అన్వేషించండి

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి - ఇద్దరు శ్రీకాకుళం జవాన్లు మృతి

Andhrapradesh News: జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఆ గ్రామాల్లో విషాదం నెలకొంది.

Srikakulam Jawans Died In Terror Attack In Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. సోమవారం రాత్రి ఉగ్రవాదులు, ఆర్మీ బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో  ఓ ఆర్మీ అధికారి సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు సైతం గాయపడ్డారు. ఈ కాల్పుల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం వల్లభరాయునిపాలెం గ్రామానికి చెందిన జవాన్ జగదీశ్వరరావు అమరుడయ్యారు. అలాగే, సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రకు చెందిన జవాన్ డొక్కరి రాజేష్ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆయా కుటుంబాలకు ఆర్మీ అధికారులు తెలియజేశారు. దీంతో జవాన్ల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో రెండు గ్రామాల్లోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి అచ్చెన్న బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేశం కోసం అమరులైన ఇద్దరు జవాన్లకు దేశ ప్రజలంతా ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. జవాన్ల మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు.

ఏడాదిన్నరలో పదవీ విరమణ

నందిగాం మండలానికి చెందిన జవాన్ జగదీశ్వరరావు మరో ఏడాదిన్నరలో పదవీ విరమణ చేయాల్సి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. 2002లో ఆర్మీకి ఎంపికైన ఆయన.. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో హవల్దార్‌గా పని చేస్తున్నారు. జగదీశ్వరరావుకి తల్లిదండ్రులు మల్లేశ్వరరావు, నారాయణమ్మతో పాటు భార్య సమత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జగదీశ్వరరావు సోదరుడు విఘ్నేశ్వరరావు సైతం ఆర్మీలోనే పని చేస్తున్నారు.

కాగా, జమ్మూకాశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు కలవరపెడుతున్నాయి. దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు భద్రతా బలగాలతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఉగ్ర కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులైనట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: Nandyal Girl Case: బాలిక మృతదేహానికి రాయి కట్టి నదిలో పడేసింది ఓ బాలుడి తండ్రి - నంద్యాల ఎస్పీ సంచలన విషయాలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
Rampachodavaram Mega PTM: ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP Education Reforms: ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన
ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget