అన్వేషించండి

Andhra Pardesh: అనుమతి లేని ఆందోళనల్లో పాల్గొంటే క్రిమినల్ కేసులు, ఏపీ పోలీసుల హెచ్చరిక

Andhra Pardesh: చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆందోళనలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Andhra Pardesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. బాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలు చేపడుతూ నిరసన తెలియచేస్తున్నారు. ఐ యామ్ విత్ బాబు పేరుతో  ఎక్కడికక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమాలు చేపడుతున్నారు. పలుచోట్ల తెలుగు తమ్ముళ్ల ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. దీంతో పోలీసులు ఆందోళనలను అడ్డుకుంటున్నారు.

టీడీపీ శ్రేణుల నిరసనలకు సంబంధించి తాజాగా ఏపీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ముందుగా అనుమతి తీసుకుని, ఆ తర్వాతే నిరసనలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే వారికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పర్మిషన్ లేకుండా నిరసన కార్యక్రమాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు అనుమతి లేని నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేవారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అనుమతి లేని ఆందోళన కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనవద్దని సూచిస్తున్నామన్నారు. క్రిమినల్ కేసులు నమోదైతే యువతకు ఇబ్బందులు ఉంటాయని, భవిష్యత్తులో ఉద్యోగాలు రావని హెచ్చరించారు.

నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కేసు నమోదైతే విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కూడా రాదని సూచించారు. అనుమతి లేకుండా ఆందోళనల్లో పాల్గొనేవారికి నోటీసులు జారీ చేస్తామని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. యువత ఈ విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. అలాగే సోషల్ మీడియాలో అనధికార మెస్సేజ్‌లు వ్యాప్తి చెందుతుండటంపై పోలీసులు సీరియస్ అయ్యారు. తప్పుడు వార్తలను ఎవరూ దుష్ప్రచారం చేయవద్దని సూచించారు.

జనసేన నేతలు కూడా మద్దతు

టీడీపీ చేస్తున్న నిరసనలకు జనసేన నేతలు కూడా మద్దతు ఇస్తున్నారు. టీడీపీ ఆందోళనల్లో జనసేన నేతలు పాల్గోని మద్దతు ప్రకటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని, వాటిల్లో పాల్గొనాలని జనసైనికులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఆ పార్టీకి అండగా ఉండాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో పవన్ ములాఖాత్ అయ్యారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని, జగన్‌ను ఓడించడానికి ఆ పార్టీతో కలిసి వెళ్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా శనివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో కూడా టీడీపీతో పొత్తుపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ నేతలను కించపర్చేలా మాట్లాడవద్దని సూచనలు చేశారు. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాదని, అందరూ ఒక్కటేనని అన్నారు. టీడీపీ 40 ఏళ్ల నుంచి ఉన్న పార్టీ అని, ఆ పార్టీకి ప్రజల్లో బలం ఉందన్నారు. టీడీపీని ఎవరూ తక్కువ అంచనా వేసి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టవద్దని జనసైనికులకు పవన్ సూచించారు. పవన్ ప్రకటనతో టీడీపీ నేతల ఆందోళనల్లో జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. అంతేాకాకుండా టీడీపీతో సమన్వయం చేసుకునేందుకు నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఒక కమిటీని కూడా పవన్ ఏర్పాటు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Embed widget