అన్వేషించండి

MP Raghu Rama: ఏపీ హైకోర్టు సీజేకు ఎంపీ రఘురామ లేఖ... జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం... సుమోటోగా విచారణ చేయాలని వినతి

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు సీజేకు ఎంపీ రఘురామ లేఖ రాశారు. జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను కించపరిచేలా జరుగుతున్న కుట్ర అని రఘురామ అన్నారు.

ఏపీ హైకోర్టు జడ్జిలను ఉద్దేశించి మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. జస్టిస్ చంద్రు బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారని లేఖలో రఘురామ అన్నారు. ఏపీలో పరిస్థితులకు సంబంధించి కొద్ది రోజుల క్రింత జస్టిస్ చంద్రు ఓ ఇంగ్లీష్ పత్రికలోనూ ఆర్టికల్‌ రాశారని తెలిపారు. గతంలో వైసీపీ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు ఆయనే జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యలు చేయడంలోనూ కీలకపాత్ర పోషించారని రఘురామ లేఖలో అన్నారు.  న్యాయ వ్యవస్థపై దూషణలు చేసిన వారిలో ఆ ఎంపీ పేరు కూడా ఉందని తెలిపారు. అయినా ఆయనపై ఇప్పటివరకూ చర్యలు లేవని రఘురామ గుర్తుచేశారు. జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యలు కోర్టులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్నారు. దేశ న్యాయవ్యవస్థను కించపరిచేలా జరుగుతున్న కుట్రపై సుమోటోగా విచారణ ప్రారంభించాలని లేఖలో రఘురామ ఏపీ హైకోర్టు సీజేను కోరారు. 

Also Read: సీడీఎస్‌కే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

జస్టిస్ చంద్రు ఏమన్నారంటే...?

న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థనూ దూషించిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై జస్టిస్ చంద్రు తప్పుబట్టారు. ఏపీలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు ఉనికి కాపాడుకోవడం కోసం యుద్ధం చేస్తోందని, ఆ యుద్ధం శత్రువులు, రాజకీయ ప్రత్యర్ధులతో కాదు న్యాయ వ్యవస్థతో చేస్తోందని విమర్శించారు. అమరావతి భూముల విషయంలో ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని ఇప్పుడు కోర్టులు న్యాయం చేయాల్సింది పోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో జడ్జిల విమర్శలు చేస్తే ఈ వ్యవహారాన్ని  హైకోర్టు సుమోటోగా తీసుకుందని ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయించి సీబీఐకి అప్పగించిందన్నారు. నలుగురిని అరెస్టు చేశారు మరో ఇద్దరిని అరెస్టు చేయడానికి విదేశాలకు వెళ్తున్నారని సోషల్ మీడియాలో చూస్తున్నామన్నారు. 

Also Read:  గ్రామ, వార్డు మహిళా కార్యదర్శులు పోలీసులు కారు.. జీవోను ఉపసంహరించుకుటామని హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కార్ !

చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం

జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కొంత మంది మీడియా లైమ్‌లైట్‌లో ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, లైట్స్ ఆఫ్ చేస్తామని ధర్మానసం మండిపడింది.  ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామన్న కోర్టు.. జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని వ్యాఖ్యానించింది. ఒకటి, రెండు అంశాలను చూపించి మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని ప్రశ్నించింది. ఒక డాక్టర్‌ని పోలీసులు రోడ్‌పై విచక్షణారహితంగా కొట్టారు హక్కుల గురించి పోరాడాలంటే విశాఖకు వెళ్లాలని సూచించింది. దేశంలోని ఇతర హైకోర్టులతో పోలిస్తే జడ్జి నుంచి కక్షిదారుల వరకు ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేవని, కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తుచేసింది. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పా అని జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు.

Also Read:  ఏపీ మద్యం దుకాణాల్లో క్యాష్ ఓన్లీ.. పెద్ద స్కాంగా లోక్‌సభలో రఘురామ ఆరోపణ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget