అన్వేషించండి

Chandrababu House Attack: చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ... రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు... నకరికల్లులో అయ్యన్నపై కేసు

చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనలపై తాడేపల్లి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. జోగి రమేశ్‌ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు, టీడీపీ నేత జంగాల సాంబశివరావు ఫిర్యాదుపై మరో కేసు నమోదు చేశారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం వద్ద శుక్రవాం జరిగిన ఘర్షణపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. టీడీపీ నేత జంగాల సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు నమోదు చేయగా, పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసు నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. శుక్రవారం పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారి కర్రలు, రాళ్లతో వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల లాఠీఛార్జ్ కూడా చేశారు. 

అయ్యన్నపాత్రుడిపై కేసు

చంద్రబాబు నివాసం వద్ద దాడి ఘటనకు సంబంధించి పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నకరికల్లు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్ కారు ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మంపై నాలుగు సెక్షన్​ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు గత రాత్రి నుంచి ఎక్కడ ఉన్నారనే విషయంపై ఆరా పోలీసులు తీస్తున్నారు. తమ ఫిర్యాదులపై పోలీసులు స్పందించడంలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

జోగి రమేష్ పై కేసు

చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్​పై కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్​లో టీడీపీ ఫిర్యాదు చేసింది. కుట్ర పూరితంగా చంద్రబాబు ఇంటిపై దాడికి చేశారని జోగి రమేష్​ను అరెస్టు చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు న్యాయబద్దంగా విచారణ చేసి జోగి రమేష్, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

గవర్నర్ కు ఫిర్యాదు

చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ ఘటనపై టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను టీడీపీ నేతలు కలవనున్నారు. వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, ఆలపాటి రాజాతో కూడిన బృందం గవర్నర్ ను కలసి నిన్న జరిగిన సంఘటనపై వివరాలు అందజేయనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దండయాత్రగా చంద్రబాబు నివాసం పైకి వచ్చాడని సీసీటీవీ వీడియోలను సాక్ష్యాలుగా అందజేయనున్నారు.

Also Read: Rajamahendravaram News: రాజమహేంద్రవరంలో రాజకీయ వేడి... ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ... రంగంలోకి దిగిన ఫాలోవర్స్

దండయాత్ర కాదు నిరసన 

టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు చంద్రబాబు ఇంటికి వెళితే దండయాత్ర అంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ అన్నారు. చంద్రబాబును కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్లానన్నారు. తన వెంట వైసీపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని చెప్పారు. తన కారు అద్దాలు పగులగొట్టారని, దీనిపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. అయ్యన్న వ్యాఖ్యలపై బాధ కలిగి నిరసన తెలపడానికి వెళ్తే తన కారుపై రాళ్లేశారని ఆరోపించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యల పట్ల చంద్రబాబు స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతామన్నారు. 

Also Read: Political Foul Language : తిట్లకు తిట్లే సమాధానం ! ఏపీ రాజకీయాలు దారి తప్పాయా !?

టాప్ హెడ్ లైన్స్

ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget