అన్వేషించండి

AP Minsiters: హైకోర్టు తీర్పు చాలా బాధాకరం... రాజ్యాంగబద్ధంగానే ఇళ్ల పథకం అమలు.... తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని మంత్రులు బొత్స, సుచరిత స్పష్టం

పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని మంత్రులు బొత్స, సుచరిత తెలిపారు. రాజ్యాంగబద్ధంగానే ఇళ్ల పథకాన్ని చేపట్టామన్నారు.

పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరమని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నారు. విజయనగరంలో మాట్లాడిన ఆయన ఇళ్ల పథకంపై ప్రభుత్వ వివరణ తీసుకోకుండానే తీర్పు ఇవ్వడం బాధాకరమన్నారు. నవరత్నాలు కింద పేదలందరికీ ఇళ్ల పథకంపై శుక్రవారం ఏపీ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. సెంటు, సెంటున్నర స్థలంపై ఇళ్ల నిర్మాణం సరికాదని, ఇళ్ల నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై మంత్రులు బొత్స, సుచరిత స్పందించారు. ప్రతి మహిళ ఇంటి యజమానిగా ఉండాలనే ఇళ్ల పథకం తీసుకొచ్చామని మంత్రి బొత్స అన్నారు. కోర్టు తీర్పులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదన్న ఆయన... కేంద్ర విధివిధానాలతోనే ఇళ్ల పథకం చేపట్టామని తెలిపారు. 

Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..

రాజ్యాంగ బద్ధంగానే సంక్షేమ కార్యక్రమాలు: బొత్స

పేదలందరికీ ఇళ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యాంగబద్ధంగానే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని బొత్స అన్నారు. ఇళ్ల నిర్మాణానికి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై కమిటీతో అధ్యయనం చేయించాలని హైకోర్టు సూచించింది. అప్పటి వరకూ ఇళ్ల నిర్మాణాలను చేపట్టవద్దని ధర్మాసనం తీర్పు వెలువరించింది. 

Also Read: 12 శాతం వడ్డీ - 4 వారాల గడువు.. బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశం !

సెంటు భూమిలో రెండు గదులు నిర్మించుకోవచ్చు: సుచరిత

పేదల ఇళ్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తుందని హోంమంత్రి సుచరిత తెలిపారు. గత ప్రభుత్వాలు పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారని ఆమె అన్నారు. ఇరుకు గదుల్లో ఉంటూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలపై వంకలు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు జిల్లా కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో ఆసరా చెక్కులను సుచరిత పంపిణీ చేశారు. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే ప్రతిపక్షాలు న్యాయస్థానాలను ఆశ్రయించి అడ్డుకుంటున్నాయన్నారు.  ఒకే గదిలో ఉంటూ ఎంతోమంది పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెంటు భూమిలో రెండు గదులు నిర్మించుకోవచ్చని మంత్రి అన్నారు. ప్రభుత్వ భూమి లేని ప్రాంతంలోనూ ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి పేదలకు ఇస్తుందన్నారు.

Also Read: పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు కీలక తీర్పు... నిర్మాణాలు ఆపాలని కీలక ఆదేశాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Rohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP DesamPBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షోPunjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Hardik Pandya Fitness: పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
My Dear Donga Movie Review - మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
Inter Exam Fee: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
Share Market Opening Today: బాంబులు అక్కడ, పతనం ఇక్కడ - స్టాక్‌ మార్కెట్‌లో హై టెన్షన్‌
బాంబులు అక్కడ, పతనం ఇక్కడ - స్టాక్‌ మార్కెట్‌లో హై టెన్షన్‌
Embed widget