అన్వేషించండి

Avinash Reddy :నాలుగు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారన్న అవినాష్ రెడ్డి !

అవినాష్ రెడ్డిని నాలుగు గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారని ఆయన మీడియాకు తెలిపారు.

Avinash Reddy :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో హాజరయ్యారు. ఏడున్నర వరకూ సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి స్టేట్ మెంట్‌ను తొలి సారి నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. సీబీఐకి పూర్తిగా సహకరిస్తున్నానని.. కొంత మంది సీబీఐని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మళ్లీ అవసరమైతే పిలుస్తామని చెప్పారని అవినాష్ రెడ్డి తెలిపారు. వివేకా హత్య కేసుకు సంబంధించి తనకు తెలిసిన పూర్తి వివరాలు చెప్పానన్నారు.

అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీసులోకి వెళ్లినప్పటి నుండి ఆయన అనుచరులు బయట ఉత్కంఠగా గడిపారు. అయితే ఏడున్నర సమయంలో ఆయన బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. విచారణ సమయంలో సీబీఐ ఆఫీసుకు  అవినాష్ రెడ్డితో పాటు శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు వంటి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. లాయర్ ను అనుమతించాలని వారు మీడియా ముందు డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చే ముందే.. తాను సీబీఐ విచారణకు హాజరవుతున్నట్టుగా లేఖ రాసి అందులో కొన్ని విజ్ఞప్తులు చేశారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రారంభమైన దగ్గరనుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపిన అవినాష్ రెడ్డి.. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందన్నారు. తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారంచేస్తున్నారని అన్నారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్టుగా చెప్పారు. ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని.. తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, తన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 

అయితే ఈ విజ్ఞప్తులను సీబీఐ పట్టించుకోలేదు. లాయర్ ను కూడా లోపలికి అనుమతించలేదు. అంతకు ముందు సీబీఐ విచారణకు వెళ్లే ముందు..  లోటస్ పాండ్‌కు వెళ్లారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి  వైఎస్ విజయలక్ష్మి తో సమావేశం అయ్యారు.  దాదాపుగా అరగంట పాటు చర్చలు జరిపిన తర్వాత బయటకు వచ్చి నేరుగా  సీబీఐ ఆఫీసుకు వెళ్లారు. ఏ అంశాలపై చర్చించారన్నది స్పష్టత లేదు. అయితే ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. అవినాష్ రెడ్డికి ఈ నెల 24నే విచారణకు రావాలని 23న సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా ఐదు రోజుల తర్వాత విచారణకు రాగలనని ఎంపీ బదులిచ్చారు. దీంతో ఈ నెల 25న పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు విచారణకు రావాలని మళ్లీ నోటీసు ఇచ్చారు. దీంతో ఆయన సీబీఐ ఎదుట హాజరయ్యారు. 

 సీబీఐ విచారణ ఏ కోణంలో జరిగిందన్నదానిపై స్పష్టత లేదు. అయితే వివేకా  హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నం చేయడం.. దారుణ హత్య జరిగినా గుండె పోటు అని సమాచారం అందరికీ ఇవ్వడం గురించి ప్రధానంగా ప్రశ్నించారని చెబుతున్నారు. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case against Aare Shyamala: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
CM Revanth Reddy: ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
Deputy CM Pawan Kalyan: తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
Allu Sirish Nayanika : ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
Advertisement

వీడియోలు

Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case against Aare Shyamala: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
CM Revanth Reddy: ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
Deputy CM Pawan Kalyan: తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
Allu Sirish Nayanika : ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
ICC Women's World Cup 2025: జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి కారణం అదే! మానసికంగా కుంగదీస్తున్న వివాదాలకు బ్యాట్‌తో సమాధానం!
జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి కారణం అదే! మానసికంగా కుంగదీస్తున్న వివాదాలకు బ్యాట్‌తో సమాధానం!
Second Hand Car Buying Tips పాత కారు కొనే ముందు ఈ 3 విషయాలు తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!
పాత కారు కొనే ముందు ఈ 3 విషయాలు తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!
No Nut November : నవంబర్ స్పెషల్ NNN... అబ్బాయిలు ఇది ఫాలో అయితే కలిగే లాభాలేంటి? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
నవంబర్ స్పెషల్ NNN... అబ్బాయిలు ఇది ఫాలో అయితే కలిగే లాభాలేంటి? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
Salman Khan Revanth Reddy: హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
Embed widget