అన్వేషించండి

Chandrababu : వైసీపీ పాలన సైడ్ ఎఫెక్టులే - దోపిడీ తప్ప ఒక్క పనీ చేయలేదు - చంద్రబాబు ఘాటు విమర్శలు

Andhra Pradesh: ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని కనీసం పట్టించుకోకపోవడం వల్లనే ఇప్పుడు అనేక సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. కొల్లేరు, తమ్మిలేరు ముంపు ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు.

Chandrababu On YSRCP :  వైఎస్ జగన్ పాలనా నిర్వాకం వల్లనే వరదలు వచ్చాయని చంద్రబాబు మండిపడ్డారు.  కొల్లేరు ,తమ్మిలేరు  పరివాహక ముంపు ప్రాంతాలను  సీఎం చంద్రబాబు పరిశీలించారు.  గత ఏడాదిలోనే బుడమేరుకి గండ్లు పడితే కనీసం పట్టించుకోకపోవడం వల్లనే సమస్యలు వచ్చాయన్నారు.  టీడీపీ ప్రభుత్వంలో  బుడమేరు ఆధునీకరణ కోసం మంజూరు చేసిన పనులను రద్దు చేశారనిమండిపడ్డారు.  బుడమేరు మొత్తం  జగన్  మనుషులు ఆక్రమించుకుని అమ్మేశారని..  నీళ్ళు పోవాల్సిన బుడమేరుని కబ్జా చేసి విజయవాడను మంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని కనీసం పట్టించుకోలేదు !            

గత ఐదేళ్లలో వైఎస్ఆర్‌సీపీ  చేసిన పాపాలే.. రాష్ట్రానికి శాపాలుగా మారాయని  చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరు గండ్లు పూడ్చివేత విషయంలో  ఆర్మీ సైతం చేతులెత్తేసినా  ఏపీ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఆధికారులను, మంత్రి నిమ్మల రామానాయుడు పట్టుబట్టి పూర్తి చేశారని చంద్రబాబు అభినందించారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క సారి కూడా బుడమేరు పూడిక తీయలేదని గుర్తు చేశారు. గతంలో వచ్చిన వర్షాలకు గండ్లు పడినా పూడ్చలేదన్ననారు.  బుడమేరు వాగు పరిధిలో గత ప్రభుత్వం అక్రమార్కులను ప్రోత్సహించిందని చంద్రబాబు ఆరోపించారు.  అక్రమ కట్టడాలకు తప్పుడు దారిలో అనుమతులిచ్చిందన్నారు. వాతావరణ మార్పుల వల్ల  కుండపోత వర్షాలు, వరదలు  వస్తున్నాయని..  ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వరదల ప్రభావం తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. 

నన్ను తిడితే అభిమానులకు కోపం రాదా? టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మరోసారి జగన్ సంచలన కామెంట్స్

దోచుకుని దాడులు చేసింది కాక అరెస్టు చేయవద్దని అంటున్నారు ! 

ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్ల విషయంపైనా చంద్రబాబు స్పందించారు.  ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు  కృష్ణా నదిలో బోట్లు వదిలి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వదిలిపెట్టిన నాలుగు బోట్లు వైసీపీ వాళ్లవేనని..  ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి ఆ పార్టీ వాళ్లు ఉద్దేశపూర్వకంగానే వాటిని నదిలో వదిలిపెట్టారని  చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయని..  ఒక దానిని మరొకటి చైన్లతో కట్టి నదిలో వదిలి పెట్టారని..ఇదంతా  ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు.  దాడులు చేసిన వారిని అరెస్టు చేయవద్దంటున్నారని మండిపడ్డారు.         

ఆక్రమణదారులు జైలుకే- స్వచ్చందంగా వదలుకోకుంటే చర్యలు తప్పవు- హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్                 

క్రిమినల్ పై రాజకీయాలు చేయడం నామోషీగా ఉంది  !     

ఇసుక అక్రమ రవాణాకు ఉపయోగించే బోట్లను వారు వదిలారన్నారు. ఆ బోట్లు టీడీపీ వాళ్లవేనని రివర్స్ ప్రచారం చేస్తున్నారని.. జగన్ మోహన్రెడ్డి లాంటి క్రిమినల్ పై రాజకీయాలు చేయడం నామోషీగా ఉందన్నారు. ప్రజల కోసమ తాను భరిస్తున్నానని..   రౌడీలు, గూండాలను తాను ఎన్నడూ సహించలేదని, సామాన్యులకు ఇబ్బంది కలిగించే వారిపట్ల తానెప్పుడూ కఠిన వైఖరినే అవలంభిస్తానని ప్రకటించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Tirumala Tickets Online: భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
Bigg Boss 8 telugu Day 6 Promo 3:  ఏ గేమ్స్‌ ఆడను.. బిగ్‌ బాస్‌పై అభయ్‌ అసహనం - యూ ఆర్‌ చీటర్‌ అంటూ సోనియాపై విరుచుకుపడ్డ యాష్మి
ఏ గేమ్స్‌ ఆడను.. బిగ్‌ బాస్‌పై అభయ్‌ అసహనం - యూ ఆర్‌ చీటర్‌ అంటూ సోనియాపై విరుచుకుపడ్డ యాష్మి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Tirumala Tickets Online: భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
Bigg Boss 8 telugu Day 6 Promo 3:  ఏ గేమ్స్‌ ఆడను.. బిగ్‌ బాస్‌పై అభయ్‌ అసహనం - యూ ఆర్‌ చీటర్‌ అంటూ సోనియాపై విరుచుకుపడ్డ యాష్మి
ఏ గేమ్స్‌ ఆడను.. బిగ్‌ బాస్‌పై అభయ్‌ అసహనం - యూ ఆర్‌ చీటర్‌ అంటూ సోనియాపై విరుచుకుపడ్డ యాష్మి
Adilabad: ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
Chandrababu News: చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
Poonam Kaur: త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్‌ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
AP Rains: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ - రాబోయే 3 రోజులు వర్షాలు
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ - రాబోయే 3 రోజులు వర్షాలు
Embed widget