అన్వేషించండి

Perni Nani: ప్రభుత్వాన్ని విమర్శిస్తే హెచ్ఆర్ఏ పెరుగుతుందా?... ఉద్యోగుల సమ్మె విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదు... మంత్రి పేర్ని నాని కామెంట్స్

ఉద్యోగులతో చర్చించేందుకు కమిటీ నియామకం తన దృష్టికి రాలేదని మంత్రి పేర్ని నాని అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న ఉపాధ్యాయులు రేపు పిల్లలకు పాఠాలలే చెబుతారని ఆయన ప్రశ్నించారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన ప్రకటించారు.

ఉద్యోగుల ఆందోళనలు, సహాయ నిరాకరణ అంశం కేబినెట్ దృష్టికి రాలేదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇవాళ జరిగిన కేబినెట్‌ సమావేశం నిర్ణయాలను ఆయన మీడియాకు వెళ్లడించారు. అయితే ఈ సమావేశంలో ఉద్యోగుల సమ్మె స్పందిస్తూ... ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించేందుకు మంత్రులు కమిటీ ఏర్పాటు చేసిన విషయం తన దృష్టి రాలేదన్నారు. ఉద్యోగులు రోడెక్కకూడదనే ప్రభుత్వం భావిస్తుందన్నారు. అయితే బాధలో ఉన్న ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ వేసి ఉండొచ్చని మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే హెచ్ఆర్‌ఏ పెరుగుతుందా అని మంత్రి ప్రశ్నించారు. న్యాయంగా పోరాటం చేస్తేనే ఏదైనా సాధించగలుగుతామన్నారు. సీఎంను తిడుతున్న ఉపాధ్యాయులు రేపు పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?

కేబినెట్ నిర్ణయాలు 

కేబినెట్ భేటీలో కరోనా నియంత్రణపై  చర్చించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనా మరణాలు తగ్గేలా చూడాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో దేశంలోనే ఏపీ మెరుగైన స్థితిలో ఉందని మంత్రి పేర్కొన్నారు. అగ్రవర్ణ మహిళలకు అండగా నిలిచేందుకు 45 నుంచి 60 ఏళ్ల వారికి ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈబీసీ నేస్తం కింద ఇచ్చే నిధులు రూ.580 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈబీసీ నేస్తం ప్రారంభించనున్నట్లు ప్రకంచింది. రాష్ట్రంలో 16 వైద్య కళాశాల నిర్మాణానికి రూ.7,880 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతానికి ఉన్న 11 వైద్య కళాశాలల అభివృద్ధికి రూ. 3,820 కోట్లు ఖర్చు చేయాలని కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

Also Read: ఏపీ సర్కార్‌కు మరో ఝలక్.. ఇక ఆ ఉద్యోగులు కూడా రంగంలోకి.. ఈ నెల జీతాలు రానట్లే..!

కిదాంబి అకాడమీకి భూ కేటాయింపు

ఉద్యోగుల పదవీ విరణమ వయసు పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. అలాగే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల్లో ఉద్యోగులకు 10 శాతం, పింఛన్‌దారులకు 5 శాతం రిజర్వేషన్‌కు కల్పించాలని నిర్ణయించింది. కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్‌ను మరొకరికి అప్పగించాలనే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ నిర్వహణ ఖర్చు తగ్గించుకొనేందుకు 28 ఏళ్లపాటు అప్పగించాలని నిర్ణయించింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో మార్పులు చేయాలని కేబినెట్ భావించింది. రెండు వాయిదాల్లో ఓటీఎస్ సొమ్ము చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. అనకాపల్లిలో ప్రాంతీయ వ్యవసాయ సంస్థ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనా కోసం కాంట్రాక్ట్ నియామకాలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖను కేబినెట్ ఆదేశించింది. ఏపీఐఐసీ నిర్వహణలోని ఖాళీ భూములను వినియోగంలోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. తిరుపతిలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ అకాడమీ కోసం 5 ఎకరాల భూమి కేటాయించాలని నిర్ణయించింది. టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమించేందుకు దేవాదాయ చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. ఐసీడీఎస్‌లో బాలామృతం, పాల సరఫరాను అమూల్‌కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

Also Read: పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం... ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ... మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Attack on Deputy Speaker Raghurama: అకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామపై దాడి - ఆలయంలో పూజల వివాదమే కారణం
అకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామపై దాడి - ఆలయంలో పూజల వివాదమే కారణం
Andhra KGF: ఆంధ్రప్రదేశ్‌లో KGF - దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని జొన్నగిరి - తవ్వకాలకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లో KGF - దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని జొన్నగిరి - తవ్వకాలకు సిద్ధం

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
Tunguska Missile System: భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Embed widget