అన్వేషించండి

AP Tickets Issue: టికెట్ల సమస్యకు నేటితో శుభం కార్డు పడే ఛాన్స్! ఎవర్ని పిలిచారో తెలీదు, ఎయిర్‌పోర్టులో చిరంజీవి కీలక వ్యాఖ్యలు

సీఎంను కలిసిన వారిలో చిరంజీవి, రాజమౌళి, మహేశ్ బాబు, ప్రభాస్ కొరటాల శివ, పోసాని క్రిష్ణ మురళి, ఆర్ నారాయణ మూర్తి, అలీ, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎంఓ నుంచి తనకు మాత్రం ఆహ్వానం అందిందని ఇంకా ఎవరెవరికి ఆహ్వానాలు అందాయనే విషయం తనకు తెలియదని అన్నారు. ‘‘సీఎంతో సమావేశానికి నాకు మాత్రం ఆహ్వానం అందింది. మిగతా వారు ఎవరు వస్తున్నారో నాకు తెలియదు. మీ మీడియా ద్వారానే వారు వస్తున్నారన్న విషయం నాకు తెలిసింది. టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలకు ఇవాళ్టితో శుభం కార్డు పడుతుంది. సీఎం జగన్‌తో సమావేశం ముగిసిన తర్వాత అన్ని విషయాలు చెబుతాం.’’ అని చిరంజీవి అన్నారు. అయితే, గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి మహేశ్ బాబు, కొరటాల శివ, రాజమౌళి, ప్రభాస్ రాగా.. మీడియాతో మాట్లాడేందుకు వారు నిరాకరించారు.

గురువారం ఉదయం ముఖ్యమంత్రి జగన్‌తో ఆయన క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. సీఎంను కలిసిన వారిలో చిరంజీవి, రాజమౌళి, మహేశ్ బాబు, ప్రభాస్ కొరటాల శివ, పోసాని క్రిష్ణ మురళి, ఆర్ నారాయణ మూర్తి, అలీ, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు. భేటీ అనంతరం వీరు ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

అంతకుముందు, సీఎంను కలిసేందుకు సినీ ప్రముఖులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో చిరంజీవి, రాజమౌళి, కొరటాల శివ, మహేశ్ బాబు, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మరోవైపు, పోసాని, ఆర్.నారాయణ మూర్తి, అలీ ముందే విజయవాడ చేరుకున్నారు. వీరంతా కలిసి ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జునకు కూడా ఆహ్వానాలు అందినా వేర్వేరు కారణాల వల్ల వారు హాజరు కాలేకపోయినట్లు తెలిసింది.

టికెట్ల వ్యవహారానికి నేటితో ఫుల్ స్టాప్ పడుతుంది: అల్లు అరవింద్
ఏపీలో సినిమా టికెట్‌ ధరల వ్యవహారానికి నేటితో ఫుల్‌స్టాప్‌ పడే అవకాశం ఉందని నిర్మాత అల్లు అరవింద్‌ హైదరాబాద్‌లో అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో గురువారం ఉదయం ఇండస్ట్రీ పెద్దలు సమావేశం కావడానికి ముందే ఆయన ఈమేరకు స్పందించారు. ‘‘ప్రస్తుతం ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ భేటీపైనే ఉంది. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలకు నేటితో ముగింపు పడొచ్చని అందరూ ఆశిస్తున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలకు నేటితో ఎండ్‌ కార్డ్‌ పడుతుందని ఆశిస్తున్నాం. ఇండస్ట్రీకి మేలు జరిగేలా ప్రకటన వస్తుందని భావిస్తున్నా. మా కుటుంబం నుంచి చిరంజీవి వెళ్లారు. కాబట్టి నేను వెళ్లాల్సిన అవసరం లేదు’’ అని అల్లు అరవింద్ అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
Embed widget