News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Coronavirus Cases: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. పాజిటివ్ కంటే డిశ్ఛార్జ్ కేసులే అధికం

కరోనా వైరస్ కట్టడిలో ఏపీ ప్రభుత్వం మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసుల కంటే డిశ్ఛార్జ్ కేసులు రెట్టింపు ఉన్నాయి. ఏపీ వైద్యశాఖ లేటెస్ట్ బులెటిన్ వివరాలిలా ఉన్నాయి.

FOLLOW US: 
Share:

#APFightsCorona: ఏపీలో కరోనా వ్యాప్తి దాదాపుగా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 295 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 7 మందిని కొవిడ్19 మహమ్మారి బలిగొది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,60,977 పాజిటివ్ కేసులకు గాను.. 20,41,797 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకూ 14,350 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,830 అని ఏపీ వైద్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది.

కరోనా టెస్టుల వివరాలు.. 
తాజా కేసులతో కలిపితే మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,60,977కు చేరుకుంది. ఏపీలో మొత్తం 2,92,91,896 (2 కోట్ల 92 లక్షల 91 వేల 896) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... నిన్న ఒక్కరోజులో 27,641 శాంపిల్స్‌ పరీక్షలు చేశారు.

Also Read: డేటింగ్ యాప్ పై కోర్టుకెళ్లిన యువకుడు... కారణం తెలిస్తే నవ్వుకుంటారు

ఈ జిల్లాల్లో కరోనా తీవ్ర ప్రభావం..
కృష్ణాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు కొవిడ్19 మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. ఏపీలో నిన్న తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 69 మందికి కరోనా సోకగా.. కృష్ణాలో 68, చిత్తూరులో 40, గుంటూరులో 31, విశాఖపట్నంలో 22 మంది కరోనా బారిన పడ్డారు. అత్యల్పంగా విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలులో ఒకరికి కరోనా సోకినట్లు తాజా బులెటిన్‌లో తెలిపారు.

Also read: వంటనూనెల్లో ఏది మంచిది? ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది? 

ఏపీలో కరోనా వ్యాక్సిన్లు 5 కోట్లకు పైగా పంపిణీ అయినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. జిల్లాలవారీగా కొవిడ్ టీకా డోసుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 25 Oct 2021 05:41 PM (IST) Tags: coronavirus covid19 AP corona cases today AP News ap corona cases Corona Cases In AP Corona Positive Cases

ఇవి కూడా చూడండి

Yuvagalam : విభిన్న వర్గాలకు భరోసా - లోకేష్ యువగళంకు భారీ స్పందన !

Yuvagalam : విభిన్న వర్గాలకు భరోసా - లోకేష్ యువగళంకు భారీ స్పందన !

Minister Roja: నేను చదువుకున్న కాలేజీకి నేనే చీఫ్ గెస్ట్, కన్నీళ్లు ఆగలేదు - రోజా

Minister Roja: నేను చదువుకున్న కాలేజీకి నేనే చీఫ్ గెస్ట్, కన్నీళ్లు ఆగలేదు - రోజా

CM Jagan : రూ.3099 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లు - వర్చువల్‌గా 12 ప్రారంభం - ప్రజలకు అంకితమిచ్చిన సీఎం జగన్

CM Jagan : రూ.3099 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లు - వర్చువల్‌గా 12 ప్రారంభం - ప్రజలకు అంకితమిచ్చిన సీఎం జగన్

Chandrababu case : రాజకీయ ర్యాలీల్లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ - చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

Chandrababu case :  రాజకీయ ర్యాలీల్లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ -  చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం

Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం

టాప్ స్టోరీస్

Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Telangana Elections 2023 :  కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్‌ రాజ్‌

Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్‌ రాజ్‌

Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!

Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!