Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Nara Bhuvaneshwari | ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని రెండు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. నవంబర్ 4న ఆమె ఆ అవార్డులు అందుకోనున్నారు.

Chandrababu London Tour: లండన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు, తన సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ వెళ్లారు. లండన్ తెలుగు కుటుంబాలు, టీడీపీ శ్రేణులు చంద్రబాబు దంపతులకు ఘన స్వాగతం పలికాయి. లండన్లోని తెలుగు కుటుంబాలను సీఎం దంపతులు అప్యాయంగా పలకరించారు.
భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డులు
నారా భువనేశ్వరి నవంబర్ 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడీ నుంచి రెండు అవార్డులు అందుకోనున్నారు. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో అందుకోనున్నారు. ప్రజాసేవ, సామాజిక సేవలో నారా భువనేశ్వరి కృషికి గుర్తింపు లభించింది. ఎక్సలెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పీకాక్ అవార్డు వరించింది. గోల్డెన్ పీకాక్ అవార్డును హెరిటెజ్ ఫుడ్స్ సంస్థ వీసీఎండీ హోదాలో భువనేశ్వరి అందుకోనున్నారు. సతీమణి భువనేశ్వరి అవార్డు స్వీకరణ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.

లండన్ పర్యటనపై చంద్రబాబు..
వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న నాకు, నా సతీమణి భువనేశ్వరికి అక్కడి తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలకడం ఆనందం కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడీ నుంచి భువనేశ్వరి రెండు అవార్డులు అందుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ, సామాజిక ప్రభావంలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు, ఎక్సలెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో హెరిటెజ్ ఫుడ్స్ సంస్థ వీసీఎండీ హోదాలో గోల్డెన్ పీకాక్ అవార్డును భువనేశ్వరి అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నాను అని ఎక్స్ ఖాతాలో చంద్రబాబు పోస్ట్ చేశారు.






















