అన్వేషించండి

Andhra Pradesh: శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్

శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ భేటీలలో సీఎం చంద్రబాబు సూచించగా కేవలం ఇద్దరు ముగ్గురు మంత్రులే రిపోర్ట్ ఇవ్వడంతో ఈ నిర్నయం తీసుకున్నారు.

AP Ministers Progress Report | అమరావతి: ఏపీలో గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మంత్రుల పనితీరుపై ఫోకస్ చేసింది. గత ఏడు నెలల్లో మంత్రుల పనితీరుపై నివేదిక పంపాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. గత ఏడాది జులై నుంచి డిసెంబరు వరకు మంత్రుల పనితీరుపై నివేదికలు పంపాలని ఆదేశాలిచ్చారు. కూటమి ప్రభుత్వంలో మంత్రుల అధికారిక కార్యక్రమాలతో పాటు, వారికి కేటాయించిన శాఖాపరంగా అమల్లోకి తెచ్చిన సంస్కరణలపై రిపోర్ట్ చేయనున్నారు. మంత్రులు తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుతో పాటు పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు లాంటి ముఖ్య సమాచారాన్ని ఆరు నమూనాల ద్వారా ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం ఆదేశాలతో పలువురు మంత్రుల్లో టెన్షన్ మొదలైంది.

ఒక్కో శాఖపై ఒక్కో నివేదిక

 ఒకే మంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్లు విడివిడిగా ఒక్కో శాఖలో మంత్రి నిర్ణయాలు, వారి పనితీరుపై సమాచారం ఇవ్వాలన్నారు. ఈ నివేదికల ఆధారంగా కూటమి ప్రభుత్వంలో ఏపీ మంత్రుల పనితీరుకు ప్రభుత్వం రేటింగ్ ఇవ్వనుంది. వీటితో పాటు గత రెండు క్యాబినెట్ ల లోను మంత్రులు పనితీరు నివేదిక ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. ముగ్గురు మంత్రులు తప్ప మిగిలిన మంత్రులు తమ పనితీరు, శాఖలో మార్పులపై నివేదిక ఇవలేదని సమాచారం. సీఎం చంద్రబాబు సూచనతో పలువురు మంత్రులు స్వయంగా నివేదిక అందజేయని కారణంగా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఆయా శాఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజులకే భారీ వర్షాలతో విజయవాడలో వరదలు వచ్చాయి. కొన్ని ప్రాంతాలు నీట మునగగా మంత్రులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వరద బాధితులకు సాయం చేశారు. సినీ సెలబ్రిటీటలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు సైతం వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు విరాళం ఇచ్చారు. ప్రాణ నష్టం జరగడంతో ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేసింది. కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో పరిస్థితి చేజారిందని, సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టినట్లు మంత్రులు ఆ సమయంలో బదులిచ్చారు. 

తిరుపతి లడ్డూ వివాదం.. తొక్కిసలాట ఘటన
ఏపీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి లడ్డూ కల్తీపై దుమారం రేగింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు తిరుమలలో కల్తీ నెయ్యిని వైసీపీ కాలంలో వాడారని ఆరోపించారు. అయితే కల్తీ నెయ్యి గుర్తించి తిప్పి పంపించాం కానీ ఏనాడూ శ్రీవారి ప్రసాదాలలో వాడలేదని వైసీపీ నేతలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కూటమి నేతలు వైసీపీపై దుష్ప్రచారం చేశారని జగన్ సైతం ఘాటుగా స్పందించారు. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంటా టికెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందడం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కొంచెం ప్రతికూలత తేనుంది. తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నుంచి కాకుండా టీటీడీ నుంచి ఆర్థిక సాయం చేయడంపై వైసీపీ విమర్శలు గుప్పించింది.

Also Read: AP Republic Day 2025 Celebrations: విజయవాడలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, జాతీయ పతాకం ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget