అన్వేషించండి

Agrigold Protest : అగ్రిగోల్డ్ ఆందోళనపై ఉక్కుపాదం - సీఎం జగన్ మోసం చేశారని బాధితుల ఆగ్రహం !

అగ్రిగోల్డ్ ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానన్న జగన్ మోసం చేశారని బాధితులు ఆరోపించారు.


Agrigold Protest  : అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం  ఇచ్చిన ‘చలో విజయవాడ’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడకిక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి  ఏపీ నలుమూలల నుంచి విజయవాడకు వస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల  సంఘం నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రైళ్లలో వస్తున్న వారిని స్టేషన్‌లోనే అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.  అగ్రిగోల్డ్‌ కస్టమర్లు, ఏజెంట్ల సంఘం నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, కోరాడ రాంబాబు, షరీఫ్‌ తదితరులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని జింఖానా మైదానంలో శంఖారావం సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఇస్తామని జగన్ హామీ

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే బడ్జెట్‌లో రూ. 1150 కోట్లు ఇస్తామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలనూ పెట్టారు.  ప్రభుత్వం ప్రకటించిన మొదటి బడ్జెట్‌లో రూ. 1150 కోట్లు కేటాయించారు కానీ రూపాయి కూడా విడుదల చేయలేదు. తర్వాత  బడ్దెట్‌లో రూ. 200 కోట్లు కేటాయించారు . కానీ ఖర్చు చేయలేదు. ఆ తర్వాత అగ్రిగోల్డ్ బాధితులకు ఎలాంటి కేటాయింపులు లేవు. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునే చర్యలను ప్రభుత్వం నిలిపివేసిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మళ్లీ ఎన్నికలు వస్తున్నా సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. 

దాదాపుగా 20 లక్షల మంది బాధితులు 

అగ్రిగోల్డ్‌లో రాష్ట్రానికి చెందిన 19.52 లక్షల మంది డిపాజిట్‌లు, పెట్టుబడులు పెట్టగా, దేశంలోని ఏడు రాష్ట్రాలలో 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బాధితులకు న్యాయం చేస్తామని గత టిడిపి ప్రభుత్వం, ప్రస్తుత వైసిపి సర్కార్‌ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అయినప్పటికీ బాధితులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. బాధితులకు రూ.3,964 కోట్లను చెల్లించాలని  సిఐడి  తేల్చింది. అగ్రిగోల్డ్‌ సంస్థ 2015 జనవరిలో బోర్డు తిప్పేయడంతో డిపాజిట్‌దారులు, ఏజెంట్లు గుండెపోటుతో ఇప్పటి వరకు 300 మందిపైనే మృతి చెందారు. వారిలో 144 మందికి గత ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించింది. తాము వస్తే రూ. పది లక్షలు చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ  నేటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. 

ఇప్పటి వరకు రూ. 964 కోట్లు చెప్పింపు                           

మొత్తం బాధితులలో రూ.20 వేలలోపు డిపాజిట్‌లున్న వారు 10 లక్షల మంది ఉన్నారని అంచనా వేయగా, వారిలో ఆరు లక్షల మందికి ప్రభుత్వం రూ.964 కోట్లను చెల్లించింది. మిగిలిన వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమకాలేదు. వీరిలో ఒక్కొక్కరికి రెండు మూడు బాండ్‌లు ఉన్నప్పటికీ ఒక్క బాండ్‌కే చెల్లింపు చేశారు. రూ.20 వేలపైబడి డిపాజిట్‌ చేసిన బాధితులు 13.52 లక్షల మంది ఉన్నారు.  అగ్రిగోల్డ్‌ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.35 వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అప్పటి హోంమంత్రి   హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. ఇప్పటికే వాటన్నింటినీ కోర్టుకు అటాచ్‌ చేశారు. ఆస్తులను వేలం వేసి బాధితులందరికీ డిపాజిట్‌లను చెల్లిస్తామన్న గత, ప్రస్తుత ప్రభుత్వాల హామీలు నెరవేరడంలేదు
 

టాప్ హెడ్ లైన్స్

Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
Breaking News: కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!
కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Embed widget