అన్వేషించండి

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

Andhra News: రాష్ట్ర విభజన కంటే ఐదేళ్లలో జగన్ చేసిన విధ్వంసమే ఎక్కువని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అన్నీ వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు.

CM Chandrababu Comments On AP Debts: ఏపీ మొత్తం అప్పు రూ.9,74,556 కోట్లని.. కాదని ఎవరైనా అంటే అసెంబ్లీకి రావాలని తేల్చుతామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. బడ్జెట్‌పై శుక్రవారం ఆయన అసెంబ్లీలో (AP Assembly) ప్రసంగించారు. రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. 'ప్రధాని మోదీ, పవన్, ప్రజలు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. దాన్ని నిలబెట్టుకునేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే.. జగన్ ఐదేళ్ల విధ్వంసం వల్ల జరిగిన నష్టమే ఎక్కువ. 2014లో లోటు కరెంట్ సమస్యను అనేక విధానాలతో మిగులు కరెంట్ పరిస్థితికి తెచ్చాం. రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. అమరావతి రైతులు ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చారు. 2019లోనూ విజయం సాధించి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది. ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్నే విధ్వంసం చేశారు. గత ప్రభుత్వం జీవోలను సైతం ఆన్‌లైన్‌లో ఉంచలేదు. భావి తరాలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడతాం.' అని పేర్కొన్నారు.

'ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు'

'గత ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదం సృష్టించింది. ప్రజలు నమ్మి ఓట్లేస్తే దుర్మార్గంగా ప్రవర్తించారు. సంపద సృష్టించే ఒక్క పని కూడా గత ప్రభుత్వం చేయలేదు. పెట్టుబడులు పెట్టేందుకు వస్తే తరిమేశారు. రూ.431 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారు. రూ.700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేశారు. సాక్షికి రూ.400 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. రూ.500 కోట్లు ఖర్చు చేసుంటే రోడ్లు బాగయ్యేవి. ఇప్పటివరకూ రూ.9,74,556 కోట్ల అప్పు తేలింది. గత ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టాం. ఇసుకను మేము ఉచితంగా ఇస్తే.. గత ప్రభుత్వం టన్ను రూ.475కి విక్రయించింది. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ పెట్టుబడులు రాలేదు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లాయి. నా దగ్గర డబ్బులు లేవు.. కానీ నూతన ఆలోచనలు ఉన్నాయి. వాటితోనే సంపద సృష్టించి పేదలకు పంచుదాం. ఏడాదికి రూ.33 వేల కోట్ల పింఛన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం. 64.50 లక్షల మందికి ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నాం.' అని సీఎం తెలిపారు.

'పేదలకు ఇల్లు కట్టిస్తాం'

పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇచ్చి ఇళ్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. డిసెంబరులో లక్ష ఇళ్లల్లో గృహ ప్రవేశాలు చేసేలా కార్యాచరణ చేస్తున్నామని చెప్పారు. 'నక్కపల్లి, కొప్పర్తి పారిశ్రామిక జోన్లకు రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రాష్ట్రం మొత్తం బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఓ మంచి బడ్జెట్ తీసుకురాగలిగాం. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగకుండా కృషి చేస్తున్నాం.' అని పేర్కొన్నారు.

Also Read: Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
AP Cabinet Decisions Ease: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
Banakacherla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Embed widget