అన్వేషించండి

AP Congress: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తు గడువు పెంపు - ఏపీసీసీ కీలక నిర్ణయం

Andhrapradesh News: రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున పోటీ కోసం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ గడువును ఏపీసీసీ పెంచింది. నేతల విజ్ఞప్తి మేరకు ఈ నెల 29 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

APCC Extends MP And Mlas Applications Date: ఏపీసీసీ (APCC) ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఇచ్చిన గడువు శనివారంతో ముగియగా.. ఈ నెల 29 వరకూ గడువు పొడిగిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ (Congress) ప్రకటించింది. ఇప్పటివరకూ 175 అసెంబ్లీ స్థానాలకు 793 దరఖాస్తులు రాగా.. 25 పార్లమెంట్ స్థానాలకు 105 దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని.. గడువు పెంచాలని నేతలు కోరడంతో మరో 20 రోజులు సమయం ఇస్తున్నట్లు ఏపీసీసీ ప్రకటించింది. అయితే, ఏ జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది. కాగా, ఒక్కో నియోజకవర్గానికి 5 నుంచి 10 మంది ఆశావహులు పోటీ పడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అటు, తెలంగాణలోనూ ఎంపీ అభ్యర్థుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ఇటీవలే ముగిసింది. 

ఏపీసీసీ చీఫ్ షర్మిల 'రచ్చబండ'

మరోవైపు, ఏపీసీసీ చీఫ్ షర్మిల వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. శనివారం నర్సీపట్నం నియోజకవర్గం ములగపూడి గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వైఎస్సార్ చనిపోయాక జగన్ ఆక్రమాస్తుల కేసు FIRలో వైఎస్సార్ పేరు చేర్చడం కాంగ్రెస్ పార్టీ కావాలని చేసిన తప్పు కాదని.. అది తెలియక చేసిన పొరపాటే అని స్పష్టం చేశారు. వైఎస్సార్ కుటుంబం అంటే గాంధీ కుటుంభానికి ఇప్పటికీ మమకారం ఉందని.. వైఎస్సార్ అంటే సోనియాకి గౌరవం అని పేర్కొన్నారు. తన మనసు నమ్మింది కాబట్టే కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఏ మాత్రం మోసం చేయలేదని  స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన తరిమికొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. 'సీఎం జగన్ బీజేపీకి బానిసగా మారారు. వైసీపీ, తెలుగుదేశం రెండూ బీజేపీ గుప్పిట్లో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం మనకు వద్దు.' అని అన్నారు.

సీఎంపై విమర్శలు

'వైఎస్సార్ ఆశయ సాధన అంటే జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయాలి. ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి.' కానీ జలయజ్ఞం ప్రాజెక్టులను ఎందుకు నిర్లక్ష్యం చేశారని షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగ అనిపించేలా చేశారని మండిపడ్డారు. గిట్టుబాటు ధర లేక పంట నష్ట పరిహారం అందక సబ్సిడీ పథకాలు పూర్తిగా ఎత్తివేశారని ఆరోపించారు. రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవని.. ఇక్కడ 25 మంది ఎంపీలు ఉన్నా హోదా సాధించలేకపోయారని విమర్శించారు. బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే.. ఒక్క రోజు కూడా ఆందోళన చేసింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మీద దండయాత్ర చేయాల్సింది పోయి.. వంగి వంగి దండాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు హడావుడిగా ఉద్యోగాల భర్తీ అంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని.. 25 వేల DSC ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని మండిపడ్డారు. మద్యపాన నిషేదం చేయకపోతే ఓటు అడగను అన్నాడని.. నిషేదం పక్కన పెడితే .. సర్కారే మద్యం అమ్ముతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర హక్కులు కాపాడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.

Also Read: Telangana Budget 2024: అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్లు - వ్యవసాయ బడ్జెట్‌పై నిరంజన్ రెడ్డి సెటైర్లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget