అన్వేషించండి

Andhra Pradesh: భ‌వ‌న నిర్మాణాల‌కు సింగిల్ విండో ద్వారా త్వరగా అనుమ‌తులు - మంత్రి నారాయ‌ణ నిర్ణయం

Andhra Pradesh News | ఏపీలో భవనాల నిర్మాణం కోసం సింగిల్ విండో ఏర్పాటు చేసి త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.

Andhra Pradesh Minister Narayana | అమ‌రావ‌తి: భ‌వ‌న నిర్మాణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి త్వ‌రిత‌గ‌తిన అన్ని అనుమ‌తులు మంజూరయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖల మంత్రి పొంగూరు నారాయ‌ణ అధికారుల‌ను ఆదేశించారు. భ‌వ‌నాల నిర్మాణాల కోసం అనుమ‌తులిచ్చే శాఖ‌ల అధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు. 

ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయా శాఖ‌ల వారీగా అనుమ‌తులు జారీ చేస్తున్న విధానాన్ని, పర్మిషన్ కోసం తీసుకుంటున్న గ‌డువు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయ‌ణ‌ (AP Minister Narayana). అన్ని శాఖ‌ల‌ను ఆన్ లైన్ విధానంలో అనుసంధానం చేసేలా అవ‌స‌ర‌మైన సాంకేతిక ప‌రిజ్జానాన్ని అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. భ‌వ‌న నిర్మాణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఆయా శాఖ‌ల‌కు వేర్వేరుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి వ‌స్తుంది. దీని వ‌ల్ల ఒక్కో శాఖ నుంచి అనుమ‌తి రావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుందని, ఈ జాప్యాన్ని త‌గ్గించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు.
ఆన్ లైన్ అనుమతులు డీపీఎంఎస్ వెబ్ సైట్‌కు లింక్
భ‌వ‌న నిర్మాణాల‌ కోసం అగ్నిమాప‌క శాఖ అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీని కోసం ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌ల‌కు ఇస్తున్న ఆన్ లైన్ అనుమ‌తుల అప్లికేష‌న్ ను DPMS వెబ్ సైట్ కు అనుసంధానం చేస్తే స‌రిపోతుంద‌ని మంత్రి నారాయణ సూచించారు. ఇక గ‌నుల శాఖ కూడా పెద్ద‌పెద్ద భ‌వ‌నాల విష‌యంలో అనుమ‌తులు జారీ చేయాల్సి ఉంటుంది. భ‌వ‌న నిర్మాణాల కోసం భారీ గుంత‌ల తవ్వ‌కాల కోసం గ‌నుల శాఖ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. దీనికి సంబంధించి సీన‌రేజి ఫీజు చెల్లించాలి. ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తుల విష‌యంలో ప్ర‌స్తుతం ఇదే ర‌క‌మైన విధానాన్ని పాటిస్తున్నారు. ఈ విధానాన్నే భ‌వ‌న నిర్మాణాల అనుమ‌తుల‌కు అనుసంధించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి సూచించారు.

మ‌రోవైపు భ‌వ‌న నిర్మాణం స‌మ‌యంలోనే ఎంత‌మేర ఇసుక అవ‌స‌రం అవుతుంద‌నే వివరాలు ఇవ్వాల‌ని గ‌నుల శాఖ అధికారులు కోరారు. దీనికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జారోగ్య శాఖ చీఫ్ ఇంజినీర్ గోపాల కృష్ణా రెడ్డికి మంత్రి నారాయ‌ణ సూచించారు. ల్యాండ్ కన్వ‌ర్ష‌న్ కు సంబంధించి కూడా రెవెన్యూ అధికారులు ఇచ్చే అనుమ‌తులు సుల‌భ‌త‌రం చేయాల‌ని నిర్ణ‌యించారు. దీంట్లో భాగంగా ఇప్ప‌టికే ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు ఇస్తున్న విధానాన్ని ఏకీకృతం చేయాల‌ని నిర్న‌యించారు. ఆయా శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో సింగిల్ విండో ద్వారా అనుమ‌తులు జారీ చేసేలా వీలైనంత త్వ‌ర‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి నారాయ‌ణ అధికారుల‌కు సూచించారు.

టీడీఆర్ బాండ్ల‌ జారీలో అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట కోసం రిజిస్ట్రేష‌న్ శాఖ‌తో స‌మ‌న్వ‌యం
గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో వంద‌ల కోట్ల అక్ర‌మాలు చోటుచేసుకున్న టీడీఆర్ బాండ్ల జారీపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టినట్లు మంత్రి నారాయణ తెలిపారు. భ‌విష్య‌త్తులో బాండ్ల జారీలో అక్ర‌మాలు జ‌ర‌గ‌కుండా ఉండేలా ప‌గ‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటుందన్నారు. దీని కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్ శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే ఈ అంశంపై ఓసారి రెవెన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ తో చ‌ర్చించిన మంత్రి నారాయణ‌.. మంగళవారం జ‌రిగిన స‌మావేశంలో ఈ అంశంపై అధికారుల‌తో సుదీర్ఘంగా చ‌ర్చించారు. వాస్త‌వంగా భూమి కోల్పోతున్న స‌ర్వే నెంబ‌ర్ కు బ‌దులు దొంగ స‌ర్వే నెంబ‌ర్లు వేసి బాండ్ల కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్నార‌నే విష‌యం సమావేశంలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. 

రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో ఇంటి నెంబ‌ర్ ల డేటా లేక‌పోవ‌డంతో స‌ర్వే నెంబ‌ర్లు, అక్క‌డ ప్రాంతం ఆధారంగా భూముల ధ‌ర నిర్ధారిస్తున్నారు. ఇలా నిర్ధారించే స‌మయంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని మంత్రి నారాయ‌ణ అధికారుల‌కు సూచించారు. బాండ్ల జారీ స‌మ‌యంలో భూమికి సంబంధించిన ఈసీలు ఆన్ లైన్ లో ఆటోమేటిక్ గా వ‌చ్చేలా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేయాల‌ని మంత్రి నారాయణ సూచించారు. ఓన‌ర్ షిప్ డాక్యుమెంట్ లు కూడా ఆన్ లైన్ లో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్ శాఖ ఐజీ శేష‌గిరి బాబు చెప్పారు. వారంరోజుల్లో ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక శాఖ‌కు టీడీఆర్ బాండ్ల జారీకి అవ‌స‌ర‌మైన అన్ని అంశాల‌తో స‌మీకృతం చేసేలా సాంకేతిక ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.
Also Read: నడికుడి మీదుగా వెళ్లే ట్రైన్స్‌లో వరుస చోరీలు - 24 గంటల వ్యవధిలోనే మూడు రైళ్లలో దొంగతనాలు

సీడీఎంఏ కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశానికి పుర‌పాల‌క శాఖ క‌మిష‌న‌ర్ మ‌రియు డైరెక్ట‌ర్ హ‌రినారాయ‌ణ‌న్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ ల శాఖ ఐజీ శేష‌గిరి బాబుతో పాటు ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక విభాగం, రెవెన్యూ, గ‌నులు, అగ్నిమాప‌క శాఖల అధికారులు పాల్గొన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget