Jagananna Colonies: పేదలకు శుభవార్త.. వారి ఇళ్ల నిర్మాణానికి పావలా వడ్డీకే రుణాలు.. సీఎం జగన్ ఆదేశాలు
జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలిచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు.
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలిచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై బుధవారం వీడియో సమావేశం నిర్వహించారు.
సమీక్ష..
పింఛన్లు, బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీ కార్డుకు సంబంధించి 21 రోజుల్లోగా దరఖాస్తుదారుడి అర్హత నిర్ధారించాలని జగన్ సూచించారు. 90 రోజుల్లోగా వాటిని మంజూరు చేయాలన్నారు. ఇళ్ల పట్టాలు, నేతన్న నేస్తం, చేయూత, మత్స్యకార భరోసా తదితర పథకాలకు సంబంధించి అర్హులు ఎవరైనా మిగిలిపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. 90 రోజుల్లోగా అర్హత నిర్ధారించి వారికి ఆరు నెలల్లోగా పథకం మంజూరు చేయాలని తెలిపారు.
కొత్త దరఖాస్తుల స్వీకరణ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets