By: ABP Desam | Updated at : 21 Jan 2023 12:23 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీఎం జగన్
AP BC Corporations : బీసీ కార్పొరేషన్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 55 బీసీ కార్పొరేషన్లను యథావిధిగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తున్నామని తాజా అస్త్రం ప్రయోగించింది ప్రభుత్వం. గత ఎన్నికల్లో వైసీపీకి బీసీలు అండగా నిలిచారు. దీంతో అధికారంలోకి రాగానే బీసీ కులాలకు ప్రాధాన్యత ఇస్తూ 55 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కార్పొరేషన్లను కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కార్పొరేషన్ల ద్వారా బీసీలకు పలు పథకాలు అందించేందుకు ఏటా వేల కోట్ల నిధులు కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తుంది.
బీసీ కార్పొరేషన్లకు గుడ్ న్యూస్
గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన వైసీపీ... వచ్చీ రాగానే రాష్ట్రంలో జనాభా పరంగా అధికంగా ఉన్న బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ 55 బీసీ కార్పోరేషన్లను ఏర్పాటు చేసింది. వీటిలో ప్రతీ కార్పొరేషన్ కు ఛైర్మన్ తో పాటు డైరెక్టర్లను నియమించింది. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడిన వాళ్లు, భవిష్యత్తులో ఉపయోగపడతారు అనుకునే వాళ్లకు పదవులు దక్కాయి. ఈ కార్పొరేషన్లు రెండేళ్ల పదవీకాలంతో పాటు జీతభత్యాల్ని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా బీసీ కార్పొరేషన్లకు వైసీపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో నియమించిన 55 బీసీ కార్పోరేషన్ల పదవీకాలం 2022 డిసెంబర్ 16తో ముగిసింది. దీంతో ఆయా కార్పొరేషన్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి జీవో విడుదల చేసింది. 55 కార్పొరేషన్లలోని ప్రతీ కార్పొరేషన్ కు ప్రత్యేకంగా ఒక్కో జీవోను విడుదల చేసింది. ఈ జీవోలో కార్పొరేషన్ ఏర్పాటు, పదవీకాలంతో పాటు ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలం పెంపును తెలియజేసింది. దీంతో ఆయా కార్పొరేషన్ల పదవీకాలం పూర్తయిన కూడా కొనసాగబోతున్నాయని స్పష్టం చేసింది.
తదుపరి ఉత్తర్వుల వరకూ పదవీకాలం పొడిగింపు
ఏపీలోని 55 బీసీ కార్పోరేషన్ల పదవీకాలాన్ని తదుపరి ఉత్తర్వులు విడుదల చేసే వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు మళ్లీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే వరకూ పదవుల్లో కొనసాగనున్నారు. వచ్చే ఎన్నికలు వరకూ బీసీ కార్పొరేషన్లు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికలతో సంబంధం లేకుండా వచ్చే ప్రభుత్వంలోనూ కార్పొరేషన్ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తాజా ఉత్తర్వులతో మరోసారి గుర్తుచేసినట్లయింది.
అధికారాలు లేవని ప్రతిపక్షాలు విమర్శలు
ఈ కార్పొరేషన్లతో బీసీలు తల ఎత్తుకునేలా చేశామని ప్రభుత్వం చెబుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అసలు ఏమీ చేయలేదని దుమ్మెత్తి పోస్తున్నాయి. పథకాలతో మాయ చేస్తున్నారనే తప్ప శాశ్వతంగా బీసీలు పేదరికం నుంచి బయట పడేందుకు ఎలాంటి కార్యక్రమాలు లేవంటున్నారు. ఎలాంటి అధికారాలు లేని బీసీ కార్పొరేషన్లు దేని కోసమని ప్రశ్నిస్తున్నారు. ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లు వైసీపీ ప్రభుత్వం నామ మాత్రంగా మార్చేసిందని ఆరోపిస్తున్నాయి. బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ఘనంగా ప్రకటిండమే తప్ప.. గత ప్రభుత్వాలతో పోలిస్తే స్వయం ఉపాధి కింద చాలా తక్కువ రుణాలు ఇచ్చిందంటున్నారు.
Minister Dharmana Prasadarao : చంద్రబాబు కన్నా ముందే వాలంటీర్లు తుపాకీ పేల్చాలి, ఎవరికి ఓటు వెయ్యాలో చెప్పే హక్కు మీకుంది - మంత్రి ధర్మాన
Jagananna Videshi Vidya Deevena : టీడీపీ నేత కుమార్తెకు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఆర్థికసాయం
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Guntur Hospital: ఆ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఎలుకలపై యుద్ధం - కోట్లు ఖర్చయ్యాయి కానీ ఇప్పటికీ ...
AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !
Top Mileage Bikes: మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనాలనుకుంటున్నారా? - బడ్జెట్లో బెస్ట్ లుక్, బెస్ట్ మైలేజ్ వీటిలోనే!
Twitter Gold: గోల్డ్ టిక్కు నెలకు రూ.82 వేలు - మరో కొత్త స్కీమ్తో రానున్న మస్క్!
Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!