లాలో 43, గుంటూరులో 42, పశ్చిమ గోదావరిలో 36, కృష్ణాలో 32 మందికి కరోనా సోకినట్లు బులెటిన్లో పేర్కొన్నారు. కర్నూలు, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 3 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్19 బారిన పడి కృష్ణా జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనాతో చనిపోయారు.
Also Read: టీఆర్ఎస్లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు.. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం!
TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు
APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - వివరాలు ఇలా!
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!
Nara Lokesh: ప్యాలెస్లు ఉన్న జగన్ పేదోడా? వైసీపీ గలీజ్ పార్టీ - మహానాడులో నారా లోకేశ్
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి
ఒక్క ఛాన్స్ ప్లీజ్ - తెలుగులోకి వస్తానంటున్న తమిళ బ్యూటీ ప్రగ్యా నగ్రా