అన్వేషించండి

AP Floods: వరద బాధితులను ఆదుకోవాలంటూ దాతలకు చంద్రబాబు పిలుపు!

AP Floods: ఆంధ్రప్రదేశ్ లో వరదలతో సర్వం కోల్పోయిన వారిని ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాతలను కోరారు. వారిని ఆదుకోవడంలో సర్కారు విఫలమైందని, దాతలు ఆపన్నహస్తం అందించాలని విజ్ఞప్తి చేశారు.

AP Floods: ఏపీలోని వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. వరద చేసిన నష్టాన్ని పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించారు. వరదల వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు సాయం చేయాలని కోరారు. 

ఆపన్నహస్తం అందించండి

ఇలాంటి దిక్కుతోచని సమయంలో వారికి అండగా నిలవాలని, ఆపన్న హస్తం అందించాలని దాతలకు పిలుపు ఇచ్చారు. తమ వంతుగా కూరగాయలు, బియ్యం అందించి వారి కడుపు నింపాలని, రెండు పూటలా భోజనం పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రూపాయి రూపాయి పొదుపు చేసుకున్న సొమ్మంతా వరదల పాలైందని, ఇంట్లో సామానంతా తడిచి పోయిందని, తాగేందుకు నీరు కూడా లేక చాలా మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వరద బాధితులు సాయం కోసం వేయి కళ్లతో చూస్తున్నారని పేర్కొన్నారు. వరదల్లో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిల్చున్నారని, ఎవరైనా ముందుకు వచ్చి వారికి సాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి అభ్యర్థించారు. 

సాయంలో సర్కారు విఫలం..

ఏపీలో తీవ్ర వరదలు వస్తే సహాయక చర్యలు చేపట్టడంలో కానీ, వరద బాధితులకు సాయం చేయడంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి పాలనలో రాష్ట్రం అథోగతి పడుతోందని.. ఫ్యాన్ స్విచ్ బంద్ చేసి, సైకిల్ ను అధికారంలోకి తీసుకురావాలని బాబు కోరారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవితం గడుపుతారని పేర్కొన్నారు. 

ఏపీకి తీవ్ర వరదలు..

గడిచిన రెండు, మూడు సీజన్ల నుండి ఏపీ వరదలతో తీవ్ర నష్టాన్ని చవి చూస్తోంది. రైతులు, తీర ప్రాంత ప్రజలే కాకుండా ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా నష్టపోతోంది. గోదావరికి చరిత్రలో ఎన్నడూ లేనంత రీతిలో జులైలో అతి భారీ వరదలు వచ్చాయి. ప్రస్తుతం అయితే వరద ప్రభావం తగ్గినప్పటికీ ముప్పు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఆగస్టులో గోదావరికి, సెప్టెంబర్ నెలలో కృష్ణా నదికి వరదలు వస్తుంటాయి. తీవ్ర వర్షాలు పడ్డప్పుడు వరద ముప్పు ఉంటుంది. కానీ ఈసారి నెల, రెండు నెలల ముందే వరద వచ్చి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అటు ప్రజలను, ఇటు ప్రభుత్వానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ముందు ఉండటంతో వరద ముప్పు ఇంకా పొంచి ఉందనే చెబుతున్నారు అధికారులు. 

పరిష్కారంపై శ్రద్ధ పెట్టని ప్రభుత్వాలు..

జోరుగా కురుస్తున్న వర్షాలతో రెండు, మూడు సంవత్సరాల నుండి వరదల ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదుల్లో ఏదో ఒకదానికి వరద వస్తూనే ఉంది. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ... వరద సమస్యపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. తాత్కాలిక చర్యలు తప్పా.. సమస్య నుండి ప్రజలను రక్షించాలన్న దీర్ఘకాలిక వ్యూహం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరద సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి దానిని పరిష్కరించాలని బాధిత ప్రజలు కోరుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget