అన్వేషించండి

Chandrababu : ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా ? ఏపీలో తుగ్లక్ ప్రభుత్వముందన్న చంద్రబాబు !

వరదలొచ్చి ప్రజలు చనిపోతూంటే సీఎం జగన్ పట్టించుకోవడం లేదని.. అందుకే అధికారులూ పట్టించుకోవడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో రెండో రోజు వరద బాథిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు.

వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రెండో రోజు చిత్తూరు జిల్లా పాపానాయుడు పేటను పరిశీలించారు. అక్కడ వరద బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని బాధితులు పలువురు చంద్రబాబుకు వివరించారు. అక్కడి నష్టాన్ని చూసి చంద్రబాబు చలించిపోయారు. ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే ప్రజలకు ఇటువంటి కష్టాలు వచ్చేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం గాల్లో వచ్చి గాల్లో వెళ్తున్నాడని..అందుకే అధికారులూ కూడా పట్టించుకోవడం లేదని విమర్శించాు.  ప్రజలు చచ్చిపోయిన తరువాత అధికారులు వచ్చి కష్టం తీరుస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి బుద్ది, జ్ఞానం ఉంటే వరద బాధితులకు తక్షణం సాయం అందించాలన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తా..మీ కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. 


Chandrababu : ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా ? ఏపీలో తుగ్లక్ ప్రభుత్వముందన్న చంద్రబాబు !

Also Read : రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !

40 ఏళ్ళుగా ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదుర్కొన్నానని.. ఎప్పటికి వెనుక్కు తిరిగి చూడనని స్పష్టం చేశారు. వరదలకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై కొండలు,గుట్టులకు చేరుకున్నారని.. అయినా ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. మానవ తప్పిదం కారణంగానే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు.  ప్రజల కోసం పోరాడుతూంటే తనను వ్యక్తిగతంగా కించ పరిచి కుటుంబసభ్యుల మీద వ్యాఖ్యలు చేస్తూ ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. కొంత మంది పోలీసులు తోకలు జాడిస్తున్నారని.. మళ్లీ అధికారులు, పోలీసులు తన దగ్గర పని చేస్తారని అప్పుడు వారి సంగతి చూస్తానని హెచ్చరించారు.
Chandrababu : ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా ? ఏపీలో తుగ్లక్ ప్రభుత్వముందన్న చంద్రబాబు !

Also Read : మంత్రిని నిలదీసిన ఘటనతో తీవ్ర ఉద్రిక్తత.. పలువురు నేతల అరెస్టు..

తనను రెండున్నరేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. తన ఇంటిపై దాడి చేసేందుకు రౌడిలు వచ్చారన్నారు. తనపై బాంబులు వేసినప్పుడు సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి రక్షించారని.. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేస్తున్న దాడులను తట్టుకోలేనా అని ప్రశ్నించారు. తాను ప్రపంచం మొత్తం తిరిగి కంపెనీలు తెస్తే వైఎస్ఆర్‌సీపీ నేతలు అందులో వాటాలు కావాలని బెదిరించి తరిమేస్తున్నారని మండిపడ్డారు. మాఫియాల మాదిరిగా వైఎస్ఆర్‌సీపీ నేతలు మారి.. దొంగ ఓట్లు, రౌడీయిజంతో గెలిచారని విమర్శించారు.
Chandrababu : ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా ? ఏపీలో తుగ్లక్ ప్రభుత్వముందన్న చంద్రబాబు !

Also Read : ప్రజలంతా కష్టాల్లో ఉంటే.. సీఎం జగన్ విందులు, వినోదాల్లో ఉన్నాడు

సీఎం జగన్‌కు అసలు పరిపాలనపై అవగాహన లేదని.. అమరావతి విషయంలో సీఎం రోజులు ఒక్కో మాట మారుస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక తుగ్లక్ మడపతిప్పను మాట తప్పను అన్న జగన్ ఇప్పుడు చేస్తుంది మాత్రం మాట తప్పడం..మడమ తిప్పడమేనన్నారు. రైతులు వరి వేయవద్దు అని మంత్రి ప్రకటించడాన్ని తప్పు పట్టారు. రైతులు వరి వేయకుండా గంజాయి వేయాలా అని ప్రశ్నించారు. జగన్ సర్కార్ ప్రజాహితం కోసం పని చేయడం లేదని..ప్రజలకు టిడిపి అండగా ఉంటుందని హమీ ఇచ్చారు. పర్యటనకు బయలుదేరే ముందు తిరుపతిలో పంట నష్టంపై ఫోటోలను పరిశీలించారు. 

Also Read: TG Venkatesh : రాజధాని ఫార్ములా రెడీ.. జగన్ సై అంటే బీజేపీని ఒప్పిస్తానన్న ఎంపీ టీజీ వెంకటేష్ !

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Ustaad Bhagat Singh Collections: బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Balakrishna : బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
Architecture Temples : విరూపాక్ష ఆలయం సహా ఈ 8 ఆధ్యాత్మిక కట్టడాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు!
విరూపాక్ష ఆలయం సహా ఈ 8 ఆధ్యాత్మిక కట్టడాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు!
Ram Charan : పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్ - గాయం నుంచి కోలుకున్న గ్లోబల్ స్టార్... బర్త్ డే గిఫ్ట్ రెడీ
పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్ - గాయం నుంచి కోలుకున్న గ్లోబల్ స్టార్... బర్త్ డే గిఫ్ట్ రెడీ
Embed widget