అన్వేషించండి

Chandrababu on Budameru : ఆర్మీ వల్ల కాలేదు - అధికారులు, రామానాయుడే యుద్ధం చేశారు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh : బుడమేరు గండ్లు పూడ్చడానికి ఆర్మీ వచ్చినా వారు చేతులెత్తేశారని చంద్రబాబు అన్నారు. అయితే ఇరిగేషన్ అధికారులు, మంత్రి రామానాయుడు అనుకున్నది సాధించారని అన్నారు.

CM Chandrababu Naidu : విజయవాడను ముంచెత్తిన వరదలకు కారణం బుడమేరకు గండ్లు పడటం. అవి చిన్న చిన్న గండ్లు కాదు. ప్రవాహం ఉన్నప్పుడు వాటిని పూడ్చాలంటే..అసాధ్యం. అది  పూడ్చకపోతే విజయవాడకు ముంపు ఆగదు. అందుకే .. బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చడానికి ప్రభుత్వ యంత్రాంగం చేయని ప్రయత్నం లేదు. మొదటి రెండు గండ్లను సులువుగానే పూర్తి చేసినప్పుడు మూడో గండిని  పూడ్చడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. 

బుడమేరు గండ్లు పూడ్చడానికి ఆర్మీ వచ్చినా ఫలించని ప్రయత్నాలు 

విజయవాడ వరద బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పరిస్థితిని వివరించడంతో ఆర్మీని తెప్పించేందుకు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి ఆపరేషన్లలో అనుభవం ఉన్న ఆర్మీ బృందం విజయవాడ వచ్చింది. బుడమేరులో గండి పూడ్చే ప్రయత్నాల్లో పాల్గొంది. అయితే ఆర్మీ అధికారులకు అది కొరుకుడుపడలేదు. కొన్ని సలహాలు ఇచ్చి వారు వెళ్లిపోాయరు. అయితే బుడమేరు గట్టు మీదనే ఉంటూ.. మంత్రి నిమ్మల రామానాయుడు .. ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. 

వైసీపీ పాలన సైడ్ ఎఫెక్టులే - దోపిడీ తప్ప ఒక్క పనీ చేయలేదు - చంద్రబాబు ఘాటు విమర్శలు

యుద్ధమే చేసిన రామానాయుడు, అధికారులు

ఓ వైపు ఆగని వర్షం.. తరచూ పెరిగే వరదతో.. యుద్దం చేస్తూ.. గండి పూడ్చేపనులు కొనసాగించారు. కొన్ని ప్రైవేటు సంస్థల వాహనాలతో.. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు విస్తృత ప్రయత్నాలు చేశారు. చంద్రబాబునాయుడు చెప్పినట్లుగా యుద్ధమే చేశారు. ఫలితంగా చివరికి గండి పూడ్చగలిగారు. వదలను ఆపారు. అయితే అంతటితో వదిలేస్తే.. మళ్లీ గండి పడే ప్రమాదం ఉందని.. మరింత ఎత్తుగా కట్టను బలోపేతం చేసే వరకూ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. 

నన్ను తిడితే అభిమానులకు కోపం రాదా? టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మరోసారి జగన్ సంచలన కామెంట్స్

బుడమేరుతో విజయవాడకు పెను ముప్పు 

అధికారులు, మంత్రి రామానాయుడు చేసిన ప్రయత్నాలను ఏలూరు పర్యటనలో చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆర్మీ కూడా వల్ల కాలేదని చెబితే.. మంత్రి రామానాయుడు, ఇరిగేషన్ శాఖ అధికారులే యుద్ధం చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు.. అధికారులు చేసిన కృషిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అత్యంత ప్రమాదకరంగా మారిన బుడమేరకు మరోసారి వరదలు   రాకుండా చేసేందుకు రీటైనింగ్ వాల్ కూడా కట్టే ఆలోచన చేస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.       

చంద్రబాబునాయుడు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.  పది రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్ లోనే మకాం వేసి... బస్సులోనే  విశ్రాంతి తీసుకుని.. సహాయ చర్యలను పరిశీలించారు. విజయవాడ సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతనే ఆయన ఉండవల్లి నివాసానికి వెళ్లారు.                                              

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mudragada Padmanabha Reddy: మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
Tirumala Stampede: తిరుమలలో తొక్కిసలాట జరిగిన స్థలాన్ని పరిశీలించిన విచారణ కమిటీ సభ్యులు
Tirumala Stampede: తిరుమలలో తొక్కిసలాట జరిగిన స్థలాన్ని పరిశీలించిన విచారణ కమిటీ సభ్యులు
Chiranjeevi: వీరాభిమానితో మెగాస్టార్ మరో సినిమా... అనిల్ రావిపూడి, ఓదెలకు మధ్యలోనా? తర్వాత?
వీరాభిమానితో మెగాస్టార్ మరో సినిమా... అనిల్ రావిపూడి, ఓదెలకు మధ్యలోనా? తర్వాత?
Crime News: రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు, కాల్వల్లోకి దూసుకెళ్లిన వాహనాలు.. 16 మంది మృతి
రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు, కాల్వల్లోకి దూసుకెళ్లిన వాహనాలు.. 16 మంది మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Union Budget 2025 Top 5 Points | బడ్జెట్ చూడలేదా పర్లేదు..ఈ వీడియో చూడు చాలు | ABP DesamUnion Budget 2025 Income Tax Nirmala Sitharaman 12Lakhs No Tax | ఉద్యోగులకు పెద్ద తాయిలం ప్రకటించిన కేంద్రం | ABPNagoba Jathara Youngsters Musical Instruments | డోలు, సన్నాయిలతో కుర్రాళ్ల సంగీత సేవ | ABP DesamPM Modi Hints on Income Tax Rebate | ఆదాయపు పన్ను మినహాయింపు గురించి మోదీ నిన్ననే చెప్పారు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabha Reddy: మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
Tirumala Stampede: తిరుమలలో తొక్కిసలాట జరిగిన స్థలాన్ని పరిశీలించిన విచారణ కమిటీ సభ్యులు
Tirumala Stampede: తిరుమలలో తొక్కిసలాట జరిగిన స్థలాన్ని పరిశీలించిన విచారణ కమిటీ సభ్యులు
Chiranjeevi: వీరాభిమానితో మెగాస్టార్ మరో సినిమా... అనిల్ రావిపూడి, ఓదెలకు మధ్యలోనా? తర్వాత?
వీరాభిమానితో మెగాస్టార్ మరో సినిమా... అనిల్ రావిపూడి, ఓదెలకు మధ్యలోనా? తర్వాత?
Crime News: రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు, కాల్వల్లోకి దూసుకెళ్లిన వాహనాలు.. 16 మంది మృతి
రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు, కాల్వల్లోకి దూసుకెళ్లిన వాహనాలు.. 16 మంది మృతి
Sircilla News: సొంతిల్లు లేక రాత్రంతా మృతదేహంతో అంబులెన్స్‌లోనే కుటుంబం.. వారి కన్నీళ్లకు స్పందించిన కలెక్టర్
సొంతిల్లు లేక రాత్రంతా మృతదేహంతో అంబులెన్స్‌లోనే కుటుంబం.. వారి కన్నీళ్లకు స్పందించిన కలెక్టర్
Thandel Pre Release Event: అల్లు అర్జున్ వస్తున్నాడు... కండిషన్స్ అప్లై... చైతూ టీమ్ అలా చేయక తప్పదు మరి!
అల్లు అర్జున్ వస్తున్నాడు... కండిషన్స్ అప్లై... చైతూ టీమ్ అలా చేయక తప్పదు మరి!
Fruits for Period Cramp Relief : పీరియడ్స్​లో ఉన్నారా? అయితే ఈ పండ్లు తినేయండి, నొప్పి తగ్గడంతో పాటు మరెన్నో బెనిఫిట్స్
పీరియడ్స్​లో ఉన్నారా? అయితే ఈ పండ్లు తినేయండి, నొప్పి తగ్గడంతో పాటు మరెన్నో బెనిఫిట్స్
AP Pensions: ఏపీలో పెన్షనర్లకు బిగ్ షాక్, 18,036 మంది పింఛన్లను తొలగించిన కూటమి ప్రభుత్వం
ఏపీలో పెన్షనర్లకు బిగ్ షాక్, 18,036 మంది పింఛన్లను తొలగించిన కూటమి ప్రభుత్వం
Embed widget