అన్వేషించండి

TDP Janasena Candidates : పొత్తు ప్రకటించిన రోజే వైసీపీ ఓడిపోయింది - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu : టీడీపీ, జనసేన పొత్తులు ప్రకటించిన రోజే వైసీపీ ఓడిపోయిందని చంద్రబాబు ప్రకటించారు. అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

TDP Janasena : రాష్ట్ర భవిష్యత్‌ కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నామని  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra babu) అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్‌ కోసమే ఈ నిర్ణయమని చెప్పారు. తమ పొత్తు కుదిరిన రోజే వైసీపీ కాడి వదిలేసిందన్నారు.   ఈ ఉమ్మడి ఒప్పందం ఏపీ చరిత్రలోనే ఓ చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. రాష్ట విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని చక్కదిద్ది అభివృద్ధి చేసే క్రమంలోనే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనలో తీవ్ర విఘాతం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్టం కోలుకోలేని స్థితికి దిగజారిందని, జరిగిన నష్టం ఒక వ్యక్తిది కాదని, అయిదు కోట్ల మంది ప్రజలకు నష్టం క‌లిగింద‌న్నారు చంద్ర‌బాబు. అయిదేళ్ల పాలనలో బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ని డెమాలిష్ చేశారని, అహంకారంతో ప్రజావేదికను కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసం అయిదేళ్లపాటు కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తప్పు అని ప్రశ్నించలేని స్థితిలో పవన్ కళ్యాన్‌పై నిర్బంధం పెంచారని, ఇప్పటం గ్రామంలో ఆందోళన నుంచి విశాఖలో రోడ్ షో వరకూ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థితిలో ప్రజలకు వైసీపీ నుంచి విముక్తి కలిగించేందుకు తమ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయని వివరించారు.

అభ్యర్థుల ఎంపికలోనూ రాజకీయంగా తీవ్ర ఎక్సైర్ సైజ్ చేశామని, 9 ఎన్నికల అనుభవం ఉన్న తాను మంచి అభ్యర్థులను ఎంపిక చేయటంలో క్షుణ్ణంగా పరిశీలించామని చంద్రబాబు చెప్పారు. కోటి పది లక్షల మంది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించామని, ప్రజలు, కార్యకర్తల మనోస్థితిని నమ్మి , సరైన సమాచారంతో అన్ని కోణాలు విశ్లేషించి అభ్యర్థులను ఎంపిక చేశామని, టీడీపీ నుంచి 118 స్థానాల్లోనూ , జనసేన 24 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో 23 మంది కొత్త అభ్యర్థులు ఉన్నారని, యువత, మహిళలు, బీసీలకే అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు, ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించే అభ్యర్థులనే ఎంపిక చేశామని చంద్రబాబు వివరించారు. ఇక ఎర్రచందనం స్మగ్లర్లను, రౌడీలను రంగంలోకి దించటమే కాదు, రాష్టం నలుమూలకు తరలించారని, అందుకే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, రాష్ట్రంలో భయం నెలకొందని చంద్రబాబు స్పష్టం చేశారు .   

పోటీ చేస్తున్న 94 మందిలో 23 మంది తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇందులో ఉన్నత చదువులు చదువుకున్నవారూ ఉన్నారు. అదే వైకాపా అభ్యర్థులను చూస్తే.. ఎర్ర చందనం స్మగ్లర్లను వారు పోటీకి పెట్టారు. మేం మాత్రం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే అభ్యర్థులనే  ఎంపిక చేశాం. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇరు పార్టీల మధ్య ఓటు బదిలీ జరగాలి. కాబట్టి పార్టీ కార్యకర్తలు ఇరు పార్టీల గెలుపునకు కృషి చేయాలి  అని పిలుపునిచ్చారు. 

గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు, తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు. 98 శాతం స్ట్రైక్‌ రేటు ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు. ఈ అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు ముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 60, 70 స్థానాలు కావాలని కొందరు అంటున్నారని, గత ఎన్నికల్లో 10 స్థానాలు గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేదని చెప్పారు. 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్‌ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
Embed widget