అన్వేషించండి

CM Jagan Review : గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేయండి - అధికారులకు జగన్ ఆదేశం !

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. వాటిపై సమీక్ష నిర్వహించారు.

 

CM Jagan Review :    గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఖాళీలను భర్తీ చేయటానిక అవసరం అయిన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.ఇప్పటికే జరిగిన నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని దీంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని జగన్ అధికారులను ప్రశంసించారు.తాడేపల్లిలోని క్యాంప్ కార్యలయంలో సీఎం జగన్ గ్రామ వార్డు సచివాలయాల పై  సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో సమగ్ర పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల కీలక పాత్ర, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీ వంటి అంశాల పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశామని,చివరి స్థాయి వరకూ సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా సచివాలయాలను ఏర్పాటు చేసిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు.

సచివాలయాల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలని జగన్ ఆకాంక్షించారు.సరైన ఎస్‌ఓపీలు, పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదు కాబట్టి ఆదిశగా పని తీరు ఉండాలని జగన్ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం  3 గంటలనుంచి 5 గంటలవరకూ స్పందన నిర్వహించాలన్నారు.ప్రభుత్వ విభాగాల వారీగా మండలాల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని,రిపోర్టింగ్‌  స్ట్రక్చర్‌ పటిష్టంగా ఉండాలని సూచించారు.గ్రామ వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది పై విభాగాల వారీగా మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని,విధులు, బాధ్యతల పై ఎస్‌ఓపీలు రూపొందించి ,వాటిని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

అర్జీల పరిష్కారం కూడా చాలా ముఖ్యమయ్యిందని,వాటి పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం ఉండకూడదని జగన్ స్పష్టం చేశారు. ఒకే అర్జీ మళ్లీ వచ్చినప్పుడు మళ్లీ అదే వ్యవస్థ దాన్ని పరిశీలించే బదులు, ఆ పై వ్యవస్థ పరిశీలన చేసి లోటు పాట్లను సరిచేసి, పరిష్కరిస్తే ఫలితాలు ఉంటాయని జగన్ అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి అంశాల పై  అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు.అలాంటప్పుడే గ్రామ, వార్డు సచివాలయాలు సమర్థవంతంగా పని చేయగలుగుతాయని,అధికారులు ఓనర్‌షిప్‌ తీసుకోవటం,ద్వారానే ఇవి ఫలిస్తాయని ఆకాంక్షించారు.
 
ప్రభుత్వ శాఖాధిపతులు ప్రతి నెల  ఖచ్చితంగా రెండు సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు.  దీని వల్ల వాటి సమర్థత పెరుగుతుందని, సచివాలయాల స్థాయిలో మెరుగైన సేవలు అందుతుందనే విశ్వాసం  ప్రజల్లో పెంపొందించగలమని అన్నారు. ప్రభుత్వంలో సమర్థవంతమైన ఉద్యోగులు ఉన్నారని, వారి సేవలు ప్రజలకు అందినప్పుడు, ప్రజలకు అన్నిరకాలుగా ఉపయోగం, అనుకున్న లక్ష్యాలను కూడా సాధించగలుగుతామని జగన్ అభిప్రాయపడ్డారు. సిబ్బందితో  సమన్వయం కోసం, వారు అందుబాటులో ఉండేలా మెరుగైన విధానాలను అవలంభించాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకోవటం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రదాన లక్ష్యమని తెలిపారు.

ప్రతి ప్రభుత్వ విభాగంలో ఫేషియల్‌ రికగ్నైజేషన్‌తో కూడిన హాజరును అమలు చేయాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు.ప్రభుత్వ శాఖాధిపతుల నుంచే ఇది అమలు అయితే కింది స్థాయిలో కూడా అందరూ అమలు చేస్తారని, దీని వల్ల సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల వినతులకు సంబంధించిన పరిష్కారం పై దృష్టిపెట్టేందుకు వీలుంటుందని అన్నారు.లేనిపక్షంలో అంతిమంగా ఇబ్బందులు పడేది ప్రజలన్న విషయాలను గుర్తించాలన్నారు.సుస్థిర ప్రగతి లక్ష్యాల పై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలని,అప్పుడే ఆ లక్ష్యాలను అందుకోగలమని జగన్ పేర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kadiri Lakshminarayana Swamy Temple: కదిరి ఆలయ రాబడికి రాజకీయ గండి - ఇతరులకు వచ్చిందని టెండర్ రద్దు - ప్రజాప్రతినిధే చేస్తున్నారా?
కదిరి ఆలయ రాబడికి రాజకీయ గండి - ఇతరులకు వచ్చిందని టెండర్ రద్దు - ప్రజాప్రతినిధే చేస్తున్నారా?
Bhogapuram Airport: జూలైలో భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి సన్నాహాలు - ప్రధాని మోదీకి ఏపీ ప్రభుత్వం ఆహ్వానం
జూలైలో భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి సన్నాహాలు - ప్రధాని మోదీకి ఏపీ ప్రభుత్వం ఆహ్వానం
AP Cabinet meeting: ముందే ఏపీ కేబినెట్ ఎజెండా లీక్ - మంత్రులపై చంద్రబాబు సీరియస్ - ఎవరి పని?
ముందే ఏపీ కేబినెట్ ఎజెండా లీక్ - మంత్రులపై చంద్రబాబు సీరియస్ - ఎవరి పని?
Ayushman Bharat Card Apply: కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?

వీడియోలు

Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
IPL 2026 KKR VS LSG Highlights | లక్నో సూపర్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS RR Result Update: వైభ‌వ్ వీరబాదుడు, జురేల్ విధ్వంసం, వ‌రుస‌గా 4వ విజ‌యంతో టాప్‌ప్లేస్‌లో రాయ‌ల్స్ ! ఆర్సీబీకి తొలి ఓట‌మి
వైభ‌వ్ వీరబాదుడు, జురేల్ విధ్వంసం, వ‌రుస‌గా 4వ విజ‌యంతో టాప్‌ప్లేస్‌లో రాయ‌ల్స్ ! ఆర్సీబీకి తొలి ఓట‌మి
Islamabad Talks:
"డీల్ కుదరకపోతే దాడులే" ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరిక! ఇస్లామాబాద్‌ చర్చలపై ఉత్కంఠ!
Digital Payments: యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
Boat capsizes in Yamuna River: యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
Hyderabad HIV Injection Tragedy: ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
Chiranjeevi : తీవ్ర ఆందోళనకు గురయ్యా... నిర్మాణ సంస్థకు సపోర్ట్‌ - జన నాయగన్ లీక్‌పై మెగాస్టార్ రియాక్షన్
తీవ్ర ఆందోళనకు గురయ్యా... నిర్మాణ సంస్థకు సపోర్ట్‌ - జన నాయగన్ లీక్‌పై మెగాస్టార్ రియాక్షన్
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Jana Nayagan Leaked : ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget