అన్వేషించండి

AP BJP MLA Candidates: ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల, ఎవరు ఎక్కడినుంచంటే!

Andhra Pradesh BJP MLA Candidates: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 10 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

AP Assembly Elections 2024: అమరావతి: త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల (BJP MLA Candidates)ను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. కూటమిలో బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. గత కొన్ని రోజులుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులపై కసరత్తు చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.

నియోజకవర్గం - అభ్యర్థుల పేర్లు
ధర్మవరం  -  సత్యకుమార్‌
ఎచ్చెర్ల  -  ఈశ్వరరావు
విశాఖ నార్త్‌ -  విష్ణుకుమార్‌ రాజు
అనపర్తి  -  శివకృష్ణంరాజు
విజయవాడ వెస్ట్‌ -  సుజనా చౌదరి
అరకు(ST)  -  పాంగి రాజారావు
బద్వేలు(SC)  -  బొజా రోషన్న
కైకలూరు  -  కామినేని శ్రీనివాస రావు
ఆదోనీ  -  పీవీ పార్థసారథి
జమ్మలమడుగు -  ఆదినారాయణరెడ్డి

ధర్మవరం టికెట్ కోసం కూటమి నేతలు ముగ్గురు పోటీ పడగా చివరికి బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ వైపు మొగ్గుచూపారు. టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ ధర్మవరం టికెట్ తనకే వస్తుందని భావించారు. మరోవైపు పొత్తు ఖరారు అయిన తరువాత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల రేసులోకి వచ్చారు. ఆపై బీజేపీ నుంచే సత్యకుమార్ ధర్మవరం సీటు ఆశించారు. చివరికి సత్యకుమార్ ను ధర్మవరం నుంచి బరిలోకి నిలుపుతున్నట్లు బీజేపీ తాజా జాబితాలో ప్రకటించింది.

విశాఖ నార్త్‌ నుంచి విష్ణుకుమార్‌ రాజు, విజయవాడ వెస్ట్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, కైకలూరు నుంచి రాష్ట్ర మాజీ మంత్రి  కామినేని శ్రీనివాసరావు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి టికెట్ దక్కించుకున్నారు.


AP BJP MLA Candidates: ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల, ఎవరు ఎక్కడినుంచంటే!

కూటమిగా ఏర్పడి ఎన్నికలకు.. 
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి వైఎస్ జగన్ ను అధికారం నుంచి దించడమే లక్ష్యంగా ఎన్నికలకు వెళ్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు వచ్చాయి. బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో చంద్రబాబుకు చెందిన టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన జగన్, చంద్రబాబు 
వైసీపీ అధినేత, సీఎం జగన్ వైనాట్ 175 అంటూ సింగిల్ గా ఎన్నికలకు వెళ్తున్నారు. తమకు ప్రజలతోనే పొత్తు అని, తమకు సామాన్యులే స్టార్ కంపెయినర్లు అని వైఎస్ జగన్, ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధమంటూ బస్ యాత్రను ప్రారంభించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం బుధవారం నాడు ఏపీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. దాంతో ఏపీలో ప్రచార హోరు ఇక మొదలైందని, ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇకనుంచి మరో లెక్క అనే ఎన్నికల వాతావరణం కనిపించనుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget