అన్వేషించండి

Andhra BJP : పదకొండో సీటు కోసం పట్టుబడుతున్న బీజేపీ - రాజంపేట తీసుకుంటారా ?

Andhra News : ఏపీలో బీజేపీ పదకొండో సీటు కోసం పట్టుబడుతోంది. చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.

BJP Wanted  Eleventh seat in AP :   ఏపీలో భారతీయ జనతా పార్టీ మరో సీటు కోసం పట్టుబడుతున్నట్లగా తెలుస్తోంది. ఇప్పటికి పది అసెంబ్లీ సీట్లను కేటాయించారు. వాటిలో అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నారు. అయితే పార్టీ నేతల నుంచి టిక్కెట్ల కోసం ఒత్తిడి పెరిగిపోవడంతో మరో సీటును కేటాయించాలని టీడీపీని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీకి ఎన్నికల ఇంచార్జ్ గా బీజేపీ సీనియర్ నేత అరుణ్ సింగ్ వచ్చారు. ఆయన నేతృత్వంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  అరుణ్ సింగ్.. బీజేపీ పదకొండు స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే ఆ పదకొండో స్థానం ఏమిటో చెప్పలేదు. కడప జిల్లాలోనే మరో స్థానం కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట లేదా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. 

బీజేపీ ప్రతిపాదనలపై టీడీపీ స్పందన ఎలా ఉందో స్పష్టత లేదు. ఇప్పటికే కడప జిల్లాలో ఓ సీటు జనసేనకు..మరో సీటు బీజేపీకి ఇచ్చినందున మరో సీటు ఇచ్చే అవకాశం లేదని సమాధానం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. పదాధికారుల భేటీలో ఎన్నకిల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.  బుధవారం  సాయంత్రంలోగా ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి.  పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం పని చేయాలని కిందిస్థాయి నేతలకు అగ్ర నేతలు దిశా నిర్దేశనం చేశారు.  పార్టీ కోసం పని చేసిన నేతలకు అవకాశాలు రాకున్నా బాధపడొద్దని ముఖ్య నేతలు చెబుతున్నారు. పొత్తులో భాగంగా త్యాగాలు తప్పవని బుజ్జగిస్తున్నారు. టికెట్లు దక్కకపోయినా పార్టీ అందరి సేవలనూ గుర్తు పెట్టుకుంటుందని పార్టీ పెద్దలు భరోసా కల్పిస్తున్నారు. కలిసికట్టుగా పని చేసి విజయం సాధించాలని కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.
 
ఇక వచ్చే నెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రచారాన్ని చేపట్టనుంది. ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి ఎంపీగా బరిలోకి దిగుతున్న రాజమండ్రి నుంచే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు ప్రచారసభల్లో పాల్గొనేలా టూర్ షెడ్యూల్స్‌ను ఖరారు చేస్తున్నారు. వీటితో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిపి ఉమ్మడి బహిరంగ సభలు కూడా ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై ఆలోచన చేస్తున్నారు. నియోజకవర్గాలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకునేలా ట్రైనింగ్‌ ఇస్తున్నారు. పోటీ చేయబోయే నియోజకవర్గాలకు ప్రత్యేకంగా కొన్ని టీమ్‌లను ఎంపిక చేయనున్నారు. బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్లకు, నియోజకవర్గంపై పట్టున్న లీడర్లకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు.

పదాధికారుల భేటీకి సీనియర్ నేతలు  విష్ణువర్ధన్  రెడ్డి, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వంటి వారు హాజరు కాలేదు. పోటీ చేసే సీట్లు దక్కనందునే వారు హాజరు కాలేదని తెలుస్తోంది. అయితే సోము వీర్రాజుకు అవకాశం కల్పించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. రాజమండ్రి రూరల్ లేదా అర్బన్ సీట్లలో ఒకటి కేటాయించాలని అడుగుతున్నారని చెబుతున్నారు. కానీ ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు.                

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget