By: ABP Desam | Updated at : 28 Nov 2022 03:26 PM (IST)
అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న సజ్జల
Sajjala On Supreme Court : అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో 3 నుంచి 7 అంశాలపై జనవరి 31వ తేదీ వరకూ సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వాగతించారు. తమ పార్టీ తరపున ఆ తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. సామాజిక న్యాయానికి భిన్నంగా గతంలో హైకోర్టు తీర్పు ఉందన్నారు. మూడు రాజధానుల నిర్ణయం సామాజిక న్యాయం చేసేదిగా ఉందన్నారు. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలందరి ఆమోదం ఉందని స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని వాటిలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించిందన్నారు. ప్రజల మద్దతు ఉందని చెప్పడానికి ఇంత కన్నా ఏం కావాలని ప్రశ్నించారు. ప్రజల ఆలోచననే ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసిందన్నారు.
సుప్రీంకోర్టు స్టే విధించిన అంశాలు ఇవీ
హైకోర్టు ఇచ్చిన తీర్పులో మూడు నుంచి ఏడు అంశాలపై సుప్రీంకోర్టు జనవరి 31వరకు స్టే విధించింది.
అవేమిటంటే...
3. CRDA యాక్ట్ సెక్షన్ 58 ప్రకారం రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు ప్రాసెస్ తీర్పు వచ్చిన తేదీ నుంచి నెలరోజుల్లో పూర్తిచేయాలి
4. APCRDA యాక్ట్ సెక్షన్ 61 ప్రకారం టౌన్ మాస్టర్ ప్లానింగ్ను రాష్ట్ర ప్రభుత్వం, CRDA కలిసి పూర్తి చేయాలి
5. డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఫామ్ 9.14 ప్రోవిజన్ - CRDA యాక్ట్ 2015లోని నిబంధనల ప్రకారం 6 నెలల్లో అమరావతి కేపిటల్ సిటీ, కేపిటల్ రీజియన్ నిర్మాణం చేపట్టాలి
6. ప్రభుత్వం మరియు CRDA కలిసి రోడ్లు, తాగునీరు, ప్రతిప్లాట్కు విద్యుత్ కనెక్షన్, డ్రైనేజి సహా ఏర్పాటు చేసిన అమరావతి కేపిటల్ సిటీ నివాసయోగ్యంగా మార్చాలి
7. రాష్ట్ర ప్రభుత్వం మరియు APCRDA కలిసి భూములిచ్చిన రైతులకు ప్రామిస్ చేసినట్టుగా అమరావతి కేపిటల్ రీజియన్లో స్థలాలు 3 నెలల్లోగా కేటాయించాలి
తదుపరి విచారణ జనవరి 31న !
వీటన్నింటిపై స్టే ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం, సీఆర్డీఏలు అక్కడ జరుగుతున్న అభివృద్ధిపై ఎప్పటికప్పుడు వేర్వేరు అఫిడవిట్లు సమర్పించాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఆరు నెలల్లో నిర్మాణం చేయాలంటారా?. మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్ ఎందుకు? అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా? హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించింది అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానిచింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా?. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? అంటూ మందలింపు వ్యాఖ్యలు చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ తరుణంలో.. ఏపీ హైకోర్టు 7 అంశాలతో ఇచ్చిన తీర్పులోని.. చివరి ఐదు అంశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయంగా కోటంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టే- కాకాణి ఘాటు వ్యాఖ్యలు
K Viswanath Passed Away: విజయనగరంతో విశ్వనాథ్కు ప్రత్యేక అనుబంధం !
తమ్ముడూ అనిల్ గతం మరచిపోకు- ఆనం ఫ్యామిలీకి నువ్వు చేసిందేంటీ? శ్రీధర్ రెడ్డి కౌంటర్
కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!