అన్వేషించండి

Anantapur Petrol Bunks :పెట్రోల్ కోసం కర్ణాటకకు చలో చలో.. మూతపడుతున్న బోర్డర్‌లోని ఏపీ బంకులు !

లీటర్‌కు రూ. పది తక్కువ కావడంతో సరిహద్దుల్లో ఉన్న జనం అంతా కర్ణాటకకుపోయి పెట్రోల్, డిజిల్ కొట్టించుకుంటున్నారు. దీంతో సరిహద్దుల్లోఉన్న ఏపీ పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి.


ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పెట్రోల్ బంకులు మూత పడుతున్నాయి. కొనేవారే కనిపించడం లేదు. ఎందుకంటే బోర్డర్ దాటితే అతి తక్కువకే పెట్రోల్ వస్తోంటే్.. ఎక్కువ ధర పెట్టి ఏపీలోనే కొనాలని ఎందుకనుకుంటారు ? అందుకే కర్ణాటకలో బంకులకు వ్యాపారం పెరిగిదంది.  బోర్డర్‌లో ఉన్న ఏపీ పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. ఇటీవల కేంద్రం పెట్రో ధరలను రూ.ఐదు తగ్గించింది. దానికి తోడు కర్ణాటక మరికొంత తగ్గించింది. ఏపీలో కేంద్రం తగ్గించిన మొత్తం తగ్గింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా తగ్గించడానికి నిరాకరించింది. దీంతో కర్ణాటకలో పెట్రోల్ రేట్లు చవకగా మారాయి.  దీంతో బోర్డర్‌లో ఉన్న ప్రజలంతా కర్ణాటక వెళ్లి పెట్రోల్, డీజిల్ కొట్టించుకుని వస్తున్నారు.
Anantapur Petrol Bunks :పెట్రోల్ కోసం కర్ణాటకకు చలో చలో.. మూతపడుతున్న బోర్డర్‌లోని ఏపీ బంకులు !

Also Read: పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... వ్యద్ధాప్య పింఛన్లు పెంచుతూ కీలక నిర్ణయం

అనంతపురం జిల్లా  చిలమత్తూరు మండలం లో 9 పెట్రోల్ బంకులు ఉన్నాయి. మండలం కర్ణాటకను ఆనుకుని ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు మాత్రం పెట్రోల్ డీజిల్ కోసం కర్ణాటకకు పరుగులు తీస్తున్నారు. మన రాష్ట్రంలో కంటే కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు బాగా తక్కువగా ఉండటంతో ఇక్కడ వ్యాపారాలు జరగక ఉన్న పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మన రాష్ట్రంలో పెట్రోల్ లీటరు ధర రూ. 111.11 లుగా, డీజిల్ ధర లీటర్ రూ.97.13 లుగా ఉంది. అదే కర్ణాటక విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 101.34 లుగా, లీటర్ డీజిల్ ధర రూ. 85.49 లుగా ఉంది. ఈ లెక్కన మన రాష్ట్రంలో కంటే కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 9.77 లు, లీటర్ డీజిల్ ధర రూ. 11.64 లు తక్కువగా ఉంది.
Anantapur Petrol Bunks :పెట్రోల్ కోసం కర్ణాటకకు చలో చలో.. మూతపడుతున్న బోర్డర్‌లోని ఏపీ బంకులు !

Also Read:  10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం... తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు... టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం

ఒకటి, రెండు కిలోమీటర్లు దాటితే పెట్రోల్, డీజిల్ రేటు రూ. పది తగ్గుతూండటంతో అందరూ కర్ణాటకకే వెళ్తున్నారు.  ఆటోవాలాలు, ట్రాక్టర్ల కోసం రైతులు, ద్విచక్ర వాహనదారులు ఇలా ప్రతి ఒక్కరూ తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ ఇస్తున్న కర్ణాటక బంకులకు క్యూకడుతున్నారు. ఈ కారణంగా చిలమత్తూరు మండలం లో ఉన్న పెట్రోల్ బంకులు వ్యాపారాలను కోల్పోయాయి. ఉన్న తొమ్మిది బంకుల్లో ఏకంగా 5 బంకులు మూతపడ్డాయి. మూతబడిన బంకులు 44వ జాతీయ రహదారిపై ఉండడం వలన ఎవరికైనా అత్యవసరంగా డీజిల్ , పెట్రోల్ అవసరం అయితే  కర్ణాటకకు పరుగులు తీయాల్సిన పరిస్థితి  నెలకొంది.
Anantapur Petrol Bunks :పెట్రోల్ కోసం కర్ణాటకకు చలో చలో.. మూతపడుతున్న బోర్డర్‌లోని ఏపీ బంకులు !

Also Read: జగన్ హామీ నెరవేరలేదు.. పైగా జైలు పాలయింది..! టీటీడీ పారిశుద్ధ్య కార్మికులు రాధ దీన స్థితి...

గతంలోనూ కర్ణాటకతో పోలిస్తే ఏపీలో రేట్లు ఎక్కువగానే ఉండేవి. కానీ ఆ తేడా మరీ ఎక్కువగా ఉండేది కాదు. రెండు, మూడు రూపాయల్లో ఉండేది. కానీ కేంద్రం పిలుపు మేరకు కర్ణాటక ప్రభుత్వం వ్యాట్ తగ్గించడంతో తేడా పెరిగిపోయింది. ఏపీ ప్రభుత్వం కూడా రేట్లు తగ్గిస్తే తప్ప.. మళ్లీ బోర్డర్‌లోని పెట్రోల్ బంకుల వైపు జనం చూసే అవకాశం లేదు. పన్నులు తగ్గించకూడదన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల బోర్డర్‌లోని ఇతర రాష్ట్రాల పెట్రోల్ బంకులకు  భారీగా వ్యాపారం పెరిగింది. 

Also Read: ఏపీ హైకోర్టు సీజేకు ఎంపీ రఘురామ లేఖ... జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం... సుమోటోగా విచారణ చేయాలని వినతి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget