అన్వేషించండి

CM Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Srisailam News: తిరుమల తరహాలోనే శ్రీశైలం ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందు కోసం మంత్రులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

AP CM Chandrababu Comments On Srisailam Development: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) శనివారం కీలక ప్రకటన చేశారు. తిరుమల తరహాలోనే శ్రీశైలం ఆలయాన్ని (Srisailam Temple) అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. టెంపుల్ సహా పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని.. వీటన్నింటి కోసం మంత్రులు ఆనం రామనారాయణ, కందుల దుర్గేశ్, జనార్దన్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకుని ఓ నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకూ సీప్లేన్ ప్రారంభించిన ఆయన.. అదే ప్లేన్‌లో శ్రీశైలం వరకూ వచ్చి మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. అటవీ, దేవాదాయ, జిల్లా కలెక్టర్లు చర్చించి ఓ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారని.. దీని ప్రకారం తిరుమల తరహాలో శ్రీశైలం ఆలయం అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సున్నిపెంట ప్రాంతాన్ని సైతం నివాస యోగ్యంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

'వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం'

గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన భరోసా, మాపై పెట్టుకున్న నమ్మకంతో ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ పై నుంచి బయటపడ్డామని సీఎం చంద్రబాబు అన్నారు. 'అభివృద్ధి, సంక్షేమం టీడీపీకి రెండు కళ్లు. అభివృద్ధి చేస్తేనే సంపద పెరుగుతుంది. తద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ రోజు మనం కేంద్రంలో అధికారంలో లేకపోయి ఉంటే.. వాళ్లు కూడా సహకరించకపోతే శ్వాస తీసుకోలేని పరిస్థితి మనది. రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి. రిజర్వాయర్లు నిండుకుండల్లా ఉన్నాయి. నదుల అనుసంధానం చేసి గోదావరి, పెన్నా, వంశధార వరకూ కలపాలి. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పాను. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భావిస్తున్నాం. పోలవరానికి గోదావరి నీటిని తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నాం. ఇది జరిగితే గేమ్ ఛేంజర్ అవుతుంది. రాయలసీమ రతనాల సీమ అవుతుంది. త్వరలోనే శుభవార్త చెబుతాను.' అంటూ సీఎం స్పష్టం చేశారు.

వారికి స్ట్రాంగ్ వార్నింగ్

95 సీఎం అంటే ఏంటో ఇంకా కొంతమందికి అర్థం కావడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 'తల్లి, చెల్లి అంటే జగన్‌కు గౌరవం లేదు. మాకు సభ్యత, సంస్కారం ఉన్నాయి. మృగాలను ఎలా నిలువరించాలో మాకు తెలుసు. నా దగ్గర రౌడీలు, గూండాల ఆటలు సాగవు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అసభ్యకర పోస్టులు పెడితే కఠినచర్యలు ఉంటాయి. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వదిలిపెట్టేది లేదు.' అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Also Read: TDP: గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget