అన్వేషించండి

TTD: టీటీడీ ఉదయాస్తమాన టికెట్లపై వివాదం.. పిల్లల ఆసుపత్రి నిర్వహణ బాధ్యత ప్రభుత్వం చూసుకోవాలి

టీటీడీ నిర్ణయాలపై ఒక్కోసారి వివాదలు అవుతుంటాయి. టీటీడీ నిర్ణయాలను కొందరూ స్వాగతిస్తుంటే.. మరి కొందరేమో వివాదాలకు దారి తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోసారి ఉదయాస్తమాన టికెట్లపై వివాదం నడుస్తోంది.

శ్రీవారి ఆలయంలో ఉదయాస్తమాన సేవ టికెట్లను తిరిగి పునరుద్ధరణ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇలా వచ్చిన నిధులను చిన్న పిల్లల ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించేలా ఇటీవల్ల టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే అందుబాటులో ఉన్న ఉదయాస్తమాన సేవా టిక్కెట్లను పారదర్శకంగా భక్తులకు కేటాయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు తగ్గట్టుగా సాధారణ రోజుల్లో కోటి రూపాయలు ధర, శుక్రవారం నాడు కోటిన్నరగా టిక్కెటు ధర నిర్ణయించే సూచనలు కనిపిస్తుంది.

స్వామి కళ్లారా చూసి.. తరించే భాగ్యం ఉదయాస్తమాన సేవా టికెట్ల ద్వారా భక్తులకు లభిస్తుంది. ఇక వేకువ జామున సుప్రభాతం మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీ వేంకటేశ్వరుడుని కనులారా తరించే అవకాశం ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు కలిగిన భక్తులకు లభిస్తుంది. దీంతో ఉదయాస్తమాన సేవ టిక్కెట్లకు ఉన్న డిమాండ్ ఎక్కువే. టీటీడీ ప్రవేశ పెట్టిన కొద్ది కాలంలోనే భారీగా ఉదయాస్తమాన సేవ టిక్కెట్లను భక్తులు కొనుగోలు చేయడంతో‌.. తరువాత వీటి కేటాయింపును తాత్కాలికంగా నిలిపి వేసింది టీటీడీ. 

సామాన్య భక్తులకు దర్శనంలో అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఉదయాస్తమాన సేవా టిక్కెట్లను నిలిపివేశారు. అయితే గతంలో భక్తులకు జారీ చేసిన టికెట్లు కాలపరిమితి ముగిసి పోవడంతో ఖాళీగా ఉన్న టిక్కెట్లను తిరిగి భక్తులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ప్రస్తుతం ఉదయాస్తమాన సేవా టిక్కేట్లను ఓ మంచి ఉద్దేశంతో భక్తులకు కేటాయించేందుకు ప్రయత్నాలు చేశారు. వీటి కేటాయింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరుపతిలో టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి వినియోగించాలని  భావిస్తోంది. 

ప్రస్తుతం టీటీడీ వద్ద 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో పారదర్శకంగా భక్తులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తుంది టీటీడీ. శ్రీవారి దర్శన టిక్కెట్లు కేటాయించిన తరహాలోనే ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయించేలా ఏర్పాట్లు చేస్తుంది.  వీలైనంత త్వరగా టిక్కెట్లు ఆన్లైన్ లో‌ ఉంచేందుకు అధికారులు చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 600 కోట్ల రూపాయల వరకు నిధులు సమకూరే అవకాశాలు ఉంది.

టీటీడీ‌ పాలక మండలి తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది భక్తులు, రాజకీయ‌ నాయకులు స్వాగతిస్తుంటే కొందరు‌ మాత్రం టీటీడీ తప్పుడు నిర్ణయం తీసుకుందని‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కిష్కింద క్షేత్ర పీఠాధిపతి గొవిందానంద సరస్వతీ స్వామి.. కామెంట్స్ చేశారు. స్వామి వారి సేవలను భక్తులకు ఉచితంగా దర్శించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీవారిని సేవలను ఏ విధంగా కోటి రూపాయలకు విక్రయిస్తారని ప్రశ్నించారు. సేవలను టిక్కెట్ల రూపంలో విక్రయించి దాని ద్వారా వచ్చే నగదును చిన్న పిల్లల ఆసుపత్రికి ఉపయోగించరాదని, ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా ప్రభుత్వం భరించాలని గోవిందానంద సరస్వతి కోరారు. 

టీటీడీ పాలక మండలి పూర్తిగా తప్పుడు నిర్ణయం తీసుకుందని.. వెంటనే వెనక్కి తీసుకోవాలని  గోవిందానంద స్వామి డిమాండ్ చేశారు. పాలక మండలి భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా నిర్ణయం తీసుకుంటుంటే శ్రీవారి ఆలయ పెద్ద జియర్లు, చిన్న జియర్లు ఏం చేస్తున్నారనిప్రశ్నించారు.

Also Read: jagan CBI Court : అందుకే సీబీఐ కోర్టుకు హాజరు కావడం లేదు..మెమో సమర్పించిన సీఎం జగన్ !

Also Read: AP Vs Telangana : విద్యుత్ బకాయిల గొడవ మీరే పరిష్కరించుకోండి... తెలుగు రాష్ట్రాలకు తేల్చేసిన కేంద్రం !

Also Read: YSRCP Attack : మద్యం ధరలపై వాగ్వాదం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు !

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బాసర ఆలయ అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి ఆదేశం
బాసర ఆలయ అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి జూపల్లి ఆదేశం
Amaravati Tension: అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
Anant Ambani: తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన భారీ విరాళం, గోశాల ఆధునీకరణకు నిర్ణయం
తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన భారీ విరాళం, గోశాల ఆధునీకరణకు నిర్ణయం
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Idupu Kayitham Controversy : టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
Jana Nayagan Producer: 'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
US Iran War: ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
Lionel Messi Record: బెంచ్ కే పరిమితమైనా తగ్గని మెస్సి క్రేజ్.. జొర్డాన్‌ను కుమ్మేసిన అర్జెంటీనా, వరుసగా ఏడో మ్యాచ్ లోనూ గోల్ కొట్టి సరికొత్త వరల్డ్ రికార్డ్!
బెంచ్ కే పరిమితమైనా తగ్గని మెస్సి క్రేజ్.. జొర్డాన్‌ను కుమ్మేసిన అర్జెంటీనా, వరుసగా ఏడో మ్యాచ్ లోనూ గోల్ కొట్టి సరికొత్త వరల్డ్ రికార్డ్!
Embed widget