అన్వేషించండి

Chandrababu: ప్రజలంతా కష్టాల్లో ఉంటే.. సీఎం జగన్ విందులు, వినోదాల్లో ఉన్నాడు

వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కడపలో పర్యటించారు. రాజంపేట, నందలూరు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు భరోసానిచ్చేందుకు కడపలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. మనుషుల వైఫల్యం వల్లే ఇలాంటి నష్టం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. తుపాను వస్తుందని ముందే తెలుస్తుందని.. ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల ఇలాంటి పరిణామం జరిగిందని విమర్శించారు. ఇళ్లు పూర్తిగా కూలిపోయాయని.. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతుంది అని ఎవరూ చెప్పలేదని.. ప్రాజెక్టు గేట్లు మైంటైన్ చేయాలని సూచించారు. గత ఏడాది పించా, అన్నమయ్య డ్యామ్ ల వల్ల ఇబ్బంది పడ్డారని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని.. హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు అధికారులను అప్రమత్తం చేశామని గుర్తు చేశారు.  

'వర్షాలు ఆపలేం కానీ తుపాను తీవ్రతను గుర్తించగలం. ప్రతిపక్షంలో ఉన్నప్పడు ప్రతి గ్రామానికి తిరిగిన జగన్...ఇప్పుడు గాలిలో తిరుగుతున్నాడు. అసెంబ్లీ లో నా సతీమణి ని అగౌరపరిచేలా వైసీపీ నాయకులు మాట్లాడారు. ప్రజల కోసం పోరాడుతున్నాను. అసెంబ్లీ లో చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నారు. శాసనసభ కాదు కౌరవ సభ. ప్రజలకు అండగా ఉంటానని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఏరియల్ సర్వే చేసిన జగన్ నేరుగా పెళ్లికి వెళ్లి బిర్యానీ తిన్నాడు. ప్రజలు కష్టాల్లో ఉంటే.. విందులకు వెళ్లాడు. పోలీసులకు అదిరేది బెదిరేది లేదు. ఇసుక ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు వైసీపీ నాయకులు. వెయ్యి ఇల్లు కష్టాల్లో ఉంటే ఆదుకోలేని సీఎం.. సీఎం విలాసవంతమైన జీవనము సాగిస్తున్నాడు. సామాన్య ప్రజల కష్టాలు జగన్ కు పట్టడం లేదు.' అని చంద్రబాబు అన్నారు.

మానవత్వం తో ఇక్కడికి వచ్చాను. వరద బాధితులకు అండగా ఉంటాము. ప్రతిపక్షం లో ఉన్నా.. చనిపోయిన బాధితులకు ఒక్క లక్ష రూపాయలు, బాధిత కుటుంబానికి 5 వేల రూపాయలు పార్టీ తరఫున ఇస్తాం. రాత్రి పడుకుని ఉంటే గ్రామాలు శ్మశానాన్ని తలపించేవి. గ్రామాలకు ప్రొటెక్షన్ వాల్ కట్టించాలని ప్రజలు అడిగారు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించక పోతే మేం అధికారంలోకి వచ్చాక చేయిస్తాం. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కోటి రూపాయలు ఇచ్చిన జగన్.. ఇక్కడ ఎందుకు 5 లక్షలు మాత్రమే ఎక్స్ గ్రేషియా ఇస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చనిపోయిన కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తాం న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా ఉంటాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై విజిలెన్స్, సీబీఐ విచారణ చేయాలని కోరుతున్నాం.
                                                                                                          - చంద్రబాబు, టీడీపీ అధినేత
ఇవాళ కడప జిల్లాల్లో పర్యటించనున్న టీడీపీ అధినేత.. బుధవారం చిత్తూరు, గురువారం నెల్లూరు జిల్లాలకు వెళ్లనున్నారు. 

Also Read: TG Venkatesh : రాజధాని ఫార్ములా రెడీ.. జగన్ సై అంటే బీజేపీని ఒప్పిస్తానన్న ఎంపీ టీజీ వెంకటేష్ !

Also Read: MP Raghurama: ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.. ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget