అన్వేషించండి

CM Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Srisailam News: తిరుమల తరహాలోనే శ్రీశైలం ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందు కోసం మంత్రులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

AP CM Chandrababu Comments On Srisailam Development: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) శనివారం కీలక ప్రకటన చేశారు. తిరుమల తరహాలోనే శ్రీశైలం ఆలయాన్ని (Srisailam Temple) అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. టెంపుల్ సహా పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని.. వీటన్నింటి కోసం మంత్రులు ఆనం రామనారాయణ, కందుల దుర్గేశ్, జనార్దన్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకుని ఓ నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకూ సీప్లేన్ ప్రారంభించిన ఆయన.. అదే ప్లేన్‌లో శ్రీశైలం వరకూ వచ్చి మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. అటవీ, దేవాదాయ, జిల్లా కలెక్టర్లు చర్చించి ఓ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారని.. దీని ప్రకారం తిరుమల తరహాలో శ్రీశైలం ఆలయం అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సున్నిపెంట ప్రాంతాన్ని సైతం నివాస యోగ్యంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

'వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం'

గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన భరోసా, మాపై పెట్టుకున్న నమ్మకంతో ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ పై నుంచి బయటపడ్డామని సీఎం చంద్రబాబు అన్నారు. 'అభివృద్ధి, సంక్షేమం టీడీపీకి రెండు కళ్లు. అభివృద్ధి చేస్తేనే సంపద పెరుగుతుంది. తద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ రోజు మనం కేంద్రంలో అధికారంలో లేకపోయి ఉంటే.. వాళ్లు కూడా సహకరించకపోతే శ్వాస తీసుకోలేని పరిస్థితి మనది. రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి. రిజర్వాయర్లు నిండుకుండల్లా ఉన్నాయి. నదుల అనుసంధానం చేసి గోదావరి, పెన్నా, వంశధార వరకూ కలపాలి. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పాను. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భావిస్తున్నాం. పోలవరానికి గోదావరి నీటిని తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నాం. ఇది జరిగితే గేమ్ ఛేంజర్ అవుతుంది. రాయలసీమ రతనాల సీమ అవుతుంది. త్వరలోనే శుభవార్త చెబుతాను.' అంటూ సీఎం స్పష్టం చేశారు.

వారికి స్ట్రాంగ్ వార్నింగ్

95 సీఎం అంటే ఏంటో ఇంకా కొంతమందికి అర్థం కావడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 'తల్లి, చెల్లి అంటే జగన్‌కు గౌరవం లేదు. మాకు సభ్యత, సంస్కారం ఉన్నాయి. మృగాలను ఎలా నిలువరించాలో మాకు తెలుసు. నా దగ్గర రౌడీలు, గూండాల ఆటలు సాగవు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అసభ్యకర పోస్టులు పెడితే కఠినచర్యలు ఉంటాయి. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వదిలిపెట్టేది లేదు.' అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Also Read: TDP: గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Divyang Shakti Scheme: దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే దివ్యాంగశక్తి - ఉచిత బస్సు పథకం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే దివ్యాంగశక్తి - ఉచిత బస్సు పథకం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
YS Sharmila fires on Jagan: అన్న అనే పేరుకే కళంకం - జగన్‌పై షర్మిల నిప్పులు - ఎందుకంటే?
అన్న అనే పేరుకే కళంకం - జగన్‌పై షర్మిల నిప్పులు - ఎందుకంటే?
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
US Exit Bonus: అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
Big Relief For Fliers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Free Charging For EVs: మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Embed widget