అన్వేషించండి

Sun Eclipse : ముగిసిన సూర్యగ్రహణం, తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న ఆలయాలు

Sun Eclipse : 22 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం పాక్షికంగా కనిపించింది. ఆలయాలు తిరిగి తెరుచుకున్నాయి.

Sun Eclipse : తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపించిన సూర్యగ్రహణ ముగిసింది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు తిరిగి తెరుచుకున్నాయి. ఆకాశంలో అద్భుత ఘట్టం కనిపించింది. ఆశ్వయుజ మాసం బహుళ పక్ష అమావాస్య స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్య గ్రహణం పలు దేశాల్లో స్పష్టం కనిపించింది.  భారత్‌లో మాత్రం పాక్షకికంగా సూర్యగ్రహణం కనిపించింది. మంగళవారం సాయంత్రం 4.29 గంటలకు దిల్లీలో ప్రారంభం కాగా 4.59 గంటలకు హైదరాబాద్‌లో గ్రహణం మొదలైంది. ఏపీలోని విజయవాడలో 4.49 గంటలకు, తిరుపతిలో గం.5.01 లకు సూర్య గ్రహణం మొదలైంది.   హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో సూర్య గ్రహణం వీక్షించేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు.  దాదాపు 22 ఏళ్ల తర్వాత దీపావళి అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రహణాన్ని వీక్షించేందుకు రెండు భారీ టెలిస్కోప్‌లు ఏర్పాటు చేశారు. టెలిస్కోప్‌ ప్రొజెక్టర్‌కు అనుసంధానం చేసి తెరపైనా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.  

శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తులు 

సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులు పోటెత్తారు. గ్రహణ సమయంలో తెరిచే ఏకైక ఆలయం కావడంతో గ్రహణకాలంలో స్వామి అమ్మవార్ల అభిషేకం చేసేందుకు భారీగా శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే వీఐపీలకు ఇతర సిఫారసు భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ సామాన్య భక్తుల క్యూ లైన్ లో నిలిపివేశారు అంటూ అధికారులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. సూర్య గ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తిలో స్వామిని  ఏపీ విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం‌ వద్దకు చేరుకున్న మంత్రికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో సూర్యగ్రహణ  కాలంలో పోటెత్తిన భక్తులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిషేక దర్శనానికి రావడంతో భక్తులను నిలిపివేశారు.  క్యూ లైన్ ఆపివేయడంతో ఒక్కసారిగా భక్తులు గేట్లు తెంచుకుని బోర్డు సభ్యుడు మున్న రాయల్ తో వాగ్వివాదానికి దిగారు. 

 తెరుచుకున్న శ్రీవారి ఆలయం 

పాక్షిక సూర్యగ్రహణం వీడడంతో తిరుమల శ్రీవారి ఆలయం తెరచుకుంది. మంగళవారం ఉదయం  8:11 గంటలకు ఆలయ మహాద్వారాలను సూర్యగ్రహణానికి పది గంటల ముందే మూసివేశారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులను తాత్కాలికంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అనుమతిని రద్దు చేసింది. అంతే‌ కాకుండా తిరుమలలో లడ్డూ వితరణ, అన్నప్రసాదం వితరణను సైతం టీటీడీ నిలిపివేసింది. సూర్య గ్రహణం వీడిన అనంతరం శాస్త్రబద్దంగా ఆలయ అర్చకులు రాత్రి 7:30 గంటలకు టీటీడీ అధికారుల సమక్షంలో ఆలయ ద్వారాలను తెరిచారు. అనంతరం ఆలయ శుద్ది కార్యక్రమం చేపడుతూ ఒక్కొక్క ద్వారాన్ని తెరిచారు ఆలయ అర్చకులు. పుణ్యవచనంను నిర్వహించడంతో గ్రహదోషం తోలగి పోయింది.. అనంతరం మూలవిరాట్టు‌పై కప్పిన వస్త్రం తొలగించి స్వామి వారికి రాత్రి కైంకర్యాలైన తోమాల, అర్చన సేవలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు.  తరువాత స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తర్వాత  రాత్రి 8:30 గంటల నుండి సామాన్య భక్తులను శ్రీవారిని దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vamsi Video: సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
Telangana Highcourt: వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Telangana Indiramma Illu Latest News: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP DesamNita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP DesamNita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vamsi Video: సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
Telangana Highcourt: వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Telangana Indiramma Illu Latest News: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
Revanth Reddy: సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
SKN: 'జోక్‌ను జోక్‌లా తీసుకోండి.. తప్పుడు ప్రచారం వద్దు' - తెలుగుమ్మాయిల కామెంట్స్‌పై 'బేబీ' నిర్మాత ఎస్కేఎన్ వివరణ
'జోక్‌ను జోక్‌లా తీసుకోండి.. తప్పుడు ప్రచారం వద్దు' - తెలుగుమ్మాయిల కామెంట్స్‌పై 'బేబీ' నిర్మాత ఎస్కేఎన్ వివరణ
Mancherial District Latest News: స్కూల్‌కు వెళ్లడానికి మొండికేసిన విద్యార్థి- ఆరా తీస్తే ఏడుగురు స్టూడెంట్స్‌ సస్పెండ్ అయ్యారు, ప్రిన్సిపాల్‌ ఉద్యోగం పోయింది!
స్కూల్‌కు వెళ్లడానికి మొండికేసిన విద్యార్థి- ఆరా తీస్తే ఏడుగురు స్టూడెంట్స్‌ సస్పెండ్ అయ్యారు, ప్రిన్సిపాల్‌ ఉద్యోగం పోయింది!
Nandamuri Taraka Ratna: నందమూరి తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ - పిల్లలు ఎంత ఎదిగిపోయారో తెలుసా?
నందమూరి తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ - పిల్లలు ఎంత ఎదిగిపోయారో తెలుసా?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.