అన్వేషించండి

రైతులను ఆదుకోలేని సీఎం ఎందుకు, జగన్ రాజీనామా చేయడం బెటర్ - టీడీపీ నేత కన్నా

జగన్ తప్పుకుంటే... రైతులకు ఏమి చేస్తామో..చూపిస్తాం...టీడీపీ నేత ..కన్నా

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోలేకపోతే సీఎం జగన్ తన పదవి నుండి తప్పుకోవాలని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చేసి చూపిస్తామని అన్నారు.
రైతులను ఆదుకోవాలని కన్నా డిమాండ్..
రైతులు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు తనకు మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ ఉంటే చాలు అని జగన్ అనుకుంటున్నారని మాజీ మంత్రి , తెలుగుదేశం నేత కన్నా లక్ష్మినారాయణ ఫైర్ అయ్యారు. తనకు రావాల్సిన ఆదాయం వస్తుంది అన్న ధీమాలో జగన్ ఉన్నారని కన్నా వ్యాఖ్యానించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్నిఆదుకోవడం జగన్ కు చేతగాకపోతే, తక్షణమే సీఎం కుర్చీనుంచి దిగిపోవాలన్నారు. జగన్ తన పదవినుంచి తప్పుకుంటే, అన్నదాతలకు ఎలా న్యాయంచేయాలో టీడీపీ చేసి చూపిస్తుందని చెప్పారు. పంటల బీమా సొమ్ము సకాలంలో చెల్లించని జగన్ ప్రభుత్వ నిర్లక్షమే రైతుల కన్నీళ్లకు ప్రధానకారణమని కన్నా వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్ల పేరుతో మిల్లర్లు, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న రైతుల దోపిడీ జగన్మోహన్ రెడ్డికి కనిపించడంలేదా అని కన్నా ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో జరిగే అక్రమాలు అరికట్టి, రాష్ట్రంలోని ప్రతిధాన్యం గింజను ప్రభుత్వమే నేరుగా గిట్టుబాటుధరకు కొనాలని డిమాండ్ చేశారు.
మేనిఫెస్టో సంగతి ఏంటి...
తన పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన రూ.2వేలకోట్ల ప్రకృతి విపత్తుల సహాయనిధి, రూ.3వేలకోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందో జగన్ రైతులకు సమాధానంచెప్పాలని మాజీ మంత్రి ,తెలుగు దేశం నేత కన్నా లక్ష్మినారాయణ అన్నారు.అకాలవర్షాలకు సర్వం కోల్పోయిన రైతులు విలపిస్తుంటే, ముఖ్యమంత్రి నీరోచక్రవర్తిలా తనకే మీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాడని, ధాన్యం మొలకెత్తి, మిర్చి నీళ్లపాలై, ఇతరపంటలు పొలా ల్లోనే కుళ్లి మగ్గిపోతుంటే, మంత్రులు ప్రతిపక్ష నేతల్ని తిడుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. అధికార యంత్రాంగం రైతుల ముఖం కూడా చూడకుండా నిద్రపోతోందని కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
తెలుగుదేశమే ముందు...
రైతుల కష్టాలను తెలుసుకొని వారికి అండగా ఉండటంలో తెలుగుదేశం పార్టీ ముందుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు  గోదావరి జిల్లాల్లో వరి రైతుల వద్దకు వెళ్లి, వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారని చెప్పారు. కానీ రైతుల్ని ఆదుకోలేని ప్రభుత్వ డొల్లతనం, జగన్మోహన్ రెడ్డి చేతగానితనం అకాల వర్షాలతో మరోసారి బట్టబయలైందని కన్నా వ్యాఖ్యానించారు. చంద్రబాబు రైతులవద్దకు వెళ్లకుండా ఉంటే, అసలు ఈ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు కనీసం నోటి మాటగా కూడా రైతుల ప్రస్తావన చేసేవారు కాదన్నారు. ఏం చేసినా చేయకపోయినా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చాలు ఆదాయం అదే వస్తుంది అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నాడని కన్నా కామెంట్స్ చేశారు. 
తడిచిన ధాన్యంపై ఎందుకు నిర్లక్ష్యం...
 తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో రైతులను నిలువునా మోసగిస్తున్నారని కన్నా అన్నారు. 75కిలోల ధాన్యం బస్తాకు ఒకచోట 5కేజీలు, మరోచోట 12కేజీలు అదనంగా ధాన్యం ఇవ్వాలని మిల్లర్లు డిమాండ్ చేస్తు న్నారని, కొన్నిచోట్ల మిల్లర్లను అడ్డంపెట్టుకొని ప్రభుత్వమే బస్తాకు రూ.100నుంచి రూ.200 లు అనధికారికంగా వసూలుచేస్తోందని కన్నా తెలిపారు. లారీ ధాన్యానికి కొన్నిచోట్ల మిల్లర్లు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు రైతుల నుంచి దండుకుంటున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ఈ విధంగా రైతుల కష్టాన్ని అప్పనంగా దోచుకుంటున్నాకూడా ప్రభుత్వంలో చలనంలేదని, పాలకుల్లో స్పందన లేదన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా మారాయని ధ్వజమెత్తారు. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని ఈ వి ధంగా వివిధ పద్ధతుల్లో మిల్లరు, అధికార యంత్రాంగం దోచుకోవడం సరైంది కాదని హితవు పలికారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bangladesh Air Force: బంగ్లాదేశ్ ఫైటర్ జెట్స్‌ను పాకిస్తాన్ నుంచే ఎందుకు కొంటోంది? చైనా, అమెరికాలతో ప్రాబ్లం ఏంటి
బంగ్లాదేశ్ ఫైటర్ జెట్స్‌ను పాకిస్తాన్ నుంచే ఎందుకు కొంటోంది? చైనా, అమెరికాలతో ప్రాబ్లం ఏంటి
Virat Kohli Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
PM Vishwakarma Yojana: ప్రభుత్వ పథకంలో రుణ అవకాశం, 3 లక్షల రూపాయల వరకు సహాయం లభించవచ్చు.
ప్రభుత్వ పథకంలో రుణ అవకాశం, 3 లక్షల రూపాయల వరకు సహాయం లభించవచ్చు.
The Raja Saab Box Office Collection Day 2 : 'ది రాజా సాబ్' రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే? - ఫస్ట్ డేతో పోలిస్తే రెండో రోజు...
'ది రాజా సాబ్' రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే? - ఫస్ట్ డేతో పోలిస్తే రెండో రోజు...

వీడియోలు

MI vs DC WPL 2026 Highlights | ముంబై ఘన విజయం
Vaibhav Suryavanshi India vs Scotland U19 | వార్మప్ మ్యాచ్‌లో అదరొట్టిన వైభవ్!
India vs New Zealand 1st ODI Preview | నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే
Virat Kohli Records Ind vs NZ | కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు!
Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bangladesh Air Force: బంగ్లాదేశ్ ఫైటర్ జెట్స్‌ను పాకిస్తాన్ నుంచే ఎందుకు కొంటోంది? చైనా, అమెరికాలతో ప్రాబ్లం ఏంటి
బంగ్లాదేశ్ ఫైటర్ జెట్స్‌ను పాకిస్తాన్ నుంచే ఎందుకు కొంటోంది? చైనా, అమెరికాలతో ప్రాబ్లం ఏంటి
Virat Kohli Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
PM Vishwakarma Yojana: ప్రభుత్వ పథకంలో రుణ అవకాశం, 3 లక్షల రూపాయల వరకు సహాయం లభించవచ్చు.
ప్రభుత్వ పథకంలో రుణ అవకాశం, 3 లక్షల రూపాయల వరకు సహాయం లభించవచ్చు.
The Raja Saab Box Office Collection Day 2 : 'ది రాజా సాబ్' రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే? - ఫస్ట్ డేతో పోలిస్తే రెండో రోజు...
'ది రాజా సాబ్' రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే? - ఫస్ట్ డేతో పోలిస్తే రెండో రోజు...
2026లో మూడో ప్రపంచం యుద్ధం తప్పదన్న బాబా వాంగ! దాన్ని నిజం చేసేలా ఉన్న ట్రంప్?
2026లో మూడో ప్రపంచం యుద్ధం తప్పదన్న బాబా వాంగ! దాన్ని నిజం చేసేలా ఉన్న ట్రంప్?
Haimendorf Death Anniversary: ఆదివాసీల ఆత్మబంధువు హైమన్ డార్ఫ్ 39వ వర్ధంతి, వారికి దేవుడు ఎందుకయ్యాడు?
ఆదివాసీల ఆత్మబంధువు హైమన్ డార్ఫ్ 39వ వర్ధంతి, వారికి దేవుడు ఎందుకయ్యాడు?
తండ్రి - కొడుకు మధ్య విభేదాలున్నాయా? అయితే మకర సంక్రాంతి రోజు ఇవి పాటించండి, మీ బంధం దృఢంగా మారుతుంది!
తండ్రి - కొడుకు మధ్య విభేదాలున్నాయా? అయితే మకర సంక్రాంతి రోజు ఇవి పాటించండి, మీ బంధం దృఢంగా మారుతుంది!
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Embed widget