అన్వేషించండి

AP Floods: వరద బాధితులను ఆదుకోవాలంటూ దాతలకు చంద్రబాబు పిలుపు!

AP Floods: ఆంధ్రప్రదేశ్ లో వరదలతో సర్వం కోల్పోయిన వారిని ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాతలను కోరారు. వారిని ఆదుకోవడంలో సర్కారు విఫలమైందని, దాతలు ఆపన్నహస్తం అందించాలని విజ్ఞప్తి చేశారు.

AP Floods: ఏపీలోని వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. వరద చేసిన నష్టాన్ని పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించారు. వరదల వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు సాయం చేయాలని కోరారు. 

ఆపన్నహస్తం అందించండి

ఇలాంటి దిక్కుతోచని సమయంలో వారికి అండగా నిలవాలని, ఆపన్న హస్తం అందించాలని దాతలకు పిలుపు ఇచ్చారు. తమ వంతుగా కూరగాయలు, బియ్యం అందించి వారి కడుపు నింపాలని, రెండు పూటలా భోజనం పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రూపాయి రూపాయి పొదుపు చేసుకున్న సొమ్మంతా వరదల పాలైందని, ఇంట్లో సామానంతా తడిచి పోయిందని, తాగేందుకు నీరు కూడా లేక చాలా మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వరద బాధితులు సాయం కోసం వేయి కళ్లతో చూస్తున్నారని పేర్కొన్నారు. వరదల్లో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిల్చున్నారని, ఎవరైనా ముందుకు వచ్చి వారికి సాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి అభ్యర్థించారు. 

సాయంలో సర్కారు విఫలం..

ఏపీలో తీవ్ర వరదలు వస్తే సహాయక చర్యలు చేపట్టడంలో కానీ, వరద బాధితులకు సాయం చేయడంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి పాలనలో రాష్ట్రం అథోగతి పడుతోందని.. ఫ్యాన్ స్విచ్ బంద్ చేసి, సైకిల్ ను అధికారంలోకి తీసుకురావాలని బాబు కోరారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవితం గడుపుతారని పేర్కొన్నారు. 

ఏపీకి తీవ్ర వరదలు..

గడిచిన రెండు, మూడు సీజన్ల నుండి ఏపీ వరదలతో తీవ్ర నష్టాన్ని చవి చూస్తోంది. రైతులు, తీర ప్రాంత ప్రజలే కాకుండా ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా నష్టపోతోంది. గోదావరికి చరిత్రలో ఎన్నడూ లేనంత రీతిలో జులైలో అతి భారీ వరదలు వచ్చాయి. ప్రస్తుతం అయితే వరద ప్రభావం తగ్గినప్పటికీ ముప్పు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఆగస్టులో గోదావరికి, సెప్టెంబర్ నెలలో కృష్ణా నదికి వరదలు వస్తుంటాయి. తీవ్ర వర్షాలు పడ్డప్పుడు వరద ముప్పు ఉంటుంది. కానీ ఈసారి నెల, రెండు నెలల ముందే వరద వచ్చి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అటు ప్రజలను, ఇటు ప్రభుత్వానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ముందు ఉండటంతో వరద ముప్పు ఇంకా పొంచి ఉందనే చెబుతున్నారు అధికారులు. 

పరిష్కారంపై శ్రద్ధ పెట్టని ప్రభుత్వాలు..

జోరుగా కురుస్తున్న వర్షాలతో రెండు, మూడు సంవత్సరాల నుండి వరదల ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదుల్లో ఏదో ఒకదానికి వరద వస్తూనే ఉంది. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ... వరద సమస్యపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. తాత్కాలిక చర్యలు తప్పా.. సమస్య నుండి ప్రజలను రక్షించాలన్న దీర్ఘకాలిక వ్యూహం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరద సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి దానిని పరిష్కరించాలని బాధిత ప్రజలు కోరుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

రైలులో గర్భిణికి పురిటినొప్పులు.. ప్రయాణికురాలికి ప్రసవం చేసిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి పురిటినొప్పులు.. ప్రయాణికురాలికి ప్రసవం చేసిన విజయవాడ టీటీఈ జ్యోతి
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Somu Veerraju: కమ్యూనిస్టులు దేశానికి నీచులు - సోము వీర్రాజు ఆగ్రహం !
కమ్యూనిస్టులు దేశానికి నీచులు - సోము వీర్రాజు ఆగ్రహం !

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
రైలులో గర్భిణికి పురిటినొప్పులు.. ప్రయాణికురాలికి ప్రసవం చేసిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి పురిటినొప్పులు.. ప్రయాణికురాలికి ప్రసవం చేసిన విజయవాడ టీటీఈ జ్యోతి
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Embed widget