అన్వేషించండి

Chandrababu Margadarsi: కుప్పంలో 250 పేద కుటుంబాలను దత్తత తీసుకున్న చంద్రబాబు - ఆగస్టు 15 నుంచి పీ4 మొదటి దశ

P4 :కుప్పంలో 250 పేద కుటుంబాలను చంద్రబాబు దత్తత తీసుకున్నారు.ఆగస్టు 15 నుంచి పీ4 మొదటి దశ అమలు చేసి ఆయా కుటుంబాల ఆదాయాన్ని పెంచేందుకు సహకారం అందించనున్నారు.

Chandrababu Naidu adopted 250 poor families in Kuppam :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు #IAmMargadarsi బ్యాడ్జిని అధికారులు చంద్రబాబుకు అందించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి పీ4 కార్యక్రమంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో #IAmMargadarsi పోస్టర్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

పిలుపునివ్వడమే కాదుఆచరించి చూపిస్తున్నా 

"కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను. ఆ కుటుంబాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. మార్గదర్శులు ముందుకు రావాలని పిలుపు ఇస్తున్న నేను.. చెప్పడమే కాదు.. ఆచరించి చూపాలని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా. ఈ కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రణాళిక రూపొందిస్తాను. ఐయామ్ ఏ మార్గదర్శి. సమాజంలో పేద-ధనికుల మధ్య అంతరాలు తగ్గించే ఇలాంటి కార్యక్రమాన్ని ఎక్కడా చేపట్టలేదు. గతంలో జన్మభూమి స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు పేదలను ఆదుకునేందుకు పీ4 అమలుకు ప్రణాళికలు చేపట్టాం. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచేలా రూపొందించాం. పేదలకు చేయూతనిచ్చే పీ4 కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.

 నేటి బంగారు కుటుంబాలే... రేపటి మార్గదర్శులు 

“పీ4లో భాగంగా బంగారు కుటుంబాలుగా నమోదైన వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. ఇవాళ్టి బంగారు కుటుంబాలు.. రేపటి మార్గదర్శలుగా ఎదగాలన్నదే నా ఆలోచన. సాయం పొందిన సాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. దీన్ని విజయవంతంగా అమలు చేయగలిగితే ఈ కార్యక్రమం శాశత్వంగా ఉండిపోతుంది. చాలా మందికి మంచి ఆలోచనలు ఉంటాయి.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యాలున్న వారు పేదరికం కారణంగా వెనుకబడిపోతున్నారు. ఇలాంటి వారికి చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఎన్నో కార్యక్రమాలు చేసిన నాకు.. పీ4 కార్యక్రమం మనస్సుకు చాలా దగ్గరగా ఉంది” అని చంద్రబాబు అన్నారు.

 ప్రతి బంగారు కుటుంబానికి విజన్ డాక్యుమెంట్ 

“బంగారు కుటుంబాలుగా నమోదైన వారి అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తాం. బంగారు కుటుంబాలు అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది.. వాళ్లు చేయగలిగే పనులేంటీ..? అనే అంశాలపై ఓ పది పాయింట్లతో కూడిన సర్వే చేపడుతున్నాం. వీరి అభివృద్ధికి ఏం చేస్తున్నామనే విషయాన్ని వివరించేందుకు ప్రతి బంగారు కుటుంబానికి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికల ద్వారా వారి అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తాం. బంగారు కుటుంబాల స్థితిగతులపై ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష చేపట్టాలి." అని సీఎం అన్నారు. 

 ఆగస్టు 15 నుంచి పీ4 ఫేజ్-1

“ఆగస్టు 15 నుంచి పీ4 మొదటి విడత ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నా దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు పని చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి క్షేత్ర స్థాయి ఉద్యోగి వరకు కృషి చేయాలి. బంగారు కుటుంబాలను.. మార్గదర్శులను గుర్తించే విషయంలో కొన్ని జిల్లాలు ఇంకా మెరుగ్గా పని చేయాలి. వచ్చే 15 రోజుల్లో దీని కోసం గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో కసరత్తు చేయాలి. ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి.” అని సీఎం సూచించారు. జూమ్  కాన్ఫరెన్సు ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. సీఎం స్ఫూర్తితో తాను కూడా ఐదు పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ ప్రకటించారు. షాజహాన్ ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ తరహా కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు సహకరిస్తామని ప్రజా ప్రతినిధులు సీఎంకు హామీనిచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan in Telangana Politics: పవన్ కల్యాణ్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ - తెరపైకి బీజేపీ, బీఆర్ఎస్, జనసేన కూటమి - కాంగ్రెస్ దూకుడు అందుకేనా?
పవన్ కల్యాణ్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ - తెరపైకి బీజేపీ, బీఆర్ఎస్, జనసేన కూటమి - కాంగ్రెస్ దూకుడు అందుకేనా?
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget