అన్వేషించండి

Sajjala : గురువారం నుంచి ఏపీలో " వై ఏపీ నీడ్స్‌ జగన్‌ " - అభివృద్ధిని ప్రజలకు చూపిస్తామన్న సజ్జల

వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం గురువారం నుంచి ప్రారంభించనుంది. అభివృద్ధిని ప్రజలకు చూపిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.


Sajjala : గురువారం నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) ప్రకటించారు.  సీఎం జగన్‌ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి ఉన్నాయన్నారు.  సంక్షేమం ద్వారా అభివృద్ధి, సంక్షేమమే అభివృద్ధి అని ప్రభుత్వం భావిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  సచివాలయం ద్వారా జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు పెడుతున్నాం. ఇది కదా అభివృద్ధి అనే విధంగా ప్రజలకు చూపిస్తామని ప్రకటించారు. చంద్రబాబు ( Chandrababu ) పాలనలో తలసరి ఆదాయంలో 17వ స్థానంలో ఉంటే ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నామని సజ్జల పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. 2019లో ఏపీ ( Andhra  ) జీఎస్‌డీపీ 22వ స్థానం కాగా.. 2021-22లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. విద్య, వైద్యానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని చెప్పారు. 

కుట్ర పూరితంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు  ప్రయత్నం                    

కుట్రపూరితంగా మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ప్రతి స్కీమ్‌లోనూ స్కామ్‌ ఉందన్నారు.  ప్రతి స్కీమ్‌లోనూ వచ్చే లాభంపైనే చంద్రబాబు ఫోకస్‌ చేశారన్నారు.  అయితే కులమతాలకు అతీతంగా పారదర్శక పాలన సీఎం జగన్‌ అందిస్తున్నారన్నారు.  వరలో డోర్‌టు డోర్‌ క్యాంపెయిన్‌ మొదలు పెడతామని స్పష్టం చేశారు.   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 4.93 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  

కోవిడ్ సమయంలో  రోల్ మోడల్ గా నిలిచిన ఏపీ                                 

కోవిడ్‌ సమయంలో ఏపీ రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. మహమ్మారి అవతరించిన సమయంలోనూ రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉన్నామనే భావన పొందారని పేర్కొన్నారు. అభివృద్ధి పరంగా మంచి ప్రగతిని సాధించామని తెలిపారు. రూ. 16,500 కోట్లతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామని సజ్జల చెప్పారు. వ్యవసాయంలో గత హయాంలో 27వస్థానం ఉంటే.. అప్పట్లో వృద్ధి రేటు 6.5శాతం ఉండేందని ప్రస్తావించారు. ప్రస్తుతం వ్యవసాయంలో ఏపీ 6వ స్థానంలో ఉందని, వృద్ధిరేటు 8శాతం సాధించామని తెలిపారు. తలసరి ఆదాయంలో ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నామని, ఈ మ్యానిఫెస్టోనే వైస్సార్‌సీపీ ప్రభుత్వానికి గీటురాయని పేర్కొన్నారు. 

'వై ఏపీ నీడ్స్ జగన్' పార్టీలకు అతీతమైన కార్యక్రమం               

'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరుగుతోందని... వైసిపి పాలనలో జరిగిన అభివృద్ది, సంక్షేమం గురించి ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసని సజ్జల అన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనవచ్చని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులను అంకెలతో సహా  చెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. ఎక్కడికక్కడ స్థానిక నాయకులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని సజ్జల వెల్లడించారు. 

 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget