అన్వేషించండి

Breaking News Live Telugu Updates:పలాస టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావుపై హత్యాయత్నం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates:పలాస టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావుపై హత్యాయత్నం

Background

నేడు ఉత్తర - దక్షిణ ద్రోణి/గాలి విచ్చిన్నతి దక్షిణ ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు: 
నిన్న తూర్పు మధ్యప్రదేశ్ నుండి తెలంగాణ వరకు ఉన్న ద్రోణి /గాలి విచ్చిన్నతి, ఈరోజు బలహీన పడింది. కాబట్టి, రాగల మూడు రోజులు తెలంగాణ  రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 5 వరకూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేశారు.

Weather Warnings: వాతావరణ హెచ్చరికలు
ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో  కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 45 శాతం నమోదైంది.

ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు ఎక్కడా వర్షాలు పడే అవకాశం లేదని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు.

ఢిల్లీలో వాతావరణం ఇలా..
ఏప్రిల్, జూన్ మధ్య దేశంలోని చాలా ప్రాంతాలలో తీవ్రమైన వేడి ఉండే అవకాశం ఉంది. భారత వాతావరణ విభాగం (IMD) శనివారం (ఏప్రిల్ 1) వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ద్వీపకల్ప ప్రాంతం మినహా, దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నుండి జూన్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో, మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

ఏప్రిల్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. ఏప్రిల్‌లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ చెబుతోంది. వాయువ్య, మధ్య, ద్వీపకల్ప ప్రాంతంలోని చాలా ప్రాంతాలలో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, అయితే తూర్పు, ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

19:42 PM (IST)  •  02 Apr 2023

పలాస టీడీపీ అధ్యక్షుడు లక్ష్మణరావుపై హత్యాయత్నం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావుపై దుండగులు హత్యాయత్నం చేశారు. లక్ష్మణరావు కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు. స్థానికులు చేరు కోవడంతో దుండగులు పరారయ్యారు. సోంపేట వైపు బస్సులో దుండగులు పరారయ్యారు. గాయపడిన లక్ష్మణరావును గౌతు శిరీష ఆసుపత్రికి తరలించారు.  

14:49 PM (IST)  •  02 Apr 2023

Eluru District: కుటుంబంపై కత్తులతో దాడి, ముగ్గురూ హత్య

  • ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగుడెంలో దారుణ ఘటన
  • గ్రామానికి చెందిన ఓ కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి 
  • భార్యభర్తలతో పాటు చిన్నారిని కూడా కత్తితో నరికిన ఆగంతకులు
  • తీవ్ర గాయాలతో ప్రాణాపాయ పరిస్థితిలో కుటుంబం
  • జంగారెడ్డి గూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
  • ఘటనపై మైసన్నగూడెంలో విచారణ చేపట్టిన పోలీసులు
13:03 PM (IST)  •  02 Apr 2023

Tirumala News: శ్రీవారి సేవలో‌ పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని‌ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి, సినీనటుడు రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ లు వేర్వేరుగా స్వామి వారి‌ సేవలో పాల్గోని‌ మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల ‌మండపంలో‌‌ వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

12:17 PM (IST)  •  02 Apr 2023

Tirupati District News: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

తిరుపతి జిల్లా, కెవిబి.పురం మండలం, జ్ఞానమ్మకండ్రిగలో మునయ్య అనే రైతు అప్పుల బాధ తాళలేక తన పొలంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తరలించగా చికిత్స పొందుతూ రైతు మునయ్య మృతి చెందారు. తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరి కొంత కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే మునయ్య, వేసిన పంట నష్టం రావడంతో అప్పులు ఎలా తీర్చాలని బెంగతో ఆత్మహత్యకు పాల్పడాడు సమాచారం అందుకున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మునయ్య నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా వారి కుటుంబాని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

11:51 AM (IST)  •  02 Apr 2023

AP Capital News: శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చేరిన అమరావతి రథం

ఒకే రాష్ట్రం రాజధాని అని గళమెత్తుతూ అమరావతి రథం శనివారం మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చేరుకుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 'రైతులు చేపట్టిన 'మహా పాదయాత్ర 2.0' గతేడాది నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ యాత్రలో రైతుల వెంట వచ్చిన రథాన్ని కూడా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిలిపివేశారు. ఆగిన రథాన్ని అరసవల్లి తీసుకువెళ్లి యాత్రకు ముగింపు పలకాలని రైతులు నిర్ణయించారు. ఆ మేరకు శుక్రవారం రామచంద్రపురంలో బయలుదేరిన రథం అరసవల్లి చేరుకుంది. అమరావతి నుంచి రైతులు కూడా వచ్చి నేడు అరసవల్లి సూర్యనారాయణస్వామి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం జిల్లాకు చేరుకున్నవారికి  ఓ కల్యాణ మండపంలో బస ఏర్పాటు చేశారు. ఆదివారం రథాన్ని ఆదిత్యాలయ సమీపంలో భక్తుల సందర్శనార్థం ఉంచనున్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | సంచలన ఛేజింగ్ తో పిచ్చెక్కించిన పంజాబ్ | IPL 2024| ABP DesamBoy Rescued 50 Members in Fire Accident | అగ్నిప్రమాదం నుంచి 50 మందిని కాపాడిన బాలుడు | ABP DesamFire Accident in Alwin Pharmacy Company Rangareddy | రంగారెడ్డిలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం | ABP DesamJamie Lever Interview | Allari Naresh | Aa Okkati Adakku |ఈ వీడియో చూస్తే నవ్వాగదు..

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Cold Water in Summer: వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
UPSC Exam Calendar: యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ-2025 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Embed widget