అన్వేషించండి

CM Chandrababu: 'ఏపీ అంటే అమరావతి పోలవరం' - ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం చూశామని సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు

Andhrapradesh News: రాజధాని అమరావతి అంటే ఏపీ ప్రజలందరి చిరునామా అని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంస పాలన అంటే ఎలా ఉంటుందో గత ఐదేళ్లలో చూశామని వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

CM Chandrababu Speech On Amaravathi: ఏపీ అంటే అమరావతి, పోలవరం అని.. రాజధాని అంటే ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. గురువారం అమరావతి (Amaravathi) నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరూ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టామని చెప్పారు. పోలవరం పూర్తైతే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చాం. అందుకోసం విభజన చట్టం తోడ్పాటు తీసుకున్నాం. రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చిరునామా. ఆ తర్వాత ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంస పాలన చూశాం. రాజకీయాలకు పనికిరాని, అర్హత లేని వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుందో గత ఐదేళ్లలో ప్రత్యక్షంగా చూశాం. అందుకే జగన్ లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదని ప్రజలు తిప్పికొట్టారు. ఇటీవల ఎన్నికల్లో కూటమికి కనివినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీ హయాంలో అమరావతి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. 1631 రోజులు ఆందోళన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అపార నమ్మకంతో ఆ పోరాటాన్ని విరమించారు. రైతులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు.' అని చంద్రబాబు అన్నారు.

అమరావతిపై వైట్ పేపర్

అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన మట్టి అకక్డే ఉండిపోయిందని.. కనీసం 80 శాతం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఎన్నో పవిత్ర ప్రాంతాల నుంచి మట్టి, నీరు తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశామని.. ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడిందని అన్నారు. ఐదేళ్లలో అమరావతికి భూములిచ్చిన రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని అన్నారు.

'పోలవరం రాష్ట్రానికి వరం'

పోలవరం రాష్ట్రానికి వరమని.. కానీ వైసీపీ పాలనలో పోలవరం అది శాపంగా మారిందని చంద్రబాబు విమర్శించారు. 'పోలవరం పూర్తైతే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును గోదారిలో కలిపేసింది. కేంద్ర నిధులతో పోలవరాన్ని కట్టి, నధుల అనుసంధానం వంటి విధానాలు, ఇక్కడి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటే సాగునీటి రంగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పోలవరం సందర్శించాక చాలా బాధేస్తోంది. జగన్ పాలన ప్రజావేదిక కూల్చివేతతోనే ప్రారంభమైంది. వైసీపీ పాలనలో అమరావతిలోని నమూనాలను కొన్ని అల్లరిమూకలు ధ్వంసం చేశాయి. ఇక్కడి రైతులు వాటిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. పైపులు, రోడ్డు, మట్టిని దొంగతనం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎక్కడ కట్టిన బిల్డింగులు అక్కడే ఉన్నాయి. ఐకానిక్ కట్టడాలన్నీ అలానే నిలిచిపోయాయి. ఐఏఎస్, ఐపీఎస్ భవనాలు, అసెంబ్లీ బిల్డింగ్ ఉండాల్సిన చోట తుమ్మచెట్లు మొలిచాయి. కేంద్ర ప్రోత్సాహంతో రాష్ట్రంలోని 11 కేంద్రీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేశాం. అన్ని ప్రాంతాల అభివృద్ధికి స్పష్టమైన విధానం ప్రకటించాం.' అని వివరించారు.

'3 ముక్కలాట ఆడారు'

'వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడింది. అమరావతి బ్రాండ్ దెబ్బతీయాలని చూశారు. విషం చిమ్మి సింగపూర్ కన్సార్టియం తరిమేశారు. స్వచ్చందంగా రైతులు భూములిస్తే ఎన్నో అవమానాలకు గురి చేశారు. రాజధాని ఏదీ అని చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకునేలా రాజధాని నిర్మాణం ఉండాలి.  కర్నూలును ఆధునిక నగరంగా తయారుచేయాలి. రుషికొండను నాశనం చేశారు. ఎన్నో అప్పులు చేశారు. ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. గత సీఎంలు అభివృద్ధి చేశారు. జగన్‌లా ఎవరూ చేయలేదు.' అని సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం, జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 

Also Read: CM Chandrababu: సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన - ప్రజావేదిక కూల్చేసిన చోటు నుంచే ప్రారంభం, శంకుస్థాపన ప్రాంతంలో సాష్టాంగ నమస్కారం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Arava Sridhar: పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!
పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!
Devansh Birthday:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన చంద్రబాబు, TTD ఆలయాలను ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం!
Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
Trump Iran War:ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
Devansh Birthday:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
Gold Price Trends India: ఉగాది, గుడిపడ్వా వేళ పసిడి విపణికి కొత్త కళ! శుక్రవారం ఒక్కరోజే 22 వేల కోట్ల వ్యాపారం!
ఉగాది, గుడిపడ్వా వేళ పసిడి విపణికి కొత్త కళ! శుక్రవారం ఒక్కరోజే 22 వేల కోట్ల వ్యాపారం!
Peddi Teaser : పెద్ది టీజర్ రెడీ! - న్యూ టైటిల్ విత్ స్పెషల్ డే... రామ్ చరణ్ మాస్ వీడియో వచ్చేది ఎప్పుడంటే?
పెద్ది టీజర్ రెడీ! - న్యూ టైటిల్ విత్ స్పెషల్ డే... రామ్ చరణ్ మాస్ వీడియో వచ్చేది ఎప్పుడంటే?
సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. గాయంతో ఆల్‌రౌండర్ దూరం
సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. గాయంతో ఆల్‌రౌండర్ దూరం
Embed widget