అన్వేషించండి

Andhra Pradesh: శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్

శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ భేటీలలో సీఎం చంద్రబాబు సూచించగా కేవలం ఇద్దరు ముగ్గురు మంత్రులే రిపోర్ట్ ఇవ్వడంతో ఈ నిర్నయం తీసుకున్నారు.

AP Ministers Progress Report | అమరావతి: ఏపీలో గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మంత్రుల పనితీరుపై ఫోకస్ చేసింది. గత ఏడు నెలల్లో మంత్రుల పనితీరుపై నివేదిక పంపాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. గత ఏడాది జులై నుంచి డిసెంబరు వరకు మంత్రుల పనితీరుపై నివేదికలు పంపాలని ఆదేశాలిచ్చారు. కూటమి ప్రభుత్వంలో మంత్రుల అధికారిక కార్యక్రమాలతో పాటు, వారికి కేటాయించిన శాఖాపరంగా అమల్లోకి తెచ్చిన సంస్కరణలపై రిపోర్ట్ చేయనున్నారు. మంత్రులు తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుతో పాటు పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు లాంటి ముఖ్య సమాచారాన్ని ఆరు నమూనాల ద్వారా ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం ఆదేశాలతో పలువురు మంత్రుల్లో టెన్షన్ మొదలైంది.

ఒక్కో శాఖపై ఒక్కో నివేదిక

 ఒకే మంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్లు విడివిడిగా ఒక్కో శాఖలో మంత్రి నిర్ణయాలు, వారి పనితీరుపై సమాచారం ఇవ్వాలన్నారు. ఈ నివేదికల ఆధారంగా కూటమి ప్రభుత్వంలో ఏపీ మంత్రుల పనితీరుకు ప్రభుత్వం రేటింగ్ ఇవ్వనుంది. వీటితో పాటు గత రెండు క్యాబినెట్ ల లోను మంత్రులు పనితీరు నివేదిక ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. ముగ్గురు మంత్రులు తప్ప మిగిలిన మంత్రులు తమ పనితీరు, శాఖలో మార్పులపై నివేదిక ఇవలేదని సమాచారం. సీఎం చంద్రబాబు సూచనతో పలువురు మంత్రులు స్వయంగా నివేదిక అందజేయని కారణంగా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఆయా శాఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజులకే భారీ వర్షాలతో విజయవాడలో వరదలు వచ్చాయి. కొన్ని ప్రాంతాలు నీట మునగగా మంత్రులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వరద బాధితులకు సాయం చేశారు. సినీ సెలబ్రిటీటలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు సైతం వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు విరాళం ఇచ్చారు. ప్రాణ నష్టం జరగడంతో ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేసింది. కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో పరిస్థితి చేజారిందని, సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టినట్లు మంత్రులు ఆ సమయంలో బదులిచ్చారు. 

తిరుపతి లడ్డూ వివాదం.. తొక్కిసలాట ఘటన
ఏపీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి లడ్డూ కల్తీపై దుమారం రేగింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు తిరుమలలో కల్తీ నెయ్యిని వైసీపీ కాలంలో వాడారని ఆరోపించారు. అయితే కల్తీ నెయ్యి గుర్తించి తిప్పి పంపించాం కానీ ఏనాడూ శ్రీవారి ప్రసాదాలలో వాడలేదని వైసీపీ నేతలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కూటమి నేతలు వైసీపీపై దుష్ప్రచారం చేశారని జగన్ సైతం ఘాటుగా స్పందించారు. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంటా టికెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందడం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కొంచెం ప్రతికూలత తేనుంది. తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నుంచి కాకుండా టీటీడీ నుంచి ఆర్థిక సాయం చేయడంపై వైసీపీ విమర్శలు గుప్పించింది.

Also Read: AP Republic Day 2025 Celebrations: విజయవాడలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, జాతీయ పతాకం ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget