అన్వేషించండి

Raitanna Mee Kosam: పంచ సూత్రాలతో ఆదాయం పెంపు - రైతన్నా మీ కోసం కార్యక్రమంలో చంద్రబాబు భరోసా

CM Chandrababu : వ్యవసాయంలో రైతులకు లాభాలు పెంచేందుకు పంచ సూత్రాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్లలో రైతులతో సమావేశమయ్యారు.

Chandrababu :  తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్లలో నిర్వహించిన రైతన్నా...మీకోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి   చంద్రబాబు నాయుడు  పాల్గొన్నారు.  రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొని వారి నుంచి సాగు వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు.  ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందు కోసం  పంచసూత్రాల ను అమలు చేస్తున్నామని, ప్రతి రైతు వీటిని ఆచరించి లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు. 
  
 గత ప్రభుత్వ విధానాలతో రైతులందరూ ఇబ్బందులు పడ్డారు. రెవెన్యూలో జరిగిన అవకతవకలపై మరింత ఫోకస్ పెడుతున్నాను. జగన్ మోహన్ రెడ్డి చేసిన ల్యాండ్ గోల్మాల్ ను సరి చేసేందుకే ఎక్కువ సమయం పెడుతున్నాను. గత పాలకులు భూముల విషయంలో చాలా దౌర్జన్యాలు చేశారు. తాము కోరుకున్న భూములు ఇవ్వకుంటే వాటిని 22-ఏ లో పెట్టేశారు.  వీటన్నింటినీ సరి చేసేలా నేను ప్రయత్నిస్తున్నాను. గత ప్రభుత్వం వైఖరి వల్ల రాష్ట్ర మొత్తం విధ్వంసానికి గురైంది... అభద్రతా భావంలోకి వెళ్లిపోయారు.  వ్యతిరేక ఓటు చీలడానికి వీళ్లేదని నాటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు.. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసిందని గుర్తు చేశారు. 

గత ఎన్నికల్లో చరిత్ర సృష్టించేలా తీర్పును ప్రజలు ఇచ్చారు. గతానికంటే రెండు రెట్లు అభివృద్ధి-సంక్షేమం చేస్తానని ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే హామీ ఇచ్చాను. నాడు చెప్పిన విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం... అన్నదాత సుఖీభవ అమలు చేశాం. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా... అందరికీ రూ. 15 వేలు ఇచ్చాం. దివ్యాంగులకు పెన్షన్లు పెంచాం... మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు ఇస్తున్నాం. స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీపం-2.0 పథకం కింద 3 సిలిండర్లు ఇస్తున్నాం. అన్ని వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంక్షేమం ఇస్తున్నాంమన్నారు. 

గోతుల పడ్డ రోడ్లను పూడుస్తున్నాం.. సంక్రాంతి నాటికి రోడ్లపై గోతులు లేకుండా చేస్తాం చరిత్రను గుర్తు పెట్టుకోవాలి... భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  విభజన, గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అన్నట్టుగా మారిందని..  టీడీపీ జెండాలో నాగలి గుర్తు ఉండేలా ఎన్టీఆర్ జెండా రూపకల్పన చేశారన్నారు.  వ్యవసాయమే మన బలం... దాన్ని మరింత బలపరుచుకోవాలన్నారు.  వ్యవసాయాన్ని మరింతగా బలోపేతం చేసుకునేలా పంచసూత్రాలను అమలు చేస్తున్నాం... పంచసూత్రాలను ప్రతి రైతూ ఆచరించాలి. వృధాగా సముద్రంలోకి పోతున్న జలాలను వినియోగించుకునేలా నదుల అనుసంధానం కార్యక్రమం చేపట్టామని తెలిపారు.   

తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పుడు భూగర్భ జలాలు తక్కువగా ఉన్నాయని పోలవరం ద్వారా నీరందరిస్తామన్నారు.  పంచసూత్రాల మీద అవగాహన కల్పించేందుకే రైతన్నా... మీ కోసం పేరుతో ప్రతి రైతు ఇంటికి వెళ్లి ప్రచారం చేపట్టాం. రైతులకు సాగులో ఆదాయం రావాలి. రైతుల సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం అవసరం. విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చాను... దానికి అనుగుణంగానే విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే... నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Modi AI video controversy:  మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
Advertisement

వీడియోలు

విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
హార్దిక్ కాళ్ళు మొక్కిన ఫ్యాన్ డేంజర్ లో పాండ్య, కోహ్లీ.. ఇంకా!
రివెంజ్‌ ముఖ్యం బిగిలు.. సిరీస్ కొట్టేయాలని పట్టుదలగా ఉన్న టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Modi AI video controversy:  మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Samantha Wedding Saree: సమంత పెళ్లి ఫోటోలు... పువ్వల్లే సామ్ నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ చూడండి
సమంత పెళ్లి ఫోటోలు... పువ్వల్లే సామ్ నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ చూడండి
Sabarimala Special Trains: శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
Bigg Boss Telugu Day 87 Promo : టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
Embed widget